డీఏపీ ధర మోత
వేమూరు మండలం జంపనికి చెందిన ప్రదీప్ డీఏపీ ఎరువు కోసం స్థానిక రైతు భరోసా(ఆర్బీకే)కి వెళ్లాడు. కార్యాలయంలోని వ్యవసాయ సహాయకులు ప్రస్తుతం నిల్వ లేదని చెప్పడంతో వెనుదిరిగాడు. వరి పైరుకు తక్షణం ఎరువు వేయాల్సిరావడంతో తెనాలిలోని
నల్లబజారులో ఎమ్మార్పీ కంటే రూ.50 నుంచి రూ.100 అదనం
చోద్యం చూస్తున్న వ్యవసాయాధికారులు
వేమూరు, న్యూస్టుడే: వేమూరు మండలం జంపనికి చెందిన ప్రదీప్ డీఏపీ ఎరువు కోసం స్థానిక రైతు భరోసా(ఆర్బీకే)కి వెళ్లాడు. కార్యాలయంలోని వ్యవసాయ సహాయకులు ప్రస్తుతం నిల్వ లేదని చెప్పడంతో వెనుదిరిగాడు. వరి పైరుకు తక్షణం ఎరువు వేయాల్సిరావడంతో తెనాలిలోని ఓ ప్రైవేటు దుకాణానికి వెళ్లాడు. రూ. 1342 విక్రయించాల్సిన డీఏపీ ఎరువు బస్తాకు రూ.1400 చెల్లించాలని దుకాణ నిర్వాహకులు చెప్పారు. అదేమని ప్రశ్నిస్తే డీఏపీ స్టాకు లేదని సమాధానం ఇచ్చారు. అదనుకు ఎరువు వేయకపోతే పైరు దెబ్బతింటుందని భావించి, చేసేది లేక వారు అడిగినంత చెల్లించి ఎరువు కొనుగోలు చేశాడు. ఇలాంటి పరిస్థితి ప్రదీప్ ఒక్కడిదే కాదు. జిల్లాలో చాలామంది డీఏపీ ఎరువు కొనుగోలుకు ఎమ్మార్పీ కంటే అదనంగా చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు.
నిల్వ చేసిన కాంప్లెక్స్ ఎరువుల బస్తాలు
వరిపైరుకు మొదటి దఫా..
వ్యవసాయాధికారుల సూచనల మేరకు వరి పైరుకు మొదటి దఫాలో డీఏపీ ఎరువుతోపాటు, యూరియా కలిపి చల్లుతారు. రైతులు చెబుతున్న లెక్క ప్రకారం డీఏపీ ఎరువు ఎకరాకు కనీసం 50 కిలోలు వాడతారు. ఈ లెక్కన వరి పైరుకే 2.9 లక్షల ఎకరాలకు మూడు లక్షల బస్తాల డీఏపీ కావాలి. ఇవిగాక కూరగాయలు, అరటి తదితర ఉద్యాన పంటలకు మరో 60 వేల బస్తాలు మొత్తం కలిపి 3.5 లక్షల డీఏపీ ఎరువుల బస్తాలు కావాలి. ప్రస్తుతం ఆ స్థాయిలో రైతు భరోసా కేంద్రాల్లో నిల్వలు లేవు. ఆర్బీకేలకు వచ్చిన సరకు ఏరోజుకారోజు విక్రయిస్తున్నారు. రైతులకు పూర్తిస్థాయిలో అందని పరిస్థితి నెలకొంది. గమనించిన ప్రైవేటు వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా రూ. 50 నుంచి రూ. 100 చొప్పున అదనంగా పెంచి అమ్ముతున్నారు. ఇదంతా వ్యవసాయాధికారులకు తెలిసినా నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది పెరిగిన కాంప్లెక్స్, డీఏపీ ధరలతో రైతులు సతమతమవుతుంటే అది చాలదన్నట్లు ప్రైవేటు వ్యాపారులు డీఏపీని ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తుండటంతో అన్నదాతలు బెంబేలెత్తిపోతున్నారు. డీఏపీ ఎరువులకు ప్రస్తుతం కొరత లేదని తెనాలి ఇంఛార్జి ఏడీఏ వెంకట్రావ్ పేర్కొన్నారు. ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలకు ఎరువులు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉంచుతామని వివరించారు.
చల్లకుంటే దిగుబడులపై ప్రభావం
బాపట్ల జిల్లాలో 1.16 లక్షల హెక్టార్లలో ప్రస్తుతం వరి సాగవుతుంది. వెద పద్ధతి ద్వారా గాని, సాధారణ పద్ధతిలో గాని దాదాపుగా నాట్లు పూర్తయ్యాయి. అయితే మొదటి దఫా ఎరువులు చల్లడానికి అన్నదాతలు సిద్ధమయ్యారు. ప్రస్తుతం వెద పద్ధతిన వరి విత్తి నెల రోజులు దాటినవారు, నాట్లు వేసి వారం రోజులు గడిచినవారు మొదటి దఫాలో డీఏపీ, యూరియా చల్లాలి. అయితే డీఏపీ ఆర్బీకేల వద్ద రైతులకు కావాల్సినంత అందుబాటులో లేకపోవడంతో అదను దాటిపోతుందని రైతులు వాపోతున్నారు. వెంటనే ఎరువులు చల్లకపోతే వరి దుబ్బు చేయదని, దీంతో దిగుబడి గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు. అయితే వ్యవసాయాధికారులు మాత్రం రైతులకు డీఏపీ నిల్వలపై స్పష్టత ఇవ్వకుండా ప్రత్యామ్నాయంగా కాంప్లెక్స్ ఎరువులు వాడాలని సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వం మారితేనే యువతకు భవిత
[ 29-03-2024]
ప్రజలకు తాగు నీటిని అందించలేని వైకాపా ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాలను మాత్రం విచ్చలవిడిగా అందుబాటులోకి తీసుకొచ్చి యువతకు తీరని నష్టాన్ని కలిగిస్తోందని ఎన్డీయే గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. -
అనుమతి ఒకచోట..ప్రచారం మరోచోట
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని యంత్రాంగం చెబుతుంటే.. అధికార పార్టీకి చెందిన వారు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. -
ఎన్నికల ప్రచారంలో వాలంటీరు హల్చల్పై ఫిర్యాదు
[ 29-03-2024]
మండలంలోని కారంపూడిపాడు గ్రామంలో ఈ నెల 22న వైకాపా అభ్యర్థి బలసాని కిరణ్కుమార్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీరు కె.నరసింహరావు పాల్గొన్నారు. -
రోడ్డునే మింగేసిన ఇసుకాసురులు
[ 29-03-2024]
జనం ఇబ్బంది పడితే మాకేంటి? మా ప్రయోజనం నెరవేరితే చాలనేలా అధికార పార్టీ నేతలు వ్యవహరించారు. అక్రమార్జనకు ఉన్న ఏ అవకాశాన్ని వారు వదులుకోలేదు. -
కోడ్ ఉన్నా.. చోద్యం చూస్తున్నారు!
[ 29-03-2024]
ఈ చిత్రం చూశారా.. కృష్ణా తీరంలోని అమరావతి మండలం మల్లాది రీచ్లో గురువారం రాత్రి వేళ భారీ యంత్రాలతో ఇసుక తవ్వి లారీలకు నింపుతున్నారు. అనుమతి ఉన్న రీచ్లలో సైతం సూర్యాస్తమయం తర్వాత కూలీల చేత కూడా ఇసుక తవ్వకాలు చేయకూడదు. -
బల్లికురవ ఎస్సైపై విచారణకు ఆదేశం
[ 29-03-2024]
అధికార వైకాపా నేతల మెప్పు పొందాలని చూసినా.. బాధితులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకునే పోలీసు అధికారులు తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పడానికి తాజాగా బల్లికురవ ఎస్సై నాగశివారెడ్డి ఉదంతమే ఓ నిదర్శనం. -
ఓటరు జాబితాలో మీ పేరుందా?
[ 29-03-2024]
‘సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది... త్వరలో జరగబోయే ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన వారి దగ్గర నుంచి ఓటున్న ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి... ఎవరికి వారు తాము వేయకపోతే ఏమవుతుందనే భావన విడనాడాలి. -
నియమావళి అమలు ఇలాగేనా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 12 రోజులు గడిచింది. అమలుకు సంబంధించి ప్రత్యేకాధికారులను నియమించినా కొన్నిచోట్ల కోడ్ ఉల్లంఘనలు కనపడుతూనే ఉన్నాయి. -
గుండ్లకమ్మ జలాశయంలో మొసలి కలకలం
[ 29-03-2024]
గుండ్లకమ్మ జలాశయంలో మత్స్యకారుడి వలకు మొసలి చిక్కడంతో స్థానికంగా కలకలం రేగింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కన్ను పడితే కబ్జానే..
[ 29-03-2024]
తిమ్మాయిపాలెం గ్రామంలోని 7.05 ఎకరాలు నక్కలవాగు పేరుతో వాగు పోరంబోకు స్థలం ఉంది. ఇది జాతీయ రహదారికి పక్కనే రోడ్డుకు ఆనుకొని ఉండటంతో దీనిపై వైకాపా నేత గద్దలా వాలిపోయారు. -
వైకాపా ప్రచారంలో క్షేత్ర సహాయకుడు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ వచ్చినా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద సిబ్బంది ఇంకా వైకాపా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. -
మరెందుకు ఆలస్యం.. రాజీనామా చేయండి..
[ 29-03-2024]
రాజీనామా చేసేయండి.. హాయిగా పార్టీ ప్రచారంలో పాల్గొనండి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, మళ్లీ తీసుకుంటామని ప్రస్తుతానికి అంతా చూసుకుంటామంటూ చెప్పుకొస్తున్నారు. -
ఎత్తిపోతల పథకాలు హుళక్కే
[ 29-03-2024]
పల్నాడు జిల్లాలో వైకాపా పాలన ఐదేళ్లలో కొత్తగా ఒక్క ఎత్తిపోతల పథకం నిర్మించలేదు. నీటి అనుమతులిచ్చి నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపారు. -
12 మంది వైకాపా కౌన్సిలర్ల వేరు బాట
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రభావం పురపాలక సంఘంలోని పాలకపక్షంపై పడింది. చిలకలూరిపేట శాసనసభ స్థానంలో అధికార వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు వ్యవహారం కౌన్సిలర్ల మధ్య చీలికకు దారి తీసింది. -
పక్కదారి పట్టిన రేషన్ బియ్యం
[ 29-03-2024]
రేషన్ బియ్యం పక్కదారి పట్టడంతో నరసరావుపేటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నెల నెలా పేదలకు బియ్యం సక్రమంగా పంపిణీ చేస్తున్నామని చెప్పే అధికారులు ఆ బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎన్నికల నిబంధనలు బేఖాతర్
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలై పదిరోజులు దాటినా నేటికీ పలు చోట్ల అధికారపార్టీ ఆగడాలకు అదుపు లేకుండా ఉంది. క్రోసూరు ఎస్టీ కాలనీ, గాదెవారిపాలెంలోని మంచినీటి పథకం ట్యాంకులకు వైకాపా రంగులు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్