‘వైకాపా పరిపాలనలో దళితులపై దాడులు’
దళిత ద్రోహి జగన్మోహన్రెడ్డి అని ఊరకే అనడం లేదు. వైకాపా పరిపాలన వచ్చిన నాటి నుంచి దళితులపై దాడులు మొదలయ్యాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ అన్నారు. విదేశీ విద్యకు అంబేడ్కర్ పేరు తొలగించి జగన్మోహనరెడ్డి పేరు
తెదేపా ఎస్సీ విభాగం చేపట్టిన నిరవధిక దీక్షకు సంఘీభావంగా పాల్గొన్న నారా లోకేశ్
మంగళగిరి (తాడేపల్లి), న్యూస్టుడే: దళిత ద్రోహి జగన్మోహన్రెడ్డి అని ఊరకే అనడం లేదు. వైకాపా పరిపాలన వచ్చిన నాటి నుంచి దళితులపై దాడులు మొదలయ్యాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ అన్నారు. విదేశీ విద్యకు అంబేడ్కర్ పేరు తొలగించి జగన్మోహనరెడ్డి పేరు పెట్టుకోవడాన్ని నిరసిస్తూ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కనికళ్ల చిరంజీవి, గుంటూరు పార్లమెంటు ఎస్సీ సెల్ అధ్యక్షుడు మైనర్బాబు, నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ఎర్రగుంట్ల భాగ్యారావు, మరో పదిమంది సంయుక్తంగా తెదేపా ఎస్సీ సెల్ ఆధ్వర్యాన మంగళగిరిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. విదేశీ విద్యకు అంబేడ్కర్ పేరు తిరిగి పెట్టేవరకు దీక్ష విరమించేది లేదని నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తనికళ్ల చిరంజీవి బృందం స్పష్టం చేసింది. దీక్షకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం సాయంత్రం సంఘీభావం తెలిపి మాట్లాడారు. పులివెందులలో దళిత మహిళ నాగమ్మని అత్యాచారం చేసి చంపేస్తే నేటి వరకు ఆ కుటుంబానికి న్యాయం చేయలేదన్నారు. ఎస్సీ ఉపప్రణాళిక నిధులు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. ‘సంక్షేమ కార్యక్రమాలకు చేసిన ఖర్చుని సబ్ ప్లాన్గా చూపుతున్నారు. అంబేడ్కర్ స్మృతివనాన్ని రద్దు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్కరికి రుణం మంజూరు చేయలేదు. తెదేపా ఎస్సీ విభాగం అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు, రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి కంభంపాటి శిరీషా, పార్లమెంటు టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి జీవన్కుమార్, గుంటూరు పార్లమెంటు తెదేపా ప్రధాన కార్యదర్శి పోతునేని శ్రీనివాసరావు, నియోజకవర్గ పార్టీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్ధయ్య, పట్టణ అధ్యక్షుడు దామర్లరాజు, ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు, తెదేపా బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు, తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
[ 24-04-2024]
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
పింఛన్లు ఇంటివద్దే ఇచ్చేలా ఆదేశించండి: ఈసీకి చంద్రబాబు లేఖ
[ 24-04-2024]
పింఛన్దారులకు మే నెల పింఛను వారి ఇంటి వద్దే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. -
వైకాపా ఎంపీ నందిగం సురేశ్పై వాలంటీర్ ఆనంద్బాబు పోటీ
[ 24-04-2024]
వైకాపా ఎంపీ నందిగం సురేశ్పై ఓ వాలంటీరు పోటీకి దిగుతున్నారు. -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
[ 24-04-2024]
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
[ 24-04-2024]
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
[ 24-04-2024]
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
వైఎస్ఆర్ను తిట్టిన బొత్స.. జగన్కు తండ్రి సమానులా?: షర్మిల
[ 24-04-2024]
మంత్రి బొత్స సత్యనారాయణ తండ్రి సమానులంటూ సీఎం జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. -
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.