జింకానా.. నిలుస్తుంది ప్రజల హృదయాన
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని పేర్కొన్నారు. ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగ్గా సేవలు అందించాలని నాడు-నేడు పేరుతో వాటి రూపురేఖలు మారుస్తున్నామని తెలిపారు.
జీజీహెచ్లో మాతా-శిశు సంరక్షణ కేంద్రం పనులకు శంకుస్థాపన
ఈనాడు-అమరావతి
గుంటూరు జీజీహెచ్లో మాతాశిశు సంరక్షణ భవనానికి శంకుస్థాపన సందర్భంగా ప్రసంగిస్తున్న మంత్రి విడదల రజిని. చిత్రంలో సూపరింటెండెంట్ ప్రభావతి, డిప్యూటీ మేయర్ షేక్ సజీల, ఎమ్మెల్యే మద్దాల గిరిధర్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, శ్రీదేవి, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, కేఎస్ లక్ష్మణరావు
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని పేర్కొన్నారు. ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగ్గా సేవలు అందించాలని నాడు-నేడు పేరుతో వాటి రూపురేఖలు మారుస్తున్నామని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో శుక్రవారం డాక్టర్ కానూరి రామచంద్రరావు మాతా-శిశు సంరక్షణ కేంద్రం పనులను ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాధారణ జబ్బులకే కాదు కేన్సర్ వంటి ఖరీదైన రోగాలకు ఏపీలోనే వైద్యసేవలు అందించాలని, కేన్సర్ వైద్యాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రధానంగా మహిళల్లో వస్తున్న రొమ్ము కేన్సర్, గర్భాశయ కేన్సర్ల నివారణపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించామని చెప్పారు. గుంటూరు వైద్య కళాశాలలో చదివి ఉత్తర అమెరికాలో స్ధిరపడిన వైద్యులు ఎంతో ఉదారంగా వ్యవహరిస్తూ జీజీహెచ్ అభివృద్ధికి పాటు పడుతున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా ప్రశంసించారు. వారి సేవా నిరతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం కావాలని సూచించారు. వ్యక్తిగత స్వార్థంతో నిండిపోయిన ఈ రోజుల్లో డాక్టర్ గవిని ఉమాదేవి ఏకంగా రూ.22 కోట్లు మాతా-శిశు సంరక్షణ కేంద్రం పనులకు భూరి విరాళంగా ఇవ్వటం అభినందనీయమన్నారు. ఆమె సేవానిరతికి రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నానంటూ ప్రశంసించారు. బొంగరాలబీడులోనూ ఆస్పత్రుల నిర్మాణానికి ముందుకు రావాలని కోరారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ కరోనాలో గుంటూరు జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవలు అందించారని కొనియాడారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ గుంటూరు జీజీహెచ్కు ఆరు జిల్లాల నుంచి రోగులు వస్తారని ఈ ఆసుపత్రి అభివృద్ధిలో జింకానా పాత్ర మరువలేనిదన్నారు. తాను మండలి సభ్యునిగా పల్నాడులో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని పలుమార్లు కోరానని, పిడుగురాళ్లలో వైద్య కళాశాల నిర్మాణం ద్వారా ఆ కలనెరవేరబోతుందని తెలిపారు. మండలి విప్ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ అన్నీ ప్రభుత్వమే చేయలేదని, జింకానా లాంటి సంస్థలు ఉదారంగా ముందుకు వచ్చి చేయూతనివ్వటం గర్వకారణమన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి మాట్లాడుతూ 30 ఏళ్ల తర్వాత వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో ఖాళీలు మొత్తం భర్తీ అయ్యాయని చెప్పారు. ఆస్పత్రిలో 600 పడకలతో మాతా-శిశు సంరక్షణ కేంద్రం పనులు పూర్తయితే ప్రసూతి వైద్యసేవలు మరింత మెరుగవుతాయని చెప్పారు. డాక్టర్ గవిని ఉమాదేవి రూ.22 కోట్లు, డాక్టర్ మువ్వా వెంకటేశ్వరరావు రూ.22 కోట్లు, డాక్టర్ సూరపనేని, డాక్టర్ తేళ్ల నళిని రూ.11 కోట్లు చొప్పున 1994-95 బ్యాచ్కు చెందిన వైద్యులు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహర్నాయుడు, నామినేటెడ్ ఛైర్మన్లు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మందపాటి శేషగిరిరావు. జింకానా తరపున డాక్టర్ కళాధర్, నాట్కో ట్రస్టు నుంచి డాక్టర్ సదాశివరావు, వైద్య, ఆరోగ్యశాఖ నుంచి ఏపీవీపీ కమిషనర్ వినోద్కుమార్ తదితరులు హాజరయ్యారు. మూడేళ్ల క్రితం ఆస్పత్రిలో చేపట్టిన మాతా-శిశు సంరక్షణ కేంద్రం పనులు నిలిచిపోయి తిరిగి వాటిని జింకానా ఆర్థిక సౌజన్యంతో పునఃప్రారంభించటంలో క్రియాశీలకంగా వ్యవహరించిన మంత్రి రజినిని, జింకానా స్థానిక కోఆర్డినేటర్ డాక్టర్ బాలభాస్కరరావులను ఎమ్మెల్యే ముస్తాఫా, సూపరింటెండెంట్ ప్రభావతి అభినందించారు. ఈ కార్యక్రమానికి జీజీహెచ్, వైద్య కళాశాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆచార్య ప్రభావతి ఐ లవ్ ఇండియా, భలే మంచి రోజు అంటూ పాటలు పాడి అందరినీ ఉత్సాహపరిచారు.
సభకు హాజరైన వైద్య సిబ్బంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్