ప్రత్యేక ప్రణాళికతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి
‘నెల నెలా వెన్నెల’ కార్యక్రమం ప్రవేశపెట్టి గిరిజన బాలల విద్యా వికాసానికి బాటలు వేశారు. గిరిజన గ్రామంలో తొలి అడ్వెంచర్ ఉద్యానవనం నిర్మించి గిరిజనుల జీవనశైలి తెలిపే చిత్రాలు.. చిన్నారుల కోసం బాలవిహార్.. పెద్దల కోసం జలవిహార్ నిర్మించి ఆహ్లాదాన్ని పంచారు.
బృంద స్ఫూర్తితో పనిచేసి ఫలాలు అందిస్తాం
‘ఈనాడు’తో కలెక్టర్ శివశంకర్
ఈనాడు, నరసరావుపేట: ‘నెల నెలా వెన్నెల’ కార్యక్రమం ప్రవేశపెట్టి గిరిజన బాలల విద్యా వికాసానికి బాటలు వేశారు. గిరిజన గ్రామంలో తొలి అడ్వెంచర్ ఉద్యానవనం నిర్మించి గిరిజనుల జీవనశైలి తెలిపే చిత్రాలు.. చిన్నారుల కోసం బాలవిహార్.. పెద్దల కోసం జలవిహార్ నిర్మించి ఆహ్లాదాన్ని పంచారు. స్పందనకు వచ్చే అర్జీదారులకు దాతల ద్వారా ఆకలి తీర్చుతున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కమాండ్ కంట్రోల్కు రూపకల్పన చేశారు. ఆయనే పల్నాడు జిల్లా తొలి పాలనాధికారి శివశంకర్ లోతేటి. నూతన జిల్లా ప్రగతిపై ప్రణాళికలు, ప్రాధాన్యతలపై ‘ఈనాడు’తో ప్రత్యేక ముఖాముఖి. వివరాలు ఆయన మాటల్లోనే..
పల్నాడు ప్రగతిపై..: పల్నాడు జిల్లాలో పర్యటక, ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలు ఉన్నాయి. సాగర్ ప్రాజెక్టు సందర్శనకు వారాంతాల్లో కూడా వందల మంది మాత్రమే వస్తున్నారు. ఇక్కడ పర్యటకులకు వసతుల కల్పనతోపాటు ఉద్యానవనాలు అభివృద్ధి చేయడం ద్వారా వేలమంది పర్యటకులను ఆకర్షించి ఆదాయం పెంచుకోవచ్చు. పర్యటకుల సంఖ్య పెరిగితే యువతకు ఉపాధితోపాటు జిల్లా ప్రగతికి దోహదపడుతుంది. సాగర్ జలాశయంలో లాంచీస్టేషన్ పక్కనే 8 ఎకరాల భూమిని గుర్తించాం. అక్కడి నుంచి జలాశయాన్ని తిలకించే ఏర్పాట్లతోపాటు ఆహ్లాదంగా గడిపేలా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం. పల్నాడు ప్రాంతంలో చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యటక ప్రాంతాల్లో సర్క్యూట్ ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నాం.
ప్రధాన సమస్యలపై..: విజయపురిసౌత్కు పంచాయతీగా గుర్తింపు లేకపోవడంతో అక్కడ అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఉన్నాయి. పంచాయతీ ఏర్పాటుపై ఆదేశాలిచ్చాం. ప్రతి శుక్రవారం క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాం. అధికారులు బృంద స్ఫూర్తితో పనిచేసేలా ముందుకెళుతున్నాం. యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ జిల్లాను అన్నిరంగాల్లో ముందుకు నడిపేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాం.
‘స్పందన’ ఫిర్యాదుల పరిష్కారం
స్పందన దరఖాస్తుల పరిష్కారానికి కలెక్టరేట్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి 28 మందిని ఎంపిక చేసుకుని వారి సేవలు ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఉద్యోగి స్పందన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ చేపడతారు. జిల్లా కార్యాలయాల స్థాయిలో పరిష్కరించాల్సిన దరఖాస్తులను ఆయా అధికారులకు పంపి వీరే ఫాలో అప్ చేసి పరిష్కారమయ్యేలా చూస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు వల్ల దరఖాస్తు పరిష్కారం తీరును తెలుసుకోవచ్చు. వీరందరిని పర్యవేక్షించడానికి ఒక అధికారిని నియమించి పనితీరును మదింపు చేస్తున్నాం. దాతల సహకారంతో ప్రతి సోమవారం స్పందనకు వచ్చే అర్జీదారులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం.
ప్రాధాన్య అంశాలపై....
పల్నాడు ప్రధానంగా వ్యవసాయాధారిత జిల్లా. ఇక్కడ సంప్రదాయ పంటల స్థానంలో మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తులు పండించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. వినుకొండ నియోజకవర్గంలో పండ్లు, పూలు, కూరగాయల పంటలకు నేలలు, వాతావారణం అనుకూలంగా ఉంది. ఈ ప్రాంతాన్ని ఉద్యాన క్లస్టర్గా ఎంపిక చేసి నూతన పంటలు సాగు చేయిస్తాం. మెట్ట పంటల సాగులో ముందడుగు వేసేలా ప్రయోగాలకు పల్నాడును వేదికగా చేసుకుంటాం. వినుకొండ ప్రాంతాన్ని ఉద్యాన క్లస్టర్గా గుర్తించి ప్రత్యేక దృష్టి సారిస్తాం. పంటలు పండించడమే కాకుండా వేగంగా పట్టణాలు, నగరాలకు రవాణా చేసేలా కార్యాచరణ ప్రణాళికకు కసరత్తు చేస్తున్నాం. ప్రజల్లో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సరళిని మార్చుకునేలా రైతులను చైతన్య పరుస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళలను ఆదుకునేందుకే సూపర్ -6 పథకాలు: నారా బ్రాహ్మణి
[ 20-04-2024]
రాష్ట్ర ప్రజల కోసం తెదేపా అధినేత చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు ఎవరూ సాటిరారని నారా బ్రాహ్మణి అన్నారు. -
వంతెనలు కూలుతున్నా.. ప్రాణాలు పోతున్నా.. కళ్లకు గంతలేనా..
[ 20-04-2024]
బీటలు వారిన పిల్లర్లు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారధులు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కీలకమైన వంతెనల జీవితకాలం ముగిసినా నిధుల కొరతతో కొత్తవి నిర్మించడం లేదు. -
అ‘తీగ’తిలేని ‘మార్గం’
[ 20-04-2024]
ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా తెదేపా ప్రభుత్వం ప్రారంభించినది అయితే పూర్తి చేయం. అవసరమైతే పనికిరాకుండా చేస్తాం ఇది జగన్ సర్కారు ఐదేళ్లుగా అవలంభిస్తున్న తీరు. -
కూలేదాకా.. కళ్లప్పగిస్తారా!
[ 20-04-2024]
బీటలు వారిన స్తంభాలు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారథులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి -
ఉడకని జీడిపప్పు
[ 20-04-2024]
వేటపాలెం అంటేనే జీడిపప్పు పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో వ్యాపారులు ఒకప్పుడు స్థానికంగా దొరికే జీడిపిక్కలను కొనుగోలు చేసి వాటిని కాల్చి పప్పుగా తయారు చేసి విక్రయించేవారు. -
నేరచరిత్ర లేని సచ్ఛీలుడు తెన్నేటి
[ 20-04-2024]
బాపట్ల లోక్సభ స్థానం తెదేపా ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ తనకు రూ.15.93 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో ప్రకటించారు -
మందులో ముంచేసి.. పీల్చి పిప్పి చేసి..
[ 20-04-2024]
రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం విధిస్తాం. మూడు విడతల్లో మద్యం దుకాణాలు తగ్గించుకుంటూ వెళ్లి పూర్తిగా ఎత్తేస్తాం. మందు ముట్టుకోవాలంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచుతాం. మద్యపాన నిషేధం చేశాకే 2024లో ఓట్లు అడగడానికి వస్తాను. -
ఎంపీ 1, ఎమ్మెల్యేకు 19 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజున గుంటూరు పార్లమెంట్ స్థానానికి కిలారి వెంకటరోశయ్య వైకాపా తరఫున నామినేషన్ను దాఖలు చేశారు -
కొనసాగుతున్న ఒత్తిళ్లతో వాలంటీర్ల రాజీనామా
[ 20-04-2024]
ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో 20 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్రరావు తెలిపారు. -
అట్టహాసంగా శ్రావణ్కుమార్ నామినేషన్
[ 20-04-2024]
తాడికొండ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం తాడికొండ ఆర్వో గంగరాజుకు నామినేషన్ పత్రాలు అందజేశారు -
ఎన్నికల వేళా.. ఆగని దోపిడీ
[ 20-04-2024]
అధికారం అండగా ఉందని ఏం చేసినా అడ్డుకునేవారు లేరని వైకాపా నేతలు బరితెగించారు. కృష్ణానదిలో రాత్రివేళ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తూ తరలించి జేబులు నింపుకొంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వారికి అడ్డంకి లేకుండా పోయింది. -
ఏళ్లుగా ఉద్యోగులకు శిక్షే
[ 20-04-2024]
అనేక సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం జగన్ మాటలు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని.. పలు హామీలు ఇచ్చి వాటిని గాలికొదిలేశారు. -
తాగునీరివ్వకపోతే బతికేదెలా..?
[ 20-04-2024]
తమకు తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేయడం లేదని ప్రత్తిపాడులోని మహబూబ్ నగర్ కాలనీ వాసులు శుక్రవారం గుంటూరు- పర్చూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో జేఎల్ఎం మృతి
[ 20-04-2024]
విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్) మృతి చెందిన ఘటన ఇది. విద్యుత్తు శాఖ ఉద్యోగులు, బాధితుల కథనం ప్రకారం... పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అడుసుమల్లి సుబ్రహ్మణ్యం, చిలకమ్మ దంపతుల పెద్దకుమారుడు రాజేశ్ (27) ఇదే గ్రామంలో జేఎల్ఎంగా పనిచేస్తున్నారు. -
కలగా మినీ రైతుబజార్లు
[ 20-04-2024]
నాడు అలా...గత ప్రభుత్వంలో వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు 2018లో పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గంలో రైతుబజార్ను అందుబాటులోకి తెచ్చారు. ఆ రైతుబజార్లో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు. -
ఓటు హక్కు వినియోగానికి కార్మికులకు సెలవు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరగనున్న పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మికులకు సెలవు ప్రకటించినట్లు మూడో జోన్ కార్మిక శాఖ ఇన్ఛార్జి సంయుక్త కమిషనర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు -
మద్యం మత్తు.. కుటుంబాలు చిత్తు
[ 20-04-2024]
గత నెల 18వ తేదీన తెనాలి మున్సిపల్ కార్యాలయం చెంతనే నిర్మాణంలో ఉన్న మార్కెట్ భవంతిలో రవికిరణ్ (37) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారణం మద్యం మత్తు. మద్యం తాగి చెంతనే దోమల కాయిల్ వెలిగించుకుని నిద్రపోయిన అభాగ్యుడు కాయిల్ దుప్పటికి తగిలి మంటలు చెలరేగినా మత్తు వల్ల లేవలేక కాలిపోయాడు
తాజా వార్తలు (Latest News)
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు