logo

Andhra News: సుచరిత ఇంటి ముందు ఉండవల్లి శ్రీదేవి ఆందోళన

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానకి అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను..

Updated : 21 Aug 2022 06:32 IST

గుంటూరు: గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానకి అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించడం పట్ల ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో పార్టీ అనుచరులతో కలిసి జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటి వద్ద నిరసనకు దిగారు. డొక్కా మాణిక్యవరప్రసాద్‌ నియామకంతో ఎమ్మెల్యేను అవమానించారంటూ శ్రీదేవి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానంతో మాట్లాడదామని ఎమ్మెల్యే శ్రీదేవికి సుచరిత నచ్చజెప్పారు. దీంతో ఆందోళన విరమించారు. పార్టీ అధినేతతో మాట్లాడేందుకు తాడికొండ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. 10గంటల్లో పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే నాలుగు మండలాల్లోని నాయకులు రాజీనామా చేస్తామని ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని