గురువుల హాజరు గందరగోళం
ప్రభుత్వమే హాజరు నమోదుకు పాఠశాలల్లో బయోమెట్రిక్ డివైస్లు ఏర్పాటు చేయాలని, ఫోన్లో ముఖ ఆధారిత హాజరు నమోదు చేసుకునే విధానానికి స్వస్తి పలకాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ముఖ ఆధారిత హాజరు యాప్లో సులభంగా
ఆందోళనలో ఉపాధ్యాయ వర్గం
ప్రభుత్వమే హాజరు నమోదుకు పాఠశాలల్లో బయోమెట్రిక్ డివైస్లు ఏర్పాటు చేయాలని, ఫోన్లో ముఖ ఆధారిత హాజరు నమోదు చేసుకునే విధానానికి స్వస్తి పలకాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ముఖ ఆధారిత హాజరు యాప్లో సులభంగా నమోదు చేయవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి రామారావు చెబుతున్నారు.
పాఠశాలల్లో ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరు నమోదులో తొలిరోజు తడబాటు తప్పలేదు. మంగళవారం నుంచి తప్పనిసరిగా ఉపాధ్యాయులు కొత్త యాప్లో తమ హాజరు నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ యాప్ వినియోగించడంపై ఉపాధ్యాయులకు సరైన సమాచారం లేదు. ఆన్లైన్లో కొందరు డౌన్లోడ్ చేసే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. తమ ప్రధానోపాధ్యాయులు, పాఠశాల కాంప్లెక్స్ ఛైర్మన్లు పంపిన లింక్ల ద్వారా పేర్లను నమోదు చేసే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఒకేసారి వేలాదిమంది హాజరు నమోదుకు సిద్ధమవ్వడంతో సర్వర్ ఆగిపోయింది. సెల్ఫీ తీసుకున్న తరువాత హాజరు కొందరివి ఫెయిలవ్వగా.. చాలామందికి లాగిన్ అయ్యేందుకు కూడా అవకాశం రాలేదు. ఉదయం 9 గంటల్లోపు ఉపాధ్యాయుల హాజరు పూర్తి చేయాల్సి ఉండగా మధ్యాహ్నం 2 వరకు సర్వర్ అందుబాటులోకి రాలేదు. దీంతో ఉపాధ్యాయుల హాజరు నమోదు ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనిపై ఉపాధ్యాయుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. గతంలో వాడిన పరికరాలను పునరుద్ధరించకుండా ఎవరికి వారు సొంత యాప్ల ద్వారా హాజరు వేయాలని చెప్పడం సరికాదని చెబుతున్నారు. బాపట్ల జిల్లాలోని 25 మండలాల్లో 1474 ప్రభుత్వ పాఠశాలుండగా.. ఐదు వేలమందికి పైగా ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో అతికొద్ది మంది మాత్రమే యాప్ను తమ చరవాణిలో డౌన్లోడ్ చేసుకుని హాజరు వేయడానికి ప్రయత్నించారు. మరోవైపు ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు అధిక శాతం మంది అసలు యాప్లు, రిజిస్త్రేషన్ జోలికి వెళ్లలేదు. ఉదయాన్నే బడిలోని హాజరు రిజిస్టర్లో సంతకం చేసే బదులు ఈ యాప్లో హాజరు నమోదు సులభమని విద్యాశాఖాధికారులు చెప్పుకొస్తున్నారు.
తరగతి గదుల్లో చరవాణి వినియోగించకూడదనే నిబంధనలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం తాజాగా ఎవరి చరవాణిలో వారే ముఖ ఆధారిత హాజరు వేయాలని అదేశాలు జారీ చేయడంతో బోధనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉదయాన్నే 9 గంటలకు వెళ్లి హాజరు వేయడంపై ఎవరికి అభ్యంతరాలు లేవు. అందుకోసం ప్రత్యేకంగా పరికరాలను ఏర్పాటు చేయాలి. బోధనలో లోపాలు ఉంటే పర్యవేక్షణ పెంచాలి. అందుకోసం ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలి.
ఉపాధ్యాయుల పని తీరు కొలవడానికి రకరకాల యాప్లు కొలమానం కాదు. ప్రమాణాలతో కూడిన విద్య విద్యార్థులకు అందుతుందా అనేది చూడాలి. ఒత్తిడి లేని వాతావరణం పాఠశాలలో కల్పిస్తే బోధన మెరుగుపడుతుంది. ప్రభుత్వం కక్ష పూరితంగా కాకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలి. గతంలో వాడిన డివైస్లను పునరుద్ధరించాలి.
కొత్తగా ప్రవేశపెట్టిన యాప్కు జీతాలతో లింక్ చేస్తామనడం సరికాదు. సర్వర్ సామర్థ్యం పెంచకుండా ఆన్లైన్ హాజరు వేయమనడంతో విలువైన కాలం వృథా అవుతుంది. కొత్త యాప్ పట్టణ ప్రాంతంలోనే సరిగా లేదంటే ఇక గ్రామీణ ప్రాంతంలో ఎలా పని చేస్తుందో అర్థం కావడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు