వానలు పెరిగితే పంటలకు నష్టమే
అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సెప్టెంబరు నెలాఖరు వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 677 మి.మీలు కాగా, 422.2 మి.మీగా నమోదైంది. నెలాఖరు వరకు 13.3 మి.మీ వర్షపాతం లోటుగా ఉంది.
రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయాధికారుల సూచనలు
క్రోసూరు:అధిక వర్షాలతో ఊటుకూరులో దెబ్బతిన్న పైరు, (అంతరచిత్రంలో) కుళ్లిన పత్తి కాయలు
చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్టుడే: అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సెప్టెంబరు నెలాఖరు వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 677 మి.మీలు కాగా, 422.2 మి.మీగా నమోదైంది. నెలాఖరు వరకు 13.3 మి.మీ వర్షపాతం లోటుగా ఉంది. అయితే జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం కన్నా అధిక వర్షాలు నమోదయ్యాయి. పెదకూరపాడు ప్రాంతంలో వాగులు పొంగడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పల్నాడు జిల్లాలో ఖరీఫ్లో పత్తి 1,04,990 హెక్టార్లు, మిరప 53,650 హెక్టార్లు, వరి 30,720 హెక్టార్లలో, కంది 1,457 హెక్టార్లలో సాగు చేశారు. ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లావ్యాప్తంగా వర్షపాతం సగటు కంటే ఎక్కువగానే ఉన్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు పెరిగితే పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలతో శనగ, మొక్కజొన్న సాగు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రైతులను కలవరపెడుతున్నాయి. రెండు రోజుల్లోనే సరాసరి జిల్లావ్యాప్తంగా 5 సెం.మీ వర్షం నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పత్తి 30 రోజుల నుంచి 90 రోజుల వయసులో ఉందని, పల్నాడులోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలకు పత్తి పొలాల్లో నీరు నిలిచి ఉన్నట్లయితే 19:19:19(పాలిఫీడ్) లేదా మల్టీ-కె 10 గ్రాములు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా వర్షాలు తగ్గిన తర్వాత పత్తి పొలంలో నీటిని తొలగించి యూరియా 30 కిలోలు, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్తో కలిపి బూస్టర్ డోస్గా వేసుకోవాలన్నారు. మిరపలో కలుపు విపరీతంగా ఉండి నీరు నిలిచినట్లయితే క్విజాలోఫామ్ ఇథైల్ 400మి.లీలు ఒక ఎకరాకు పిచికారీ చేసి గడ్డిజాతి కలుపు నివారించుకోవచ్చన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్