3 నాటికి ఉపాధి పనుల గుర్తింపు
జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేయాల్సిన పనులను గుర్తించేందుకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టరు ఎం.యుగంధర్కుమార్ తెలిపారు. నగరంలోని స్వశక్తి భవనాల
‘న్యూస్టుడే’తో డ్వామా పీడీ యుగంధర్కుమార్
- జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్టుడే
జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేయాల్సిన పనులను గుర్తించేందుకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టరు ఎం.యుగంధర్కుమార్ తెలిపారు. నగరంలోని స్వశక్తి భవనాల సముదాయంలో ఆయన ‘న్యూస్టుడే’తో ప్రత్యేకంగా ‘ముఖాముఖి’ మాట్లాడారు. వివరాలివీ.
న్యూస్టుడే: 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులు ఎంత వరకు చేశారు? సాధించిన ప్రగతి ఏమిటి?
పీడీ: ప్రస్తుత సంవత్సరంలో 17 లక్షల మందికి పని దినాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటికి 22.23 లక్షల మందికి పని దినాలు కల్పించి 146 శాతం ప్రగతిని సాధించాం. ఇది రికార్డు స్థాయిలో సాధించిన ప్రగతిగా చెప్పుకోవచ్చు.
న్యూస్టుడే: కూలీలకు ఎంత మొత్తంలో వేతనాలు చెల్లించారు?
పీడీ: జిల్లాలో ఉపాధి పనుల కోసం 4.32 లక్షల మంది జాబ్కార్డులు పొందారు. వీరిలో 2.28 లక్షల మంది పనుల్లోకి వస్తున్నారు. మొత్తం రూ.57.5 కోట్ల మేరకు పనులు జరిగాయి. కూలీల కోసమే రూ.46.03 కోట్లను చెల్లించాం. ఇది 80 శాతం. వేసవిలో జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే పనులు చూపెట్టడం ద్వారా వలసలను నివారించి ఉపాధి కల్పించాం. మెటీరియల్ కాంపొనెంట్, పరిపాలన ఖర్చుల కోసం మిగిలిన 20 శాతం నిధులు ఖర్చు చేశాం.
న్యూస్టుడే: ప్రాజెక్ట్ అమృత్ సరోవర్ చెరువుల నిర్మాణాలు ఎంత వరకు చేశారు?
పీడీ: భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా జిల్లాకు ప్రాజెక్టు అమృత్ సరోవర్ కింద 75 చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేసింది. ఉపాధి హామీ పథకం నిధులతో చెరువులను సుందర, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నాం. ఇప్పటికి 25 చెరువుల నిర్మాణాలు పూర్తయ్యాయి. 2023, జనవరి లోపు మిగిలిన 50 చెరువులను అభివృద్ధి చేస్తాం. ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.
మొక్కల పెంపకం కోసం ఏం చర్యలు తీసుకున్నారు?
పీడీ: గతంలో అవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలను కొనుగోలు చేసి గ్రామాలకు వెళ్లే రహదారుల్లో నాటాం. సంరక్షణ చర్యలు లేకపోవడంతో పాటు ఇతరత్రా కారణాలతో వీటిలో సగం మొక్కలు చనిపోయాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పేరేచర్ల, దుగ్గిరాలలో సొంతంగా డ్వామా నర్సరీలు మూడు ఏర్పాటు చేశాం. ఒక్కో నర్సరీలో లక్ష చొప్పున మూడు లక్షల మొక్కలను పెంచి ఉచితంగా గ్రామ పంచాయతీలతో పాటు ప్రజలకు పంపిణీ చేయనున్నాం. దీనివల్ల నిధుల వృథాను అరికట్టవచ్చు. నర్సరీల్లో పలు రకాల మొక్కలను పెంచుతున్నాం. త్వరలోనే పంపిణీని చేపడతాం.
2023-24 సంవత్సరంలో ఉపాధి పనులకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారా?
పీడీ: ప్రస్తుతం వర్షాకాలంలో ఉపాధి పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో 2023-24 సంవత్సరంలో 4.32 లక్షల మంది జాబ్కార్డులు పొందిన వారికి ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికను రూపొందించనున్నారు. దీనికోసం అక్టోబరు 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని 277 గ్రామ పంచాయతీల్లో సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించాలని మండలాధికారులను ఆదేశించాం. సర్పంచులు స్థానికంగా చేయడానికి వీలున్న పనుల గురించి తెలియజేస్తే మా సిబ్బంది నమోదు చేసుకుంటారు. నవంబరు 3వ తేదీ నాటికి అన్ని గ్రామాల్లో పనులను గుర్తించి జిల్లా కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. స్థానికంగా చేయడానికి వీలున్న పనులను ఖరారు చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపుతాం. అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాత వేసవిలో పనులు ప్రారంభిస్తాం. 100 రోజుల్లో పనులు పూర్తి చేసి ఎక్కువ మంది కూలీలను పనుల్లోకి తీసుకొచ్చేలా సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్