పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్
పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని కలెక్టర్ విజయకృష్ణన్ హెచ్చరించారు. కలెక్టర్ ఛాంబర్లో పంచాయతీ అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
అధికారులతో సమావేశంలో పాలనాధికారి విజయకృష్ణన్
బాపట్ల, న్యూస్టుడే: పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని కలెక్టర్ విజయకృష్ణన్ హెచ్చరించారు. కలెక్టర్ ఛాంబర్లో పంచాయతీ అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో 459 గ్రామ పంచాయతీలు ఉండగా, 150 చోట్ల చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిర్మించినట్లు చెప్పారు. 97 గ్రామాల్లో వ్యర్థాల నుంచి వర్మీ కంపోస్టు ఎరువు తయారు చేస్తున్నారన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్ప యాప్లో రోజూ గ్రామాల వారీగా పారిశుద్ధ్య కార్యక్రమాల వివరాలను పంచాయతీ కార్యదర్శులు నమోదు చేయాలన్నారు. వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవటంపై ఈవోఆర్డీలను కలెక్టర్ నిలదీశారు. చెత్త సంపద కేంద్రాల నిర్వహణపై అధికారులకు కనీస అవగాహన ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలను స్వచ్ఛంగా ఉంచాల్సిన బాధ్యత కార్యదర్శులపై ఉందని స్పష్టం చేశారు. జిల్లాలో 406 సామాజిక మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంకాగా ప్రస్తుతం 107 మాత్రమే నిర్మించటంపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులను నిలదీశారు. ఏఈల పర్యవేక్షణ కొరవడటంతో కొన్ని ప్రాంతాల్లో ఇంకా నిర్మాణాలు ప్రారంభం కాలేదన్నారు. ఇప్పటి వరకు నిర్మించిన మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. డీపీవో రమేష్, డీఎల్పీవో వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొనసాగుతున్న ఒత్తిళ్లతో వాలంటీర్ల రాజీనామా
[ 20-04-2024]
ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో 20 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్రరావు తెలిపారు. -
అట్టహాసంగా శ్రావణ్కుమార్ నామినేషన్
[ 20-04-2024]
తాడికొండ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం తాడికొండ ఆర్వో గంగరాజుకు నామినేషన్ పత్రాలు అందజేశారు -
ఎన్నికల వేళా.. ఆగని దోపిడీ
[ 20-04-2024]
అధికారం అండగా ఉందని ఏం చేసినా అడ్డుకునేవారు లేరని వైకాపా నేతలు బరితెగించారు. కృష్ణానదిలో రాత్రివేళ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తూ తరలించి జేబులు నింపుకొంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వారికి అడ్డంకి లేకుండా పోయింది. -
ఏళ్లుగా ఉద్యోగులకు శిక్షే
[ 20-04-2024]
అనేక సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం జగన్ మాటలు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని.. పలు హామీలు ఇచ్చి వాటిని గాలికొదిలేశారు. -
తాగునీరివ్వకపోతే బతికేదెలా..?
[ 20-04-2024]
తమకు తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేయడం లేదని ప్రత్తిపాడులోని మహబూబ్ నగర్ కాలనీ వాసులు శుక్రవారం గుంటూరు- పర్చూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో జేఎల్ఎం మృతి
[ 20-04-2024]
విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్) మృతి చెందిన ఘటన ఇది. విద్యుత్తు శాఖ ఉద్యోగులు, బాధితుల కథనం ప్రకారం... పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అడుసుమల్లి సుబ్రహ్మణ్యం, చిలకమ్మ దంపతుల పెద్దకుమారుడు రాజేశ్ (27) ఇదే గ్రామంలో జేఎల్ఎంగా పనిచేస్తున్నారు. -
కలగా మినీ రైతుబజార్లు
[ 20-04-2024]
నాడు అలా...గత ప్రభుత్వంలో వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు 2018లో పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గంలో రైతుబజార్ను అందుబాటులోకి తెచ్చారు. ఆ రైతుబజార్లో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు. -
ఓటు హక్కు వినియోగానికి కార్మికులకు సెలవు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరగనున్న పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మికులకు సెలవు ప్రకటించినట్లు మూడో జోన్ కార్మిక శాఖ ఇన్ఛార్జి సంయుక్త కమిషనర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు -
మద్యం మత్తు.. కుటుంబాలు చిత్తు
[ 20-04-2024]
గత నెల 18వ తేదీన తెనాలి మున్సిపల్ కార్యాలయం చెంతనే నిర్మాణంలో ఉన్న మార్కెట్ భవంతిలో రవికిరణ్ (37) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారణం మద్యం మత్తు. మద్యం తాగి చెంతనే దోమల కాయిల్ వెలిగించుకుని నిద్రపోయిన అభాగ్యుడు కాయిల్ దుప్పటికి తగిలి మంటలు చెలరేగినా మత్తు వల్ల లేవలేక కాలిపోయాడు