బి.పి.మండల్ విగ్రహ నిర్మాణ దిమ్మె కూల్చివేత
వెనుకబడిన సామాజికవర్గ పితామహుడు బి.పి.మండల్ విగ్రహ నిర్మాణానికి ఏర్పాటు చేసిన దిమ్మెను నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేయడంపై బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీన అమరావతి రోడ్డు
బీసీ సంఘాల నాయకుల నిరసన
నేడు అధికారులను కలిసేందుకు సన్నాహాలు
బి.పి.మండల్ విగ్రహ నిర్మాణ ప్రాంతం వద్ద రోడ్డుపై భైటాయించి
నిరసన తెలుపుతున్న బీసీ సంఘాల నాయకులు
గోరంట్ల(గుంటూరు), న్యూస్టుడే: వెనుకబడిన సామాజికవర్గ పితామహుడు బి.పి.మండల్ విగ్రహ నిర్మాణానికి ఏర్పాటు చేసిన దిమ్మెను నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేయడంపై బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీన అమరావతి రోడ్డు ఇన్నర్రింగ్రోడ్డు కూడలిలోని డివైడర్పై బి.పి.మండల్ విగ్రహ నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, నాయకుల సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. విగ్రహాన్ని నిలిపేందుకు ఏర్పాటు చేసిన దిమ్మెను మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేసేందుకు ప్రయత్నం చేస్తే బీసీ నాయకులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. బుధవారం మధ్యాహ్నం వర్షం కురిసిన తర్వాత ఎవరికీ చెప్పకుండా దిమ్మెను కూల్చివేశారు. దీనిపై బీసీ సంఘాల నాయకులు నగరపాలక సంస్థ అధికారుల తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. తక్షణం నగరపాలక సంస్థ అధికారులు విగ్రహ దిమ్మెను ఏర్పాటు చేయాలంటూ రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బి.పి.మండల్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు, వైద్యులు ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విగ్రహ నిర్మాణం కోసం ఏడాది కిందటే జిల్లా కలెక్టర్కు అనుమతి కోరుతూ వినతిని అందించామని, ఇటీవల నగరపాలక సంస్థ అధికారులకు, మేయర్కు వినతులు అందించామని తెలిపారు. శంకుస్థాపన జరిగి పనులు జరుగుతుండగా నగరపాలక సంస్థ అధికారులు అడ్డుపడటం సరికాదన్నారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు సన్నద్ధమవుతామని హెచ్చరించారు. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పేరయ్య మాట్లాడుతూ నగరంలో అనేక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని, వాటన్నింటికి అనుమతులున్నాయా అని ప్రశ్నించారు. దిమ్మెను పడగొడుతూ కనీస సమాచారం ఇవ్వకుండా నగరపాలక సంస్థ అధికారులు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిపై బీసీ నాయకులంతా ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంతో అమరావతి రోడ్డులో ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచింది. పోలీసులు నిరసనకారుల వద్దకు చేరుకుని, సర్ది చెప్పి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం ట్రాఫిక్ను నియంత్రించారు. నిరసనలో బీసీ సంఘాల నాయకులు తాళ్ల నాగరాజు, దాసరి శివకుమార్, కె.సుబ్రహ్మణ్యం, తాళ్ల శ్రీనివాసరావు, పెద్దిబోయిన బాలయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు.
కూల్చివేసిన దిమ్మె
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోడ్ ఉన్నా.. అంబటికి లేనట్లే!
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. -
ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం : కలెక్టర్
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. -
‘వైకాపాకు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే’
[ 28-03-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు. -
‘వైకాపా నుంచి విముక్తికి ఎదురుచూస్తున్న ప్రజలు’
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
[ 28-03-2024]
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు -
పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే
[ 28-03-2024]
దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది -
నిధులు దోచేయ్
[ 28-03-2024]
అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆగని వాలంటీర్ల ప్రచారం
[ 28-03-2024]
పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. -
మరో 52 మంది వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఈనెల 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు -
ఆర్టీసీ నగరబాట హామీ.. నగుబాటేనోయి!
[ 28-03-2024]
గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది -
నేతలకు లబ్డబ్బు
[ 28-03-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. -
లక్ష్మీకటాక్షం ఉంటేనే దస్త్రం కదిలేది
[ 28-03-2024]
జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం