‘గుంటూరు ఛానల్ పొడిగింపు పనులు చేపట్టాలి’
గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేసి వెంటనే పనులు చేపట్టాలని నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహనరావు కోరారు. పర్చూరు బొమ్మల కూడలి సమీపంలో మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు.
నిరాహార దీక్ష చేస్తున్న నల్లమడ రైతు సంఘం నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్న డాక్టర్ రాజమోహనరావు
పర్చూరు, న్యూస్టుడే: గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేసి వెంటనే పనులు చేపట్టాలని నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహనరావు కోరారు. పర్చూరు బొమ్మల కూడలి సమీపంలో మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే దీక్ష ఉద్దేశమని తెలిపారు. గుంటూరు ఛానల్ను పొడిగించడం ద్వారా బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని 50 గ్రామాల్లో తాగు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన పని చేపట్టడంలో జరుగుతున్న జాప్యం బాధాకరమన్నారు. 2019 ఎన్నికల సమయంలో కాకుమాను, పెదనందిపాడు, ప్రత్తిపాడు, ఇంకొల్లు సభల్లో జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు ఛానల్ పనులు చేపడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన ప్రత్తిపాడులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మరోసారి వాగ్దానం చేశారన్నారు. 85 సంవత్సరాలుగా రైతులు పోరాడుతున్నారని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కోసం ఇంతగా ఆందోళన చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. సర్వేలు, హామీలతో కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు వక్తలు మాట్లాడుతూ గుంటూరు ఛానల్ పొడిగింపునకు అవసరమైన నిధులు వెంటనే విడుదల చేసి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంఘం ప్రతినిధులు కారుమంచి విజయకుమార్, యార్లగడ్డ అంకమ్మచౌదరి, నరిశెట్టి అచార్యులు, కోట హరిప్రసాద్, కాపు రవిచంద్ర, కొల్లా రామన్, అడ్డగడ వెంకటేశ్వర్లు, రావి రంగనాథబాబు, జాలాది సుధీర్, లంకా ప్రసాద్, దండా శ్రీనివాసరావు, చెన్నుపాటి సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. శిబిరం వద్దకు పలువురు నాయకులు, రైతులు వచ్చి సంఘీభావం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం