కమీషన్కు కక్కుర్తి
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను సొమ్ము చేసుకోవాలంటే అన్నదాతకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. రాజకీయ నేతల ప్రసన్నం లేకపోతే రైతులు తమ పంట ఉత్పుత్తులను ఊరు దాటించలేకపోతున్నారు..
అన్నదాతల పంట విక్రయంపై రాజకీయ ఆంక్షలు
సుబాబుల్ కర్రలు తరలిస్తున్న లారీలను అడ్డుకున్న పోలీసులు
అర్ధాంతంగా నిలిపివేసిన సుబాబుల్ లోడింగ్
ఎండుగుంపాలెం (నాదెండ్ల), న్యూస్టుడే : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను సొమ్ము చేసుకోవాలంటే అన్నదాతకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. రాజకీయ నేతల ప్రసన్నం లేకపోతే రైతులు తమ పంట ఉత్పుత్తులను ఊరు దాటించలేకపోతున్నారు.. ఒకవేళ వారి సిపార్సులతో దళారులకు విక్రయించితే ధరలో కోత పెడుతున్నారు. తమ ఆదేశాలు ధిక్కరించి ఇతరులు కొంటే ఆ పంటను తరలించే లారీలపై అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరింపులకు దిగుతున్నారు.. అధికారమున్న దళారులకే పంట కొనే హక్కు ఉందంటూ ఓ పోలీసు అధికారి ఏకంగా తన పరిధిని అతిక్రమించి హెచ్చరికలు జారీ చేయడంతో కర్షకులు అవాక్కయ్యారు
నాదెండ్ల మండలం ఎండుగుంపాలెంలో సుమారు 1200 ఎకరాల్లో సుబాబుల్ సాగు చేస్తున్నారు. మూడేళ్లుగా గిట్టుబాటు ధర లేక రైతులు పంట అమ్మలేదు. పేపరు తయారీ పరిశ్రమలు నామమాత్రంగానే సుబాబుల్ కర్ర కొన్నాయి. దీంతో రైతులు పంట విక్రయించుకునేందుకు నిరీక్షిస్తున్నారు. కుటుంబ ఖర్చులు, వైద్యం, పిల్లల చదువులు, ఇతర అవసరాలకు జరుగుబాటు కూడా లేక అవస్థ పడుతున్నారు. కొన్ని రోజులుగా పరిశ్రమల గేట్లు తెరచి లారీల కొద్ది సరకు కొనుగోలుకు అధిక సంఖ్యలో పర్మిట్లు (బిల్లులు) ఇస్తున్నాయి. దీంతో తమ పంట విక్రయించుకునే అవకాశం లభించిందన్న రైతుల సంతోషాన్ని కొంత మంది దళారులు నీరుగారుస్తున్నారు. ఈ వ్యాపారాన్ని అధికార పార్టీ నేతల మద్ధతుదారులు చేజిక్కించుకుంటున్నారు. గత ఎన్నికల్లో అనుకూలంగా ఓటు వేయని వారి పంటను కొనమని బెదిరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
చిలకలూరిపేట గ్రామీణ పోలీసు స్టేషన్లో రైతుల పడిగాపులు
రైతు కష్టంలో టన్నుకు రూ.300 దోపిడీ
నాలుగైదేళ్లు శ్రమించి పండించిన సుబాబుల్ పంట ఎకరాకు సుమారు 70 టన్నుల దిగుబడి వస్తుంది. నాణ్యమైన కర్ర ఒక టన్నుకు రూ.2,200 వంతున ధరను రైతు ఖాతాకు పేపరు మిల్లులు జమ చేస్తున్నాయి. కూలీలు సుబాబుల్ చెట్లు నరకడం, ట్రాక్టరు, లారీ ఎగుమతి, బాడుగ తదితర ఖర్చులన్నింటిని కొనుగోలు సంస్థలే భరిస్తున్నాయి. అయితే కూలీలు, పంట తరలించేందుకు తాము పెట్టుబడి పెడుతున్నామని, ఇందులో టన్నుకు రూ.300 చొప్పున దళారులు కమీషన్గా వసూలు చేస్తున్నారు. బ్యాంకు ఖాతాకు డబ్బు జమ అవగానే తమకు ఆ మొత్తం సంబంధిత రైతు నుంచి గుంజుతున్నారు. తమ మాట కాదంటే పంటని మరోసారి కొనమని బెదిరిస్తున్నారు. ఇందులో గుత్తాధిపత్యం చెలాయించేందుకు ఓ ప్రజాప్రతినిధి చక్రం తిప్పాడు. ప్రతిపక్ష పార్టీ దళారులు, ఇతర మధ్యవర్తులు తమ గ్రామంలో సుబాబుల్ పంట కొనకూడదని షరతులు విధించాడు. అతనికి అండగా లారీ చోదకులు, కూలీలపై తప్పుడు కేసులు పెడతామని ఓ పోలీసు అధికారితో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండ్రోజులుగా చిలకలూరిపేట గ్రామీణ పోలీసు స్టేషన్ చుట్టూ అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. పోలీసు అధికారులు సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు అన్నదాతలు తెలిపారు. న్యాయం చేయకపోతే ఉద్యమబాట పడతామని చెబుతున్నారు.
సమస్య లేకుండా చూస్తాం
రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా విక్రయించే హక్కు ఉంది. దళారుల మధ్య తలెత్తిన విబేధాలు సరిచేస్తాం. ఇదే విషయమై గతంలో వారంతా ఒప్పందం కుదుర్చుకున్నారు. పంట కొనుగోలు బహిష్కరణకు గురైన రైతుల పేర్లు చెబితే వారు నష్టపోకుండా చర్య తీసుకుంటాం. - అచ్చయ్య, చిలకలూరిపేట గ్రామీణ సీఐ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోడ్ ఉన్నా.. అంబటికి లేనట్లే!
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. -
ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం : కలెక్టర్
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. -
‘వైకాపాకు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే’
[ 28-03-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు. -
‘వైకాపా నుంచి విముక్తికి ఎదురుచూస్తున్న ప్రజలు’
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
[ 28-03-2024]
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు -
పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే
[ 28-03-2024]
దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది -
నిధులు దోచేయ్
[ 28-03-2024]
అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆగని వాలంటీర్ల ప్రచారం
[ 28-03-2024]
పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. -
మరో 52 మంది వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఈనెల 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు -
ఆర్టీసీ నగరబాట హామీ.. నగుబాటేనోయి!
[ 28-03-2024]
గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది -
నేతలకు లబ్డబ్బు
[ 28-03-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. -
లక్ష్మీకటాక్షం ఉంటేనే దస్త్రం కదిలేది
[ 28-03-2024]
జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు