నిషేధిత జాబితాలోకి అనధికార లేఔట్
గుంటూరు నగరం అంకిరెడ్డిపాలెంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన స్థిరాస్తి వెంచర్లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా ఆ సర్వే నంబరును నిషేధిత జాబితాలో చేర్చాలని కోరుతూ పట్టణ ప్రణాళిక విభాగం రాష్ట్ర సంచాలకులకు (డీటీసీపీ).. గుంటూరు కార్పొరేషన్ అధికారులు లేఖ రాశారు.
డీటీసీపీకి లేఖ రాసిన నగరపాలక సంస్థ అధికారులు
నోటీసులిచ్చి తర్వాత పట్టించుకోకపోవడంపై కమిషనర్ ఆగ్రహం
ఈనాడు-అమరావతి: గుంటూరు నగరం అంకిరెడ్డిపాలెంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన స్థిరాస్తి వెంచర్లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా ఆ సర్వే నంబరును నిషేధిత జాబితాలో చేర్చాలని కోరుతూ పట్టణ ప్రణాళిక విభాగం రాష్ట్ర సంచాలకులకు (డీటీసీపీ).. గుంటూరు కార్పొరేషన్ అధికారులు లేఖ రాశారు. వెంచర్ నిర్వాహకులకు కూడా అందులో ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదని ఆదేశించారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెంచర్ నిర్మాణ సమయంలోనే గుర్తించి నోటీసు ఇచ్చిన అధికారులు ఆ తర్వాత నిర్లక్ష్యం వహించడంపై కమిషనర్ కీర్తి చేకూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె శనివారం ప్రణాళికాధికారులతో సమావేశమయ్యారు. ఈ వెంచర్పై పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. 40 అడుగుల రహదారి నిర్మాణం చేపట్టి చుట్టూ ప్రహరీ నిర్మించే వరకు, అటుగా ఎందుకు వెళ్లలేదని ఆ ప్రాంత ఏసీపీ, సూపర్వైజర్, సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలపై కమిషనర్ మండిపడ్డారు. నోటీసులు ఇచ్చి మిన్నకుండిపోతే సరిపోతుందా? అని ప్రశ్నించారు. దీనికి యంత్రాంగం నుంచి సమాధానం కరవైంది.
విచారణకు ఆదేశించినా.. చర్యలు కరవు
నగరంఓలని మణిపురం బ్రిడ్జికి సమీపంలో మరో అనధికారిక లేఔట్లో క్రయ, విక్రయాలు చేయడం వల్ల నగరపాలక సంస్థకు ఓపెన్స్పేస్ కింద రావాల్సిన సుమారు 4 వేల గజాల స్థలం రాలేదు. అదే విధంగా పరిశ్రమల నుంచి రెసిడెన్షియల్ జోన్లోకి మార్చారు. కానీ ఎలాంటి కన్వర్షన్ ఛార్జీలు చెల్లించకుండా దాన్ని ఇప్పటికే విక్రయించేశారు. ఆ లేఔట్పై అప్పటి మున్సిపల్శాఖమంత్రి బొత్స సత్యనారాయణ విచారణకు ఆదేశించారు. తర్వాత ఆ భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా నిషేధిత జాబితాలో పెడుతున్నామని అధికారులు మౌఖికంగా తెలియజేసి మిన్నకుండిపోయారు. దానిలో ప్లాట్లు చాలావరకు రిజిస్ట్రేషన్లు అయ్యాయని తెలుసుకుని ప్రస్తుతం దానికి సంబంధించిన వివరాలను మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు కోరినట్లు సమాచారం. ఒక పక్క కళ్లముందే మణిపురం బ్రిడ్జికి సమీపంలోని లేఔట్లో ఓపెన్స్పేస్ కింద 10 శాతం స్థలం రాలేదని ఉన్నతాధికారులు నివేదిక కోరినా, అంకిరెడ్డిపాలెం లేఔట్ విషయంలోనూ ప్రణాళికాధికారులు అప్రమత్తం కాకపోవడం వారి నిర్వాకాన్ని తెలియజేస్తోంది.
అనధికార నిర్మాణంపైనా అంతే..
లాలాపేట నూకాలమ్మ గుడికి సమీపంలో జీ+1కు అనుమతి తీసుకుని ఏకంగా నాలుగంతస్తులు నిర్మించారు. దానిపై నగర కమిషనర్ నెల కిందటే విచారణకు ఆదేశించారు. ఇప్పటి వరకు కనీసం దాని కూల్చివేతకు చర్యలు తీసుకోలేదు. పనులు చేపట్టరాదని భవన యజమానికి నోటీసులిచ్చి ఊరుకున్నారు. అయినా నిర్మాణం కొనసాగుతూనే ఉంది. దాని కూల్చివేతకు కార్యాచరణ రూపొందిస్తున్నామని నగర ప్రణాళికాధికారి జీఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఆ భవనం పూర్తిస్థాయిలో నిర్మాణానికి నోచుకునే వరకు ఆ ప్రాంత టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, ప్లానింగ్ కార్యదర్శులు మౌనం దాల్చడంపైనా వారి నుంచి వివరణ కోరామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
[ 29-03-2024]
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. -
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
[ 29-03-2024]
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. -
పట్టాలెక్కించలేదు.. పట్టించుకోలేదు
[ 29-03-2024]
కృష్ణా పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో 5 లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఏటా లక్షల బస్తాల ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారు. -
మీ పనులకో దండం!
[ 29-03-2024]
గుంటూరు నగరపాలికలో గడప గడపకు మన ప్రభుత్వం కింద చేసిన అభివృద్ధి పనులకు పది నెలల నుంచి బిల్లులు చెల్లించలేదు. ఇవి రూ.కోట్లలో పేరుకుపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. -
భారీ ఎత్తున సరకుల దిగుమతిపై నిఘా
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెద్ద మొత్తాల్లో సరకుల లావాదేవీలు నిర్వహించే సంస్థలపై నిఘా ముమ్మరం చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు-2 జాయింట్ కమిషనర్ మధుబాబు తెలిపారు. -
మౌనానికి వెలకట్టి.. ముడుపులు మూటకట్టి..
[ 29-03-2024]
ఆ అధికార పార్టీ నేత లక్ష్యం రూ.కోట్లు సంపాదించడమే.. వ్యాపారుల నుంచి వసూళ్లు సాగిస్తున్న వైనంపై ప్రతిపక్ష నేత వేసిన సూటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. -
పాలకా.. ఇది తగునా?
[ 29-03-2024]
పొన్నూరు పురపాలక సంఘంలో ఎన్నికల కోడ్ సరిగా అమలు కావడం లేదు. అధికార పార్టీకి ఒక లాగా... ప్రతిపక్ష పార్టీకి మరోలా అమలు చేస్తూ అధికారులు వివక్ష చూపుతున్నారు. -
నిబంధన.. పాటించకుంటే దండన
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చింది. దీన్ని ఎన్నికల సంఘం చూస్తుంది. జిల్లాలో కలెక్టర్ పర్యవేక్షిస్తుంటారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఉద్యోగులు ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తారు. -
ప్రభుత్వం మారితేనే యువతకు భవిత
[ 29-03-2024]
ప్రజలకు తాగు నీటిని అందించలేని వైకాపా ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాలను మాత్రం విచ్చలవిడిగా అందుబాటులోకి తీసుకొచ్చి యువతకు తీరని నష్టాన్ని కలిగిస్తోందని ఎన్డీయే గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. -
అనుమతి ఒకచోట..ప్రచారం మరోచోట
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని యంత్రాంగం చెబుతుంటే.. అధికార పార్టీకి చెందిన వారు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. -
ఎన్నికల ప్రచారంలో వాలంటీరు హల్చల్పై ఫిర్యాదు
[ 29-03-2024]
మండలంలోని కారంపూడిపాడు గ్రామంలో ఈ నెల 22న వైకాపా అభ్యర్థి బలసాని కిరణ్కుమార్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీరు కె.నరసింహరావు పాల్గొన్నారు. -
రోడ్డునే మింగేసిన ఇసుకాసురులు
[ 29-03-2024]
జనం ఇబ్బంది పడితే మాకేంటి? మా ప్రయోజనం నెరవేరితే చాలనేలా అధికార పార్టీ నేతలు వ్యవహరించారు. అక్రమార్జనకు ఉన్న ఏ అవకాశాన్ని వారు వదులుకోలేదు. -
కోడ్ ఉన్నా.. చోద్యం చూస్తున్నారు!
[ 29-03-2024]
ఈ చిత్రం చూశారా.. కృష్ణా తీరంలోని అమరావతి మండలం మల్లాది రీచ్లో గురువారం రాత్రి వేళ భారీ యంత్రాలతో ఇసుక తవ్వి లారీలకు నింపుతున్నారు. అనుమతి ఉన్న రీచ్లలో సైతం సూర్యాస్తమయం తర్వాత కూలీల చేత కూడా ఇసుక తవ్వకాలు చేయకూడదు. -
బల్లికురవ ఎస్సైపై విచారణకు ఆదేశం
[ 29-03-2024]
అధికార వైకాపా నేతల మెప్పు పొందాలని చూసినా.. బాధితులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకునే పోలీసు అధికారులు తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పడానికి తాజాగా బల్లికురవ ఎస్సై నాగశివారెడ్డి ఉదంతమే ఓ నిదర్శనం. -
ఓటరు జాబితాలో మీ పేరుందా?
[ 29-03-2024]
‘సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది... త్వరలో జరగబోయే ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన వారి దగ్గర నుంచి ఓటున్న ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి... ఎవరికి వారు తాము వేయకపోతే ఏమవుతుందనే భావన విడనాడాలి. -
నియమావళి అమలు ఇలాగేనా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 12 రోజులు గడిచింది. అమలుకు సంబంధించి ప్రత్యేకాధికారులను నియమించినా కొన్నిచోట్ల కోడ్ ఉల్లంఘనలు కనపడుతూనే ఉన్నాయి. -
గుండ్లకమ్మ జలాశయంలో మొసలి కలకలం
[ 29-03-2024]
గుండ్లకమ్మ జలాశయంలో మత్స్యకారుడి వలకు మొసలి చిక్కడంతో స్థానికంగా కలకలం రేగింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కన్ను పడితే కబ్జానే..
[ 29-03-2024]
తిమ్మాయిపాలెం గ్రామంలోని 7.05 ఎకరాలు నక్కలవాగు పేరుతో వాగు పోరంబోకు స్థలం ఉంది. ఇది జాతీయ రహదారికి పక్కనే రోడ్డుకు ఆనుకొని ఉండటంతో దీనిపై వైకాపా నేత గద్దలా వాలిపోయారు. -
వైకాపా ప్రచారంలో క్షేత్ర సహాయకుడు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ వచ్చినా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద సిబ్బంది ఇంకా వైకాపా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. -
మరెందుకు ఆలస్యం.. రాజీనామా చేయండి..
[ 29-03-2024]
రాజీనామా చేసేయండి.. హాయిగా పార్టీ ప్రచారంలో పాల్గొనండి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, మళ్లీ తీసుకుంటామని ప్రస్తుతానికి అంతా చూసుకుంటామంటూ చెప్పుకొస్తున్నారు. -
ఎత్తిపోతల పథకాలు హుళక్కే
[ 29-03-2024]
పల్నాడు జిల్లాలో వైకాపా పాలన ఐదేళ్లలో కొత్తగా ఒక్క ఎత్తిపోతల పథకం నిర్మించలేదు. నీటి అనుమతులిచ్చి నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపారు. -
12 మంది వైకాపా కౌన్సిలర్ల వేరు బాట
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రభావం పురపాలక సంఘంలోని పాలకపక్షంపై పడింది. చిలకలూరిపేట శాసనసభ స్థానంలో అధికార వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు వ్యవహారం కౌన్సిలర్ల మధ్య చీలికకు దారి తీసింది. -
పక్కదారి పట్టిన రేషన్ బియ్యం
[ 29-03-2024]
రేషన్ బియ్యం పక్కదారి పట్టడంతో నరసరావుపేటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నెల నెలా పేదలకు బియ్యం సక్రమంగా పంపిణీ చేస్తున్నామని చెప్పే అధికారులు ఆ బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎన్నికల నిబంధనలు బేఖాతర్
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలై పదిరోజులు దాటినా నేటికీ పలు చోట్ల అధికారపార్టీ ఆగడాలకు అదుపు లేకుండా ఉంది. క్రోసూరు ఎస్టీ కాలనీ, గాదెవారిపాలెంలోని మంచినీటి పథకం ట్యాంకులకు వైకాపా రంగులు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ