రాక్షస పాలన అంతానికి మినీ మహానాడు నాంది: తెదేపా
రాష్ట్రంలో రాక్షసపాలన అంతానికి 12న నరసరావుపేటలో నిర్వహించే మినీ మహానాడు నాంది కావాలని గురజాల మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
నరసరావుపేట అర్బన్, న్యూస్టుడే : రాష్ట్రంలో రాక్షసపాలన అంతానికి 12న నరసరావుపేటలో నిర్వహించే మినీ మహానాడు నాంది కావాలని గురజాల మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. మినీ మహానాడు సభావేదిక ప్రాంగణాన్ని మంగళవారం ఆయన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు, నేతలతో కలిసి పరిశీలించారు. సభావేదిక నిర్మాణం, పార్కింగ్, ప్రజలు కూర్చునేందుకు ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని విజయవంతానికి కృషి చేయాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం