వరదల్లే.. విద్యుత్తు వెలుగులు
కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడటంతో నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూన్ నెలలోనే వరద ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. దీంతో కృష్ణానదిపై ఉన్న జలాశయాలు గరిష్ఠ నీటి సామర్థ్యంతో ఉండటంతో దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది
సీజన్ ఆరంభం నుంచి సాగర్ జలాశయానికి భారీగా నీటి ప్రవాహం
కుడిగట్టు వద్ద 72.79 ఎంయూ యూనిట్లు
టెయిల్ పాండ్ వద్ద 20.39 మిలియన్ యూనిట్లు
ఈనాడు, నరసరావుపేట
కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడటంతో నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూన్ నెలలోనే వరద ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. దీంతో కృష్ణానదిపై ఉన్న జలాశయాలు గరిష్ఠ నీటి సామర్థ్యంతో ఉండటంతో దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. పల్నాడు జిల్లాలో నాగార్జునసాగర్, నాగార్జునసాగర్ టెయిల్పాండ్ వద్ద జలవిద్యుత్తు ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి. నాలుగు నెలలుగా నదిలో నీటిలభ్యత ఉండటంతో జలవిద్యుత్తు యూనిట్లు ఈసారి ఎక్కువ రోజులు పని చేశాయి. దీంతో జలవిద్యుత్తు ఉత్పత్తి గతంలో కంటే ఎక్కువగా జరిగింది. కీలకమైన సమయంలో విద్యుత్తు ఉత్పత్తి అందుబాటులోకి రావడం కలిసొచ్చింది. అత్యంత తక్కువ ఖర్చుతో జెన్కో జల విద్యుత్తు ఉత్పత్తి చేసింది. కృష్ణానదికి ఇప్పటికీ వరద కొనసాగుతుండటంతో మరికొన్ని రోజులు జల విద్యుత్తు యూనిట్లు పూర్తిస్థాయి సామర్థ్యంతో పని చేయనున్నాయి. ఇప్పటికీ నదిలో 50వేల క్యూసెక్కులకుపైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ కుడిగట్టు మీద ఉన్న జల విద్యుత్తు కేంద్రం ద్వారా ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు 72.79 మిలియన్ యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి చేశారు. కుడి కాలువకు నీటిని విడుదల చేసే నీటితో కుడిగట్టు జలవిద్యుత్తు కేంద్రం పని చేస్తుంది. ఇక్కడ ఒక్కొక్క యూనిట్ 30 మెగావాట్ల సామర్థ్యంతో మూడు యూనిట్లు కలిపి 90 మెగావాట్ల సామర్థ్యం ఉంది. జలాశయంలో గరిష్ఠ నీటిమట్టం ఉండి కుడి కాలువకు 10వేల క్యూసెక్కులు విడుదల చేస్తే మూడు యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పని చేస్తాయి. ఈ ఏడాది జూన్ నుంచి కాలువలకు నీటి విడుదల చేయడంతో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగింది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటిని తీసుకుంటుండటంతో మూడు యూనిట్లు పని చేస్తున్నాయి. కుడిగట్టు వద్ద ఉత్పత్తి చేసే విద్యుత్తు మొత్తం మన రాష్ట్రానికి వస్తుంది. జలవిద్యుత్తు 24 గంటలూ ఉత్పత్తి చేసే వెసులుబాటుతో పాటు కీలకమైన సమయంలోనూ అందుబాటులో ఉన్నందున జెన్కోకు కలిసివచ్చింది. సాగర్ కుడి కాలువకు నీరు అవసరమైనప్పుడు విడుదల చేసే నీటితో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు.
నాగార్జునసాగర్ దిగువన 21 కిలోమీటర్ల దూరంలో రెంటచింతల మండలంలో సత్రశాల సమీపంలో నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నిర్మించారు. సాగర్ ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రంలో రివర్సబుల్ టర్బయిన్లు ఉన్నాయి. సాగర్ జలాశయంలో నీటినిల్వలు తక్కువగా ఉన్నప్పుడు జలవిద్యుత్తు ద్వారా దిగువకు విడుదల చేసిన నీటిని నిల్వ చేసి మళ్లీ తిరిగి జలాశయంలోకి ఎత్తిపోయడానికి నిర్మించినదే టెయిల్ పాండ్ ప్రాజెక్టు. దీని నీటి నిల్వ సామర్థ్యం 6 టీఎంసీలు. ఇక్కడ 6 టీఎంసీలు నీరు నిల్వ చేస్తే నాగార్జునసాగర్ డ్యామ్ వరకు బ్యాక్వాటర్ నిలుస్తుంది. ఈ నీటిని రివర్సబుల్ టర్బయిన్ల ద్వారా జలాశయంలోకి ఎత్తిపోస్తారు. అయితే నదికి వరద వచ్చినప్పుడు జలవిద్యుత్తు ఉత్పత్తి చేయడానికి వీలుగా 25 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లు ఏర్పాటు చేశారు. మొత్తం 50 మెగావాట్ల సామర్థ్యంతో ఇవి పని చేస్తాయి. అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ అవసరాలకు విడుదల చేసిన నీటిని ఉపయోగించుకుని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ 2017 సంవత్సరంలో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది ఏపీ జెన్కో ఆధ్వర్యంలో పని చేస్తుంది. ఈ ఏడాది నదికి వరుసగా వరదనీరు కొనసాగుతుండటంతో జూన్ నుంచి సెప్టెంబరు వరకు యూనిట్లు పని చేస్తున్నాయి. ప్రస్తుతం వరద కొనసాగుతున్నందున పూర్తిస్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
[ 19-04-2024]
ఏప్రిల్ 16న భీమవరంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
[ 19-04-2024]
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
గుంటూరు జిల్లాలో ప్రబలిన డయేరియా.. 100 మందికి పైగా అస్వస్థత
[ 19-04-2024]
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో గ్రామంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. -
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!