పానకాలస్వామి కొండ...పర్యటక అండ...
మంగళగిరి పానకాలస్వామి కొండను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అటవీ శాఖ సంకల్పించింది. నగరం మధ్యలో ఉన్న కొండపై దట్టమైన అటవీ ప్రాంతం ఉంది.ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో ఉన్న కొండ ట్రెక్కింగ్కు అనువుగా ఉంటుందని గుర్తించారు.
ట్రెక్కింగ్ నిర్వహణకు ఏర్పాట్లు
న్యూస్టుడే, మంగళగిరి
ట్రెక్కింగ్ ఏర్పాటు చేసే కొండ
మంగళగిరి పానకాలస్వామి కొండను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అటవీ శాఖ సంకల్పించింది. నగరం మధ్యలో ఉన్న కొండపై దట్టమైన అటవీ ప్రాంతం ఉంది.ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో ఉన్న కొండ ట్రెక్కింగ్కు అనువుగా ఉంటుందని గుర్తించారు. దీంతో అటవీ శాఖ ఇందకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఎయిమ్స్కు ముఖద్వారం వద్ద నుంచి ట్రెక్కింగ్కు అవసరమైన మార్గాలను గుర్తించారు.
రాష్ట్రంలోనే విశాఖ తరువాత 192 చ.కి.మీ మేర విస్తరించిన మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ అతిపెద్ద నగరంగా ఆవిర్భవించింది. అటవీ శాఖ ఈ ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. కాలినడకన కొండపైకి వెళ్లేందుకు ట్రెక్కింగ్ మార్గాలను పరిశీలించి ఎంపిక చేశారు. వృద్ధులు, యువకులకు వేర్వేరు మార్గాలను ప్రతిపాదించారు. రెండు నెలల్లో దీనిని అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
కొండపై రమణీయ దృశ్యాలు...
పానకాలస్వామి కొండపై నుంచి చూస్తే చుట్టూ రమణీయమైన దృశ్యలు కనువిందు చేస్తాయి. ఓవైపు ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపించే రాజధాని అమరావతిలోని భవనాలు, మరోవైపు ఎయిమ్స్ భవనాలు, మంగళగిరి నగరం పర్యటకులను ఆకట్టుకుంటాయి. పానకాలస్వామి ఆలయం వద్ద నుంచి దేవస్థానం కొండ శిఖరంపైకి మెట్లతో మార్గం ఏర్పాటు చేశారు. తాజాగా కొండ చుట్టూ ఏడు కి.మీ గిరి ప్రదక్షిణ కోసం రోడ్డు నిర్మించారు. దీనిని రోజూ ఆరోగ్యం కోసం నడక సాగించే వారు వినియోగించుకుంటున్నారు. భక్తులు గండదీపం సందర్శిస్తున్నారు. కొండపైకి వెళ్లే వారి సౌలభ్యం కోసం తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. గండదీపం కోసం దాతలు రాతి మండప నిర్మాణం చేపడుతున్నారు. భక్తులే కాకుండా యువతీ యువకులను ఆకట్టుకునే రీతిలో అటవీ అధికారులు ట్రెక్కింగ్ నిర్వహణకు చర్యలు చేట్టారు. మంగళగిరి కొండను పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు.
తీగ మార్గం ఏర్పాటుపై దృష్టి
పర్యటకులను ఆకట్టుకునేందుకు పానకాలస్వామి గుడి వద్ద నుంచి కొండ శిఖరంపై ఉన్న గండాలయస్వామిని భక్తులు దర్శనం చేసుకునేందుకు అనువుగా తీగమార్గం (రోప్వే) ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇందుకు రూ.100 కోట్లకు పైగా ఖర్చవుతుందని భావిస్తున్నారు. ప్రాజెక్టునకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వంతో చర్చించిన తరువాత తీగమార్గం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
టెంపుల్ హిల్ పార్క్
టెంపుల్ ఎకోహిల్ పార్క్ అభివృద్ధి
ఎయిమ్స్ ముఖద్వారం పక్కనే నగర ప్రజలు సేద తీరేందుకు అవసరమైన టెంపుల్ ఎకో హిల్ పార్క్ను అభివృద్ధి చేయనున్నారు. నగరం నుంచి పెద్ద సంఖ్యలో వస్తుండడంతో చిన్నారులకు ఆటవిడుపుగా ఉండేందుకు అవసరమైన చర్యలు చేట్టారు. చిన్నారులకు ఆటవస్తువులు, పెద్దలకు జిమ్ సౌలభ్యం కల్పించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరేందుకు సిమెంట్ బల్లలను ఏర్పాటు చేశారు.
మూడు జిల్లాల్లో ట్రెక్కింగ్ ప్రతిపాదన
గుంటూరు జిల్లా మంగళగిరి, పేరేచర్ల, పల్నాడు జిల్లాలో కొండవీడు, కోటప్పకొండ వంటి కొండలపై ట్రెక్కింగ్ ఏర్పాటుకు ప్రతిపాదించాం. ప్రస్తుత జీవనశైలిలో ఇది మంచి వ్యయామం అవుతుంది. కొండపైకి నడక సాగించే సమయంలో వివిధ రకాల ఔషధ మొక్కల నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి దోహదపడుతుంది. రెండు నెలల్లో మంగళగిరి ట్రెక్కింగ్ ఆచరణలోకి తీసుకురావాలని భావిస్తున్నాం. - రామచంద్రరావు, అటవీశాఖ జిల్లా అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!