చిత్ర వార్తలు
ఇటీవల కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల పాఠశాలల్లోకి నీరు చేరి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. రేపల్లె పట్టణం 24వ వార్డులోని ఎన్టీఆర్ ప్రాథమిక పాఠశాల ఒకటి నుంచి ఐదు తరగతులు కొనసాగుతున్నాయి. 50 మంది విద్యార్థులు చదువుతున్నారు.
తరగతి
తరగతి గదిలోకి చేరిన వర్షపు నీరు
ఇటీవల కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల పాఠశాలల్లోకి నీరు చేరి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. రేపల్లె పట్టణం 24వ వార్డులోని ఎన్టీఆర్ ప్రాథమిక పాఠశాల ఒకటి నుంచి ఐదు తరగతులు కొనసాగుతున్నాయి. 50 మంది విద్యార్థులు చదువుతున్నారు. వర్షాలకు పాఠశాల తరగతి గదుల్లోకి నీరు చేరడంతో పక్కనే ఉన్న ఆలయ ప్రాంగణంలో పిల్లలను కూర్చోబెట్టి ఉపాధ్యాయులు బోధన చేపట్టారు. అక్కడే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయించారు. భారీ వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే సమస్య ఎదురవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం కొరవడింది. 2019లో పాఠశాలలో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడంతో అవస్థలు తప్పడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. - న్యూస్టుడే, రేపల్లె అర్బన్
గుడి ఆవరణలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు
ఆస్పత్రికి సుస్తీ
వైద్యులు పరీక్షించే గది దారుణంగా...
పెదనందిపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవనం ఘోరంగా ఉంది. వైద్యుల గదులు, ల్యాబ్, ఓపీ కేంద్రం ఇలా అన్ని విభాగాల్లో పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది. వర్షం వస్తే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. పదేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించినా స్థితి మారడం లేదు. జబ్బుతో వచ్చే రోగులు ఆస్పత్రిని చూసి బెంబేలెత్తుతున్నారు. - పెదనందిపాడు (ఈనాడు-గుంటూరు)
శిథిఫలావస్థకు చేరిన ల్యాబ్
స్కాన్ చేసి తెలుసుకో
వాగులు వంకలు ఏరులై..
అనంతవరం వద్ద పత్తి పొలంలో నీరు
కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలిచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. పలు గ్రామాల్లోని అంతర్గత రోడ్లు పిల్లకాల్వలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని గృహాల వద్ద వరద నీరు నిలిచి తటాకాలను తలపిస్తోంది. క్రోసూరు మండలంలోని ఊటుకూరు-బయ్యవరం గ్రామాల మధ్యనున్న కప్పలవాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. - న్యూస్టుడే, క్రోసూరు
బయ్యవరం వద్ద ఎద్దువాగు ఉద్ధృతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!