జ్వరం పీడిస్తోంది
వినుకొండలోని ఉర్దూ పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థి పఠాన్ ఖాశిం పెదవలి నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఇంటిదగ్గర ఉన్నా తగ్గకపోవడంతో తల్లిదండ్రులు ప్రభుత్వాసుపత్రికి తీసుకు రావడంతో నీరసంగా
తరగతుల్లో తగ్గుతున్న విద్యార్థుల హాజరు
ప్రభుత్వాసుపత్రిలో విద్యార్థి పఠాన్ ఖాశింపెదవలి చేతికి సెలైన్
వినుకొండలోని ఉర్దూ పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థి పఠాన్ ఖాశిం పెదవలి నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఇంటిదగ్గర ఉన్నా తగ్గకపోవడంతో తల్లిదండ్రులు ప్రభుత్వాసుపత్రికి తీసుకు రావడంతో నీరసంగా ఉన్న విద్యార్థికి వైద్యులు పరీక్షించి సెలైన్ పెట్టారు. పట్టణంలోని ధర్మపురికాలనీ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఐదోతరగతి విద్యార్థి సాయికౌశిక్నాయక్ జ్వరంతో మూడు రోజులుగా బడికి రావడం లేదు. విద్యార్థిని షేక్ హసినా ది ఇదే పరిస్థితి. ఈ పాఠశాలలో 29 మంది ఐదోతరగతి విద్యార్థులుంటే అందులో 10 మంది బుధవారం పాఠశాలకు రాలేదు.
సీతయ్యనగర్ ప్రాథమిక పాఠశాలలో మొత్తం రోల్ 91 ఉంటే 66 మంది మాత్రమే హాజరయ్యారు. ఇందులో 2, 3 తరగతుల పిల్లలు ఎక్కువ మంది బడికి రాలేదు. గైర్హాజరుకు పలు కారణాలున్నప్పటికీ ఇందులో జ్వరం కూడా ఒకటని ఉపాధ్యాయులు తెలిపారు.
న్యూస్టుడే, వినుకొండ
సీజనల్ వ్యాధుల విజృంభణతో పెద్దలతో పాటు పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. విష జ్వరాలు, టైఫాయిడ్, డెంగీ, మలేరియాలతో బాధపడుతున్నారు. కొందరిని రోజుల తరబడి దగ్గు వేధిస్తోంది. కనీసం మూడు రోజులకు జ్వరం తగ్గినా దగ్గు మాత్రం పక్షం రోజులుపైగానే ఉంటోంది. పరిసరాల అపరిశుభ్రతతో దోమలు పెరిగి డెంగీ జ్వరాలు నమోదవుతున్నాయి. మురికివాడల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువ శాతం జ్వర పీడితులే ఉంటున్నారు.
చాలా పాఠశాలల్లో..
జ్వరంతో బాధపడుతూ ప్రతి పాఠశాలలో 10శాతం మంది విద్యార్థులు తరగతులకు గైర్హాజరవుతున్నారు. కొంత మంది బడికి వచ్చినా నీరసంగా ఉంటున్నారు. వినుకొండ పట్టణంలోని సీతయ్యనగర్, ధర్మపురికాలనీ పాఠశాలలను ‘న్యూస్టుడే’ సందర్శించి ఉపాధ్యాయులను ఆరా తీయగా జ్వరంతో హాజరు తగ్గిన మాట వాస్తవమేనన్నారు. పల్నాడు జిల్లాలో నరసరావుపేట, చిలకలూరిపేట, మాచర్ల, గురజాల, వినుకొండ నియోజకవర్గాల్లోని అధిక పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. జులై చివరి వారంలో సమస్య మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.
భయపడాల్సిన పనిలేదు
విష జ్వరాలు అధికంగా ఉంటున్నాయి. జ్వర పీడితుల్లో నీరసం అధికంగా ఉంటోంది. ఎక్కువ నీరు(ఓఆర్ఎస్) తీసుకోవాలి. భయపడాల్సిన పనిలేదు. డెంగీని వ్యాప్తి చేసే దోమల నివారణకు పరిశుభ్రత అవసరం. ఇంటి పరిసరాల్లో మురుగు నిల్వలేకుండా చూసుకోవాలి. దోమ తెరలు వాడితే మంచిది. కొవిడ్ కేసులు వస్తున్నాయి. టీకా వేయించుకున్న వారికి ప్రమాదం లేదు. జనసమూహాల్లో ఉన్నప్పుడు మాస్క్లు ధరించాలి.
- డాక్టర్ కె.వెంకటసురేంద్ర, ఎండీ(జనరల్ మెడిసిన్)
అన్నిచోట్ల ప్రభావం
పాఠశాలలో విద్యార్థుల హాజరు తగ్గింది. కారణాలను పరిశీలిస్తే జ్వరాలని తెలిసింది. పాముల కాలనీ పాఠశాలను స్వయంగా సందర్శించగా సుమారు 40మంది రాలేదు. అన్నిచోట్ల ఈ ప్రభావం కనిపిస్తోంది. వైద్యశాఖ సిబ్బంది స్క్రీనింగ్ చేస్తామని సమాచారం కోరారు.
- సయ్యద్ జఫ్రుల్లా, మండల విద్యాశాఖాధికారి వినుకొండలో అపారిశుద్ధ్యం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం