9.14 లక్షల మందికి ఆరోగ్య భరోసా
విజయదశమి వేళ కేంద్ర ప్రభుత్వం అల్పాదాయ కుటుంబాలకు శుభవార్త పంపింది. ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందజేసేందుకు ఆయుష్మాన్ భారత్ పేరుతో పేదలకు భరోసా ఇవ్వబోతోంది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తరహాలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య కార్డులు(ఏబీపీఎంజీఏవై) అర్హులకు పంపిణీ చేయనున్నారు.
ఆరోగ్యశ్రీ తరహాలో కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ కార్డులు
ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.5లక్షల వరకు వైద్యం ఉచితం
న్యూస్టుడే, సత్తెనపల్లి
జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్హెచ్ఏ) ఆయుష్మాన్ భారత్ పథకం కింద లబ్ధిదారుల్ని గుర్తించింది. పల్నాడు జిల్లాలో 2,80,510 కుటుంబాలు అర్హత సాధించాయి. ఆ కుటుంబాల్లో 9,14,381 మందికి పూర్తిస్థాయిలో వైద్య భరోసా దక్కబోతోంది. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమాతోపాటు దేశంలో ఎక్కడైనా వైద్యసేవలు పొందే అవకాశం ఉంటుంది. జిల్లాలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద బియ్యం కార్డుదారులందరూ అర్హులుగా ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో 6,35,168 కుటుంబాలకు బియ్యం కార్డులు ఉన్నాయి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు 6,20,625 ఉన్నాయి. వీరికి ఆరోగ్యశ్రీ పరిధిలో 2,246 రకాల వైద్య సేవలందిస్తున్నారు.
దారిద్య్రరేఖకు దిగువ ఉన్న కుటుంబాల్ని ఆయుష్మాన్ భారత్ కింద ఎంపిక చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కేంద్రం సర్వే ద్వారా గుర్తించిన లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపింది. వాలంటీర్లు, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల వివరాల్ని ఏబీపీఎంజీఏవై యాప్లో పొందుపరుస్తున్నారు. లబ్ధిదారుల ముఖచిత్రాన్ని యాప్ ద్వారా నిక్లిప్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తిచేసి జిల్లా కార్యాలయం నుంచి విజయవాడలోని ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయానికి పంపిస్తున్నారు. అక్కడ కార్డులను ముద్రించి జిల్లాలోని సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లబ్ధిదారులు తమ వివరాల్ని యాప్లో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఈ నెల 5వరకు గడువు ఇచ్చారు. కార్డుల పంపిణీకి వచ్చే నెల 15 వరకు కేంద్రం గడువు విధించింది. ఇప్పటివరకు జిల్లాలో 12,962 మంది కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా 12,355 మందికి అనుమతులు లభించాయి. మిగిలిన వారు కూడా కార్డులకు దరఖాస్తు చేస్తున్నారు. కార్డు చేతికందినప్పటి నుంచి దేశంలో గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ భారత్ వైద్య సేవలు పేదలకు అందుబాటులోకి రాబోతున్నాయి.
ఎన్హెచ్ఏ ద్వారా పల్నాడు జిల్లాలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకానికి 2.80 లక్షల కుటుంబాలు ఎంపికైనట్లు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ పి.సునీల చెప్పారు. కార్డుల పంపిణీ ప్రక్రియను త్వరలోనే చేపడతామని తెలిపారు. పథకానికి అర్హులై యాప్లో నమోదవ్వనివారు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆమె కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!