వీడని ముసురు
రెండు రోజులుగా తెరిపివ్వని వానకలెక్టరేట్(గుంటూరు), న్యూస్టుడే: అల్పపీడన ప్రభావంతో జిల్లాపై వానముసురు పట్టింది. రెండు రోజులుగా వర్షం తెరపివ్వకుండా పడుతూనే ఉంది. పండగ రోజు సైతం కాస్తంత విరామం లేకుండా వర్షం పడుతూనే ఉంది. ప్రజలు బయటకు వెళ్లనివ్వకుండా వర్షం ఆటంకాన్ని ఏర్పరచింది
ప్రత్తిపాడు: జగనన్నకాలనీలో వర్షపు నీరు నిలవడంతో అధ్వానంగా రోడ్డు
రెండు రోజులుగా తెరిపివ్వని వానకలెక్టరేట్(గుంటూరు), న్యూస్టుడే: అల్పపీడన ప్రభావంతో జిల్లాపై వానముసురు పట్టింది. రెండు రోజులుగా వర్షం తెరపివ్వకుండా పడుతూనే ఉంది. పండగ రోజు సైతం కాస్తంత విరామం లేకుండా వర్షం పడుతూనే ఉంది. ప్రజలు బయటకు వెళ్లనివ్వకుండా వర్షం ఆటంకాన్ని ఏర్పరచింది. పట్టణాలు, పల్లెలు వానతో ముసురు పట్టడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. పలు మండలాల్లో భారీ వర్షం కురవటంతో కాల్వలు పొంగిపొర్లాయి.
నగరాన్ని ముంచెత్తిన వాన
గుంటూరు నగరాన్ని వర్షం ముంచెత్తింది. బుధవారం పండగ రోజు సైతం వర్షం దశల వారీగా కురుస్తూనే ఉంది. గురువారం అదే పరిస్థితి కొనసాగింది. శివారు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు వీలుకాలేదు.
* జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు సగటున 46.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. చేబ్రోలు మండలంలో వంద మిల్లీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. వట్టిచెరుకూరు 75.6, తాడికొండ 65.4, ప్రత్తిపాడు 64.4, తెనాలి 63.2, దుగ్గిరాల 62.8, మంగళగిరి 52.4, తుళ్ళూరు 49.2, పెదకాకాని 45.2, గుంటూరు తూర్పు 39.6, గుంటూరు పశ్చిమ 38.6, ఫిరంగిపురం 23.6, పొన్నూరు 22.4, తాడేపల్లి 18.6, మేడికొండూరు 17.8, కొల్లిపర 15.8, కాకుమాను 12.8, పెదనందిపాడు 11.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, న్యూస్టుడే వట్టిచెరుకూరు మండలంలోని గ్రామాల్లో రెండు రోజులుగా కుంభవృష్టిగా వర్షం కురిసింది. గురువారం వట్టిచెరుకూరు మండల కేంద్రంలో 75.6 మి.మీ వర్షపాతం నమోదైంది. గత మూడేళ్లుగా కాలువల్లో పూడిక తొలగించకపోవడంతో వట్టిచెరుకూరు, యామర్రు, కాట్రపాడు, చమళ్లమూడి, వింజనంపాడు, ముట్లూరు, కారంపూడిపాడు, లేమల్లెపాడు, అనంతవరప్పాడులో పంట పొలాలపై వరద నీరు నిలవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వట్టిచెరుకూరు, యామర్రులలో రైతులు సొంతంగా విరాళాలు సమకూర్చుకుని పొక్లెయినర్తో గుర్రపుడెక్క ఆకు తొలగింపునకు ముందుకొచ్చారు.వట్టిచెరుకూరు విద్యుత్ ఉపకేంద్రం, తహసీల్దారు కార్యాలయాల చుట్టూ మూడు అడుగుల లోతున నీరు చేరింది. మండల విద్యావనరుల కేంద్రంలోకి నీరు వెళ్లింది. ఒకటో నంబర్ జల్లవాగు కట్టలుపైకి ఎగసిపడుతూ నీరు ప్రవహిస్తోంది.
ప్రత్తిపాడులో 64.4 మి.మీ వర్షపాతం
ప్రత్తిపాడు మండలంలో రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం 64.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువన కురిసిన వర్షాలకు వంగిపురం, మేడవారిపాలెం, తిమ్మాపురం, గింజుపల్లివారిపాలెం, పాతమల్లాయపాలెం గ్రామాల్లో పొలాలు నీట మునిగాయి. గత శుక్రవారం కురిసిన వర్షంతో పత్తి, మిరప, అపరాల పంటలు నీట మునిగాయి. ఊపిరి పోసుకుంటుండగా మరోసారి వర్షం ముంచెత్తింది. ప్రత్తిపాడులో వైద్యశాల, సమీపంలోని నివాసాలను ముంచెత్తుతున్న చిన్న చెరువు గోడను ఈవోపీఆర్డీ మోషే, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు జేసీబీతో తొలగింపజేశారు. జగనన్న కాలనీల్లో భారీగా నీరు నిలిచింది. చినకొండ్రుపాడు, గొట్టిపాడు రోడ్డులో భారీ గుంతల్లో నీరు నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ డీజీపీని బదిలీచేయండి: ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు
[ 25-04-2024]
డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో భాజపా నేతలు మరోమారు ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్