కాళ్లరిగేలా తిరిగినా ఫలితం సున్నా
సమీకరణలో భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారంలో సీఆర్డీఏ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు పలు చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. ప్లాట్లను అభ్యంతరకర భూముల్లో ఇవ్వడమే ఇందుకు కారణం.
పరిష్కారానికి నోచుకోని రాజధాని రైతుల అర్జీలు
ఈనాడు - అమరావతి
సమీకరణలో భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారంలో సీఆర్డీఏ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు పలు చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. ప్లాట్లను అభ్యంతరకర భూముల్లో ఇవ్వడమే ఇందుకు కారణం. వీటిని మార్చి మరో చోట ఇవ్వమని అన్నదాతలు ఏళ్ల తరబడి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఏమాత్రం ప్రయోజనం కనిపించడం లేదు. కష్ట సమయాల్లో తమకు అక్కరకొస్తాయనుకున్న ప్లాట్లు కాగితాలకే పరిమితం అయ్యాయి. ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేసుకోమని రైతులపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఈమాత్రం శ్రద్ధను వారి సమస్యల పరిష్కారంపై పెట్టడం లేదు. ఫలితంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.
పురోగతి అంతంతే..
రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం 28,587 మంది రైతుల నుంచి 34,385 ఎకరాలను సమీకరించింది. దీనికి గాను వారికి నివాస, వాణిజ్య ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలన్నది ఒప్పందం. ఈ మేరకు భూయజమానులకు మొత్తం 64,735 ప్లాట్లను కేటాయించింది. ఇందులో 38,282 నివాస, 26,453.. వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. వీటిని రైతుల పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. గత ప్రభుత్వ హయాంలో 40,378 ప్లాట్లుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయింది. హైకోర్టు తీర్పు తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తిరిగి సీఆర్డీఏ అధికారులు ఈ ప్రక్రియను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 2,657 ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇంకా 21,722 ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాలేదు. అర్జీల పరిష్కారంలో సీఆర్డీఏ అధికారుల ఉదాశీనత కారణంగా రైతులు అనాసక్తి చూపిస్తున్నారు.
తిరిగి.. తిరిగి..
మందడం గ్రామానికి చెందిన రాజేష్ భూసమీకరణ కింద వెలగపూడి, మందడం, మల్కాపురం రెవెన్యూ గ్రామాల్లోని 4.85 ఎకరాలను ఇచ్చారు. ఇందులో మల్కాపురంలోని 1.03 ఎకరాల భూమికి సంబంధించి వెయ్యి గజాల మేర రెసిడెన్షియల్ ప్లాట్ వచ్చింది. దీనికి సంబంధించి న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో ఆ ప్లాట్ను అమ్ముదామన్నా వీలు కాని పరిస్థితి నెలకొంది. దీనిని మార్చి మరో చోట ఇవ్వమని గత మూడున్నర సంవత్సరాలుగా సీర్డీఏ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* రాజధాని నిర్మాణం కోసం తుళ్లూరుకు చెందిన వెంకటేశ్వరరావు 1.50 ఎకరాల భూమిని ఇచ్చారు. దీనికి బదులుగా సీఆర్డీఏ అధికారులు 500 గజాల ప్లాట్లు మూడు, 360 గజాల కమర్షియల్ ప్లాట్ ఒకటి లాటరీ విధానంలో కేటాయించి పత్రాలు అందజేశారు. ఇందులో 500 గజాల ప్లాట్ ఒకదానికి సంబంధించి పూలింగ్లో ఇవ్వని భూమిలో కేటాయించారు. ఈ ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం సాధ్యం కాదు. తనకు వచ్చిన ప్లాట్ను వేరే చోట ఇప్పించమని వెంకటేశ్వరరావు పలు సార్లు అధికారులను కలసి విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించలేదు.
* తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన పొదిలి శ్రీనివాసరావు సమీకరణలో 3.24 ఎకరాల భూమిని సీర్డీఏకు అప్పగించారు. దీనికి గాను సీఆర్డీఏ అధికారులు వెయ్యి గజాల రెసిడెన్షియల్ ప్లాట్లు మూడు, 750 గజాల కమర్షియల్ ప్లాట్ ఒకటి కేటాయించారు. ఇందులో ఓ నివాస ప్లాట్ను పూలింగ్లో అసలు భూమిలో, మరొకటి చెరువు పోరంబోకులో ఇచ్చారు.
స్పందించని సీఆర్డీఏ
ఎటువంటి అభివృద్ధి చేయకుండా.. ఎక్కడికక్కడ ముళ్ల కంపలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవలి? కనీసం స్థలంలోకి వెళ్లడానికి కూడా దారి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చేసి, సరిహద్దులు చూపించాలని కోరుతున్నారు. సమీకరణలో ఇవ్వని భూముల్లో చాలా మంది రైతులకు ప్లాట్లు కేటాయించారు. ఇలా దాదాపు 500 మందికి ఇచ్చారు. ఇటువంటి వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం సాధ్యపడదు. వీటిని మార్చమని మూడేళ్లుగా తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదు. 29 గ్రామాల్లోని సుమారు 300 మంది వరకు దేవాదాయ శాఖకు చెందిన భూముల్లో ప్లాట్లు వచ్చాయి. వీటిని మార్చమని పలు సార్లు అర్జీలు ఇచ్చినా స్పందన లేదు. కేంద్ర ప్రభుత్వం కేపిటల్ గెయిన్స్ మినహాయింపు ఇచ్చింది. ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్న రెండేళ్ల వరకే వర్తిస్తుంది. అసలు అభివృద్ధి లేకుండా తమకు కల్పించిన వెసులుబాటును ఎలా వదులుకుంటామని ప్రశ్నిస్తున్నారు. ఇలా దాదాపు 3,500 మంది రైతులకు సంబంధించి అభ్యంతరాలు సీఆర్డీఏ వద్ద పెండింగ్లో ఉన్నాయి. వీటికి ఇప్పటి వరకు పరిష్కారాన్ని కొనుగొన్న పాపాన పోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత