logo

‘వైకాపా అభివృద్ధి నిరోధక శక్తి’

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అభివృద్ధి నిరోధక శక్తిగా మారిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక నల్లచెరువులోని మూడుబొమ్మల సెంటర్‌లో భాజపా ఎనిమిదో మండల

Published : 26 Sep 2022 06:01 IST

ప్రసంగిస్తున్న చందు సాంబశివరావు

నగరంపాలెం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అభివృద్ధి నిరోధక శక్తిగా మారిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక నల్లచెరువులోని మూడుబొమ్మల సెంటర్‌లో భాజపా ఎనిమిదో మండల అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ అధ్వర్యంలో ప్రజాపోరు వీధి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రం నుంచి వైకాపాను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కేంద్రం పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇచ్చే దిక్కు లేక పలు అభివృద్ధి పనులు కుంటుపడ్డాయన్నారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి మాగంటి సుధాకర్‌యాదవ్‌, నాయకులు నాగరాజు, తోట రామకృష్ణ, అమ్మిశెట్టి ఆంజనేయులు, మాధవరెడ్డి, రంగా, నరసింహారావు, పాండురంగవిఠల్‌, పాలపాటి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని