నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు చర్యలు
ప్రజలకు విద్యుత్తు కోతలు లేకుండా నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తు సరఫరా అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నరసరావుపేట డివిజన్ విద్యుత్తు పర్యవేక్షక ఇంజినీరు (ఈఈ) ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన ‘న్యూస్టుడే’ ముఖాముఖిలో మాట్లాడారు.
‘న్యూస్టుడే’ ముఖాముఖిలో నరసరావుపేట డివిజనల్ విద్యుత్తు ఈఈ శ్రీనివాసరావు
ఈపూరు, న్యూస్టుడే
ప్రజలకు విద్యుత్తు కోతలు లేకుండా నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తు సరఫరా అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నరసరావుపేట డివిజన్ విద్యుత్తు పర్యవేక్షక ఇంజినీరు (ఈఈ) ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన ‘న్యూస్టుడే’ ముఖాముఖిలో మాట్లాడారు.
నరసరావుపేట డివిజన్లో 35,170 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అన్నింటికీ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తాం. మీటర్ల ఏర్పాటు గురించి రైతుల్లో అపోహలున్నాయి. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు వివరించి రైతుల అంగీకారంతో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేస్తాం. నగదు బదిలీ కింద రైతుల బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేసిన డబ్బును ఆటోమెటిక్గా బిల్లులకు జమ చేసుకోడానికి రైతుల అంగీకార పత్రాలను సేకరిస్తున్నాం. ఇప్పటి వరకు 34 శాతం మంది అంగీకార పత్రాలు ఇచ్చారు.
జగనన్న కాలనీలకు సరఫరా పురోగతి
నరసరావుపేట డివిజన్ పరిధిలో 357 జగనన్న కాలనీలకు విద్యుత్తు సరఫరా అందించాల్సి ఉంది. ఈ కాలనీల్లో 40,869 ఇళ్లకు విద్యుత్తు సరఫరా అందించడానికి రూ.109 కోట్లు ఖర్చు చేయనున్నాం. ఇళ్లకు ఉచితంగా మీటర్లు, సర్వీసు వైరు, బోర్డు ఏర్పాటు చేసి ఇంటి నిర్మాణం పూర్తయ్యాక సరఫరా అందిస్తాం. నరసరావుపేట డివిజన్లో 2021- 2022 సంవత్సరానికి 1999 వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చాం. 2022- 2023 సంవత్సరానికి సంబంధించి ఈ నాలుగు నెలల్లో 643 కనెక్షన్లు మంజూరు చేశాం. జలకళలో ఇప్పటి వరకు 109 సర్వీసులు మంజూరు చేశాం. కనెక్షను మంజూరై డీడీలు చెల్లించిన రైతులకు వెంటనే ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నాం. దరఖాస్తులు చేసుకున్న రైతులకు ప్రాధాన్య క్రమంలో మంజూరు చేస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్లు పాడైపోతే ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లో కొత్త ట్రాన్స్ఫార్మరు ఏర్పాటు చేస్తున్నాం.
కోతల నివారణకు చర్యలు
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెకీ) నుంచి 7 వేల మెగావాట్లు విద్యుత్తును 25 ఏళ్ల పాటు సరఫరా చేయడానికి ప్రభుత్వం సంబంధిత సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇది కార్యరూపం దాలిస్తే వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడంతో పాటు ఇళ్లకు కూడా కోతలు లేకుండా నిరంతరాయ నాణ్యమైన విద్యుత్తు అందించడం సాధ్యపడుతుంది.ప్రజలకు అంతరాయాలు లేని సరఫరా అందించడానికి వివిధ కొత్త నిర్మాణాలు చేపడుతున్నాం. డివిజన్కు కొత్తగా ఏడు 33 కేవీ సబ్స్టేషన్లు మంజూరు కాగా కొమెరపూడి, రావిపాడుల్లో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. వేల్పూరు, వినుకొండ (వెల్లటూరు రోడ్డు), బ్రాహ్మణపల్లి, పెదపాలెం, ఉప్పలపాడు గ్రామాల పరిధిలో స్థల సేకరణలు పూర్తయింది. అక్కడ త్వరలో పనులు ప్రారంభిస్తాం. సింగిల్ ఫేజ్ విద్యుత్తు సరఫరా చేస్తున్న మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో నిరంతరం త్రీ ఫేజ్ విద్యుత్తు సరఫరా సౌకర్యం కల్పించడానికి ఎల్డబ్ల్యుఈ పథకం కింద ప్రభుత్వం అంగలూరు, బొమ్మరాజుపల్లి గ్రామాలను ఎంపిక చేసింది. అంగలూరులో ఇప్పటికే పనులు ప్రారంభించాం.
బాకాయి వసూళ్లపై..
నరసరావుపేట డివిజన్ పరిధిలో వివిధ వర్గాల నుంచి మొత్తం రూ.37 కోట్ల బకాయిలు పేరుకున్నాయి. ఇందులో రూ.15 కోట్లు ప్రభుత్వ సంస్థల బకాయిలే ఉన్నాయి. బిల్లుల చెల్లింపులో బకాయిదారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో చర్యలకు ఉపక్రమించాం. బకాయిలున్న ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని నిర్ణయించాం. ఇప్పటికే డివిజన్లో వివిధ తహశీల్దారు కార్యాలయాలకు సరఫరా నిలిపివేశాం. వచ్చే నెల 10లోపు బకాయిలు చెల్లించిన ప్రభుత్వ కార్యాలయాలకు సర్ఛార్జీ మాఫీ చేస్తాం. బకాయిలు చెలించని ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు ఇస్తున్నాం. చెల్లించకపోతే వారి ఆస్తులు జప్తు చేయడానికి చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
[ 23-04-2024]
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
జగన్.. దేనికి సిద్ధం? మళ్లీ రూ.7లక్షల కోట్లు అప్పు చేయడానికా: షర్మిల
[ 23-04-2024]
ఐదేళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేని జగన్.. మళ్లీ ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధం అంటున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. -
తెదేపా నేతపై ఎస్ఐ అనుచిత వ్యాఖ్యలు.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
[ 23-04-2024]
బాపట్ల జిల్లా పర్చూరులో కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్ సందర్భంగా ఎస్సై శివనాగిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
[ 23-04-2024]
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
వైకాపాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీనామా
[ 23-04-2024]
వైకాపాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ చిరంజీవి రెడ్డి రాజీనామా చేశారు. -
జగనన్న సమర్పించు.. గోతుల రాజ్యం!
[ 23-04-2024]
జగనన్న పాపాలు ఎన్నని చెప్పేది.. ఎందెందు వెతికినా.. అన్నింటా లోపాలే.. అన్నిచోట్లా అసమర్థ పాలనే! రోడ్లను చూడండి... రాళ్లు తేలి.. గుంతలు పడి... బీటలువారి.. కనీసం ద్విచక్ర వాహనమైనా ముందుకు కదల్లేని దుస్థితి. -
పదిలో పైచేయి అమ్మాయిలదే
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 88.19 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికల హవా స్పష్టంగా కనిపించింది. బాలికలు 90.1 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలురు 86.32 శాతం ఉత్తీర్ణులయ్యారు. -
అమ్మఒడి సాయంలో మామ కోతలు
[ 23-04-2024]
ప్రజాధనాన్ని పేదలకు పంచుతుంటే విపక్షాలకు ఎందుకంత కడుపుమంట? వారి సంక్షేమానికి ప్రజాధనం వెచ్చించటం తప్పేనా అంటూ బహిరంగసభల్లో బీరాలు పలికే జగన్ ఆ పంపిణీ మాటునే తిరిగి దోచుకుంటున్నారు. -
మురుగున పడ్డ డబ్బులెక్కడ.. మామ?
[ 23-04-2024]
భట్టిప్రోలు మండలం ఐలవరం ఉన్నతపాఠశాలలో 400 మంది విద్యార్థులు విద్యా బుద్ధులు నేర్చుకుంటున్నారు. వీరికి పాఠశాలలో రెండు మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
సమర్థ్ యాప్తో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసుశాఖ సమర్థంగా విధులు నిర్వర్తించేలా వేగవంతమైన పోలీసు సేవల కోసం కొత్తగా సమర్థ్ మొబైల్ యాప్ను రూపొందించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. -
ఉప్పొంగిన ప్రజాభిమానం
[ 23-04-2024]
ప్రజాభిమానం ఉప్పొంగింది. వైకాపా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో జనం కసితో కదిలి కదం తొక్కారు. తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగారు. ఆ ప్రాంతమంతా పసుపు, తెలుపు, కాషాయ వర్ణాలమయమైంది. ఎమ్మార్పీస్ దండు సైతం వారి జెండాలతో కదిలారు. -
అలా..చతికిలపది!
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ర్యాంకు గతేడాది కంటే 10 స్థానాలు దిగజారి వెనుకబడింది. 2022- 23 సంవత్సరంలో జిల్లా ఆరో స్థానంలో నిలవగా ఈ ఏడాది 16వ స్థానానికి దిగజారింది. -
జోరుగా నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. గుంటూరు పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. -
పని భారం పెంచేశారు.. పోస్టులు భర్తీ చేయరు..
[ 23-04-2024]
జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం: ఇక్కడ ఐదు పోస్టులే ఉన్నాయి. అందులో ఒక సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. -
రూ.46 కోట్లు నష్టపోయాం
[ 23-04-2024]
గుంటూరు సర్వజనాసుపత్రిలో ఆరోగ్యశ్రీ కేసుల నమోదు ప్రక్రియలో సరైన కోణంలో పని చేయనందున ఆసుపత్రికి రావాల్సిన సుమారు రూ.46 కోట్లు ఆర్థికంగా నష్టపోయామని సూపరిôటెండెంట్ కిరణ్కుమార్ తెలిపారు. -
వసతి గృహ విద్యార్థుల ఉత్తీర్ణత మెరుగు
[ 23-04-2024]
జిల్లాలోని సంక్షేమ శాఖల వసతి గృహాల్లో ఉండి పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల నుంచి 93 మంది పరీక్షలకు హాజరు కాగా 76 మంది ఉత్తీర్ణులయ్యారు. -
స్పందించేందుకు ఇప్పుడు సమయం దొరికిందా..?
[ 23-04-2024]
రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో నమూనా గ్యాలరీ ధ్వంసంపై సీఆర్డీఏ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. -
‘మంగళగిరి రూపురేఖలు మారుస్తాం’
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మాదిరిగా తాము శవ రాజకీయాలు చేయమని యువనేత, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ అన్నారు. -
ప్రత్తిపాడును అగ్రగామిగా నిలుపుతా: బూర్ల
[ 23-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలుపుతానని ప్రత్తిపాడు కూటమి అభ్యర్థి డాక్టరు బూర్ల రామాంజనేయులు హామీ ఇచ్చారు. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమం విజయోత్సవాన్ని తలపించింది. -
మేలు సంగతి తర్వాత.. ముందు నీళ్లివ్వండి
[ 23-04-2024]
‘మేం అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం. సకల సౌకర్యాలు కల్పించి ప్రజల కష్టాలు తీరుస్తాం.’ ఇవీ వైకాపా నేతలు సమయం చిక్కినప్పుడల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు.‘ -
పదిలో పెరిగిన ఉత్తీర్ణత
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో పల్నాడు జిల్లా విద్యార్థులు నిరుటి కంటే 16 శాతం అదనంగా ఉత్తీర్ణత సాధించారు. కాగా రాష్ట్రస్థాయిలో జిల్లా 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 24959 మందికి గాను 21477 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. -
వివాదాల అగ్గిరాజేస్తున్న వైకాపా
[ 23-04-2024]
‘అగ్గి’రాజేస్తూ వివాదాలకు వైకాపా నాయకులు కాలుదువ్వుతున్నారు. మాచర్ల, గురజాలను మించిపోయేలా పెదకూరపాడులో ఇటీవల వరుస ఘటనలు భయకంపితులను చేస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు