డ్రైవర్ సమయస్ఫూర్తి త్రుటిలో తప్పిన ప్రమాదం
ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి మంచాల కాలువలోకి ఆర్టీసీ బస్సు దూసుకువెళ్లిన ఘటన స్థానిక మంచాల కాలువ వద్ద శనివారం సాయంత్రం జరిగింది. డ్రైవర్ సమయ స్ఫూర్తితో వ్యవహరించడంతో బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
మంచాల కాల్వలోకి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు (అంతర చిత్రంలో) డ్రైవర్ రమేష్
చేబ్రోలు, న్యూస్టుడే: ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి మంచాల కాలువలోకి ఆర్టీసీ బస్సు దూసుకువెళ్లిన ఘటన స్థానిక మంచాల కాలువ వద్ద శనివారం సాయంత్రం జరిగింది. డ్రైవర్ సమయ స్ఫూర్తితో వ్యవహరించడంతో బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు, డ్రైవర్ రమేష్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చీరాల డిపోనకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు మధ్యాహ్నం 2 గంటల సమయంలో చీరాల నుంచి విజయవాడకు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. స్థానిక కొమ్మమూరు కాల్వ వద్దకు వచ్చేసరికి ఎదురుగా రెండు లారీలు రాసాగాయి. ద్విచక్రవాహనంపై వస్తున్న ఓ యువకుడు వేగంగా ఆ లారీలను ‘ఓవర్ టేక్’ చేసి, ముందుకు దూసుకొచ్చాడు. ఆఖరి క్షణంలో అతన్ని గమనించిన బస్సు డ్రైవర్ బ్రేకులు వేశారు. అయితే వర్షం కారణంగా రోడ్డు తడిసి ఉండడంతో బస్సు జారుతూ రోడ్డు మార్జిన్ దిగింది. వెంటనే ఆయన ‘హ్యాండ్ బ్రేక్’ వేసి స్టీరింగ్ను గట్టిగా పట్టుకున్నారు. దీంతో బస్సు ముందు చక్రాలు కాలువలోకి దూసుకెళ్లడంతో అది ఓ పక్కకు ఒరిగి ఆగిపోయింది. ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే డ్రైవర్ వారిని అప్రమత్తం చేస్తూ.. ఎవరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పి, అత్యవసర ద్వారం తెరిచి, అటుగా వెళుతున్న స్థానికుల సహకారంతో అందరినీ కిందకు దించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
-
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా