logo

సూర్యలంకలో భద్రత పటిష్ఠం : కలెక్టర్‌

సూర్యలంక తీరంలో ప్రమాదాల నివారణకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు.

Published : 05 Oct 2022 03:53 IST

బాపట్ల, న్యూస్‌టుడే: సూర్యలంక తీరంలో ప్రమాదాల నివారణకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. సందర్శకులు సముద్ర సాన్నం చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని మంగళవారం ఓ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. సూర్యలంక బీచ్‌లో ప్రమాదాలు జరగకుండా 24 గంటలు పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. తుపాను షెల్టర్‌లో రూ.2.50 లక్షలతో రెండు షిప్టుల్లో 24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని