దిగొచ్చిన పోషక ఫలం
ఒకప్పుడు పేదవారి యాపిల్గా జామకాయను చెప్పేవారు.. కాలం మారుతోంది.. యాపిల్ కాయల ఉత్పత్తి పెరగడంతో అవి సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు మధ్య తరగతి, ఉన్నత వర్గాల ప్రజలకే పరిమితమైన యాపిల్ నేడు
యాపిల్ ధరలు తగ్గడంతో భారీగా కొనుగోళ్లు
ఈనాడు, బాపట్ల
ఒకప్పుడు పేదవారి యాపిల్గా జామకాయను చెప్పేవారు.. కాలం మారుతోంది.. యాపిల్ కాయల ఉత్పత్తి పెరగడంతో అవి సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు మధ్య తరగతి, ఉన్నత వర్గాల ప్రజలకే పరిమితమైన యాపిల్ నేడు అందరికీ చేరువైనట్లయింది. కిలో రూ.100 లేదా వందకు 5 నుంచి 8 కాయలు చొప్పున విక్రయిస్తున్నారు. కాయ పరిమాణాన్ని ఒక్కో కాయ రూ.5 ధరకు కూడా లభిస్తుంది. యాపిల్ పండే హిమాచల్ప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండటంతో నాణ్యమైన కాయలతోపాటు అధిక దిగుబడులు వచ్చాయి. దీంతో మార్కెట్లో సరకు లభ్యత పెరిగి ధరలు కొంత దిగివచ్చాయి.
యాపిల్లో పైబర్ ఎక్కువగా ఉండి కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. విటమిన్-సి ఎక్కువగా ఉండి జీర్ణక్రియలో దోహదపడుతుంది. గుంటూరు నగరంలో లాలాపేట పండ్లబజారు, మార్కెట్ కూడలి, లాడ్జిసెంటర్, జూట్ మిల్లు వద్ద, పట్టాభిపురం, ఆర్టీసీ బస్టాండు, అరండల్పేట ప్రధాన రహదారి, కొరిటెపాడు, బుడంపాడు బైపాస్, కొత్తపేట, ఏటుకూరు కూడలి, అమరావతి రోడ్డు, మంగళగిరి రోడ్డులో ప్రతిచోటా రకరకాల పరిమాణాల్లో యాపిల్ అమ్ముతున్నారు. వీటికితోడు సైకిళ్లు, తోపుడు బండ్లు మీద తిరుగుతూ వీధుల్లో సైతం ఇళ్ల వెంబడి విక్రయిస్తున్నారు. ఈ సీజన్లో సీతాఫలం, దానిమ్మ, అరటి, బత్తాయి వీటన్నింటితోపాటు యాపిల్ ఉండేది. ఇప్పుడు ఇందులో సింహభాగం వాటా యాపిల్ ఆక్రమిస్తోంది. ధరలు అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
ఛండీగఢ్ నుంచి నేరుగా గుంటూరుకు..: జిల్లాకు ఎక్కువగా సిమ్లా యాపిల్ వస్తున్నాయి. వీటికి ఆగస్టు నుంచి అక్టోబరు వరకు సీజన్ ఉంటుంది. సిమ్లా పరిసర ప్రాంతాల్లో పండే యాపిల్కు ఛండీగఢ్ మార్కెట్ కూడలిగా ఉంది. అక్కడి నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు సరకు తరలివస్తుంది. గుంటూరు నగరంతోపాటు జిల్లాలో ప్రధాన పట్టణాలకు చెందిన వ్యాపారులు ఛండీగఢ్ మార్కెట్లో కొనుగోలు చేసి నేరుగా గుంటూరు నగరానికి తెప్పిస్తున్నారు. ఒక్కొక్క లారీలో 650 నుంచి 700 బాక్సులు ఉంటాయి. సుమారు 20 నుంచి 22 టన్నుల కాయలు ఒక లారీలో తరలిస్తున్నారు. సగటున రోజుకు నగరానికి రెండు లారీల చొప్పున వస్తున్నాయి. అక్కడి నుంచి జిల్లాకు రవాణా చేయడానికి రూ.లక్షకుపైగా బాడుగ చెల్లిస్తున్నారు. ఒక్కొక్క బాక్సులో పరిమాణాన్ని అనుసరించి 80 నుంచి 240 వరకు ఉంటాయి. ఒక్కొక్క బాక్సు నగరానికి చేరేసరికి రూ.1200 నుంచి రూ.2500 ధరకు విక్రయిస్తున్నారు. గతంలో ఇది రూ.3500 వరకు ఉండేదని వ్యాపారులు చెబుతున్నారు. అక్కడి మార్కెట్లో ధర తక్కువగా ఉండటంతో ఎక్కువ సరకు తెప్పించుకుని జిల్లాలోని శీతల గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. దీపావళి తర్వాత సిమ్లా యాపిల్ లభ్యత తగ్గుతుంది. ఆ సమయంలో శీతల గోదాముల్లో నిల్వ చేసిన వాటిని మార్కెట్కు తరలించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కిలో రూ.100 చొప్పున నెల రోజులుగా నిలకడగా ఉండగా దీపావళి వరకు ఇదే ధరలు కొనసాగే అవకాశముందని తెనాలికి చెందిన టోకు వ్యాపారి ఒకరు తెలిపారు. విజయవాడలోని హోల్సేల్ పండ్ల మార్కెట్ నుంచి చీరాల, బాపట్లకు తీసుకొచ్చి, అక్కడి నుంచి తీరంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. రోజూవారీ విక్రయాలు బాగానే సాగుతున్నటు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాలెక్కించలేదు.. పట్టించుకోలేదు
[ 29-03-2024]
కృష్ణా పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో 5 లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఏటా లక్షల బస్తాల ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారు. -
మీ పనులకో దండం!
[ 29-03-2024]
గుంటూరు నగరపాలికలో గడప గడపకు మన ప్రభుత్వం కింద చేసిన అభివృద్ధి పనులకు పది నెలల నుంచి బిల్లులు చెల్లించలేదు. ఇవి రూ.కోట్లలో పేరుకుపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. -
భారీ ఎత్తున సరకుల దిగుమతిపై నిఘా
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెద్ద మొత్తాల్లో సరకుల లావాదేవీలు నిర్వహించే సంస్థలపై నిఘా ముమ్మరం చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు-2 జాయింట్ కమిషనర్ మధుబాబు తెలిపారు. -
మౌనానికి వెలకట్టి.. ముడుపులు మూటకట్టి..
[ 29-03-2024]
ఆ అధికార పార్టీ నేత లక్ష్యం రూ.కోట్లు సంపాదించడమే.. వ్యాపారుల నుంచి వసూళ్లు సాగిస్తున్న వైనంపై ప్రతిపక్ష నేత వేసిన సూటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. -
పాలకా.. ఇది తగునా?
[ 29-03-2024]
పొన్నూరు పురపాలక సంఘంలో ఎన్నికల కోడ్ సరిగా అమలు కావడం లేదు. అధికార పార్టీకి ఒక లాగా... ప్రతిపక్ష పార్టీకి మరోలా అమలు చేస్తూ అధికారులు వివక్ష చూపుతున్నారు. -
నిబంధన.. పాటించకుంటే దండన
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చింది. దీన్ని ఎన్నికల సంఘం చూస్తుంది. జిల్లాలో కలెక్టర్ పర్యవేక్షిస్తుంటారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఉద్యోగులు ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తారు. -
ప్రభుత్వం మారితేనే యువతకు భవిత
[ 29-03-2024]
ప్రజలకు తాగు నీటిని అందించలేని వైకాపా ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాలను మాత్రం విచ్చలవిడిగా అందుబాటులోకి తీసుకొచ్చి యువతకు తీరని నష్టాన్ని కలిగిస్తోందని ఎన్డీయే గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. -
అనుమతి ఒకచోట..ప్రచారం మరోచోట
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని యంత్రాంగం చెబుతుంటే.. అధికార పార్టీకి చెందిన వారు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. -
ఎన్నికల ప్రచారంలో వాలంటీరు హల్చల్పై ఫిర్యాదు
[ 29-03-2024]
మండలంలోని కారంపూడిపాడు గ్రామంలో ఈ నెల 22న వైకాపా అభ్యర్థి బలసాని కిరణ్కుమార్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీరు కె.నరసింహరావు పాల్గొన్నారు. -
రోడ్డునే మింగేసిన ఇసుకాసురులు
[ 29-03-2024]
జనం ఇబ్బంది పడితే మాకేంటి? మా ప్రయోజనం నెరవేరితే చాలనేలా అధికార పార్టీ నేతలు వ్యవహరించారు. అక్రమార్జనకు ఉన్న ఏ అవకాశాన్ని వారు వదులుకోలేదు. -
కోడ్ ఉన్నా.. చోద్యం చూస్తున్నారు!
[ 29-03-2024]
ఈ చిత్రం చూశారా.. కృష్ణా తీరంలోని అమరావతి మండలం మల్లాది రీచ్లో గురువారం రాత్రి వేళ భారీ యంత్రాలతో ఇసుక తవ్వి లారీలకు నింపుతున్నారు. అనుమతి ఉన్న రీచ్లలో సైతం సూర్యాస్తమయం తర్వాత కూలీల చేత కూడా ఇసుక తవ్వకాలు చేయకూడదు. -
బల్లికురవ ఎస్సైపై విచారణకు ఆదేశం
[ 29-03-2024]
అధికార వైకాపా నేతల మెప్పు పొందాలని చూసినా.. బాధితులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకునే పోలీసు అధికారులు తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పడానికి తాజాగా బల్లికురవ ఎస్సై నాగశివారెడ్డి ఉదంతమే ఓ నిదర్శనం. -
ఓటరు జాబితాలో మీ పేరుందా?
[ 29-03-2024]
‘సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది... త్వరలో జరగబోయే ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన వారి దగ్గర నుంచి ఓటున్న ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి... ఎవరికి వారు తాము వేయకపోతే ఏమవుతుందనే భావన విడనాడాలి. -
నియమావళి అమలు ఇలాగేనా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 12 రోజులు గడిచింది. అమలుకు సంబంధించి ప్రత్యేకాధికారులను నియమించినా కొన్నిచోట్ల కోడ్ ఉల్లంఘనలు కనపడుతూనే ఉన్నాయి. -
గుండ్లకమ్మ జలాశయంలో మొసలి కలకలం
[ 29-03-2024]
గుండ్లకమ్మ జలాశయంలో మత్స్యకారుడి వలకు మొసలి చిక్కడంతో స్థానికంగా కలకలం రేగింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కన్ను పడితే కబ్జానే..
[ 29-03-2024]
తిమ్మాయిపాలెం గ్రామంలోని 7.05 ఎకరాలు నక్కలవాగు పేరుతో వాగు పోరంబోకు స్థలం ఉంది. ఇది జాతీయ రహదారికి పక్కనే రోడ్డుకు ఆనుకొని ఉండటంతో దీనిపై వైకాపా నేత గద్దలా వాలిపోయారు. -
వైకాపా ప్రచారంలో క్షేత్ర సహాయకుడు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ వచ్చినా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద సిబ్బంది ఇంకా వైకాపా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. -
మరెందుకు ఆలస్యం.. రాజీనామా చేయండి..
[ 29-03-2024]
రాజీనామా చేసేయండి.. హాయిగా పార్టీ ప్రచారంలో పాల్గొనండి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, మళ్లీ తీసుకుంటామని ప్రస్తుతానికి అంతా చూసుకుంటామంటూ చెప్పుకొస్తున్నారు. -
ఎత్తిపోతల పథకాలు హుళక్కే
[ 29-03-2024]
పల్నాడు జిల్లాలో వైకాపా పాలన ఐదేళ్లలో కొత్తగా ఒక్క ఎత్తిపోతల పథకం నిర్మించలేదు. నీటి అనుమతులిచ్చి నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపారు. -
12 మంది వైకాపా కౌన్సిలర్ల వేరు బాట
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రభావం పురపాలక సంఘంలోని పాలకపక్షంపై పడింది. చిలకలూరిపేట శాసనసభ స్థానంలో అధికార వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు వ్యవహారం కౌన్సిలర్ల మధ్య చీలికకు దారి తీసింది. -
పక్కదారి పట్టిన రేషన్ బియ్యం
[ 29-03-2024]
రేషన్ బియ్యం పక్కదారి పట్టడంతో నరసరావుపేటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నెల నెలా పేదలకు బియ్యం సక్రమంగా పంపిణీ చేస్తున్నామని చెప్పే అధికారులు ఆ బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎన్నికల నిబంధనలు బేఖాతర్
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలై పదిరోజులు దాటినా నేటికీ పలు చోట్ల అధికారపార్టీ ఆగడాలకు అదుపు లేకుండా ఉంది. క్రోసూరు ఎస్టీ కాలనీ, గాదెవారిపాలెంలోని మంచినీటి పథకం ట్యాంకులకు వైకాపా రంగులు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్