Honey Trap: వలపు వల.. గుంటూరులో వృద్ధుడి విలవిల
భార్య చనిపోయి ఒంటరిగా ఉన్న అతను తోడు కోరుకున్నారు. విషయం తెలుసుకున్న ముగ్గురు అమ్మాయిలు వలపు ఎర వేసి అతని వద్ద రూ. లక్షలో దోచేసి మొహం చాటేశారు. జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు (60) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
తోడు కావాలంటే డబ్బు తోడేశారు
నెహ్రూనగర్ (గుంటూరు), న్యూస్టుడే: భార్య చనిపోయి ఒంటరిగా ఉన్న అతను తోడు కోరుకున్నారు. విషయం తెలుసుకున్న ముగ్గురు అమ్మాయిలు వలపు ఎర వేసి అతని వద్ద రూ. లక్షలో దోచేసి మొహం చాటేశారు. జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు (60) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల కిందట భార్య మృతి చెందారు. వారి ఇద్దరు పిల్లలు పెళ్లి చేసుకొని వెళ్లిపోయారు. షుగర్తో బాధ పడుతున్న అతను తన ఆలనపాలన చూసుకోడానికి ఒక మహిళ తోడు ఉంటే బాగుంటుందనుకున్నారు.
పత్రికలో వివాహాల మధ్యవర్తి ఫోన్ నంబర్కు కాల్ చేసి మాట్లాడారు. అటువైపు నుంచి ముందుగా తన ఖాతాలో రూ. 3 వేలు జమ చేయాలని కోరింది. ఖాతాకు రూ. 3 వేలు జమ చేసిన తర్వాత ఆమె ఓ ఫోన్ నంబర్ ఇచ్చింది. ఆ నంబర్కు అతను ఫోన్ చేశారు. అలా మాటలు కలిపిన ఆమె అతనితో కలసి జీవించటానికి సుముఖంగా ఉన్నట్లు ఏమార్చింది. కొద్దిరోజులకు తనకు రూ. లక్ష అవసరం ఉందని, నగదు ఇవ్వాలని కోరింది. తన వద్ద డబ్బులు లేవని అతను సున్నితంగా చెప్పాడు. అప్పటి నుంచి అతనితో ఆమె ఫోన్ మాట్లాడటం లేదు. రెండు రోజుల తర్వాత మరో మహిళ అతనికి ఫోన్ చేసింది. జంగారెడ్డిగూడెం నుంచి మాట్లాడుతున్నానని, తనకు ఎవరూ లేరని చెప్పింది. తనకు చాలా ఆస్తి ఉందని, తాను కూడా తోడు కావాలని కోరుకుంటున్నట్లు నమ్మించింది.
కొద్దిరోజుల తర్వాత కుటుంబ అవసరాలకు రూ.లక్ష ఇస్తే వెంటనే తిరిగి ఇచ్చేస్తానని ప్రేమగా కోరింది. ఆమె మాటలకు ఫిదా అయి రూ.లక్ష ఆమె ఖాతాలో వేశారు. అప్పటి నుంచి ఆమె ఫోన్ తీయడం లేదు. కొద్దిరోజులకు భీమవరం నుంచి ఓ మహిళ ఫోన్ చేసింది. వివాహాల మధ్యవర్తి నుంచి నెంబర్ తీసుకున్నానని తెలిపింది. అప్పటికే ఇద్దరు మస్కా కొట్టడంతో కోపంగా ఉన్న వృద్ధుడు ఆమె మాటలు నమ్మశక్యం కాక కొద్దిరోజులు పట్టించుకోలేదు. అయినా ఆమె పదేపదే ఫోన్ చేయడంతో ఒకరోజు మాట్లాడారు. ఇదే తరహాలో తనను మహిళలు మోసగించారని ఆమెకు చెప్పారు. తాను అలాంటి దానిని కాదని, తనకు 35 సంవత్సరాలకే పెళ్లయ్యిందని తెలిపింది. భర్తలో మగతనం లేక, పిల్లలు పుట్టక విడాకులు ఇచ్చానని చెప్పింది. తల్లిదండ్రులు లేని తాను ప్రస్తుతం అన్నయ్య వద్ద ఉంటున్నానని, అతను తాగివచ్చి కొడుతున్నాడని ఫోన్లో ఏడ్చింది. అమ్మమ్మ ఇచ్చిన రూ. కోట్ల ఆస్తి ఉందని, వేరే వారిని మోసం చేసి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం తనకు లేదంటూ మస్కా కొట్టింది.
ఆమె తియ్యటి మాటలకు అతను తెలియకుండానే మాయలో పడిపోయాడు. తన వయస్సు, భార్య చనిపోయిన విషయం, కుటుంబ పరిస్థితులు చెబితే... అన్నింటికీ సమ్మతమేనని ఆమె తెలిపింది. వివాహం చేసుకుంటానని మాయ చేసింది. కొద్దిరోజులు ఛాటింగ్ చేసింది. వీడియో కాల్ చేయమని కోరింది. ఎలా వీడియోకాల్ మాట్లాడాలో ఓ లింకు పంపించి క్లిక్ చేయమంది. అతనిది స్మార్టుఫోన్ కాకపోవడంతో మిన్నకుండిపోయాడు. కొద్దిరోజుల తర్వాత తన అమ్మమ్మ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయడానికి రూ. లక్ష కావాల్సి వచ్చిందని, నగదు ఇస్తే వారంలో తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది. ఆమె మాటలు నమ్మిన అతను, తన భార్యకు చెందిన బంగారం వస్తువులు బ్యాంకులో కుదవపెట్టి డబ్బులు దగ్గర పెట్టుకున్నారు. బ్యాంకు ఖాతాలో వేస్తే మోసగిస్తున్నారని ఆమెను నేరుగా కలవాలని అనుకున్నట్లు తెలిపారు. దీంతో ఆ మహిళ తాను బస్సులో వస్తున్నానని, బస్టాండ్కు వచ్చి రిసీవ్ చేసుకోవాలని కోరింది. అక్కడ నుంచి ఇద్దరం ఇంటికి వెళదామని చెప్పింది. ఆమె చెప్పినట్లు బస్టాండ్కు వెళ్లగానే రిజిస్ట్రేషన్కు సమయం అవుతోందని, ముందు డబ్బులు ఇస్తే కట్టేసి వచ్చేస్తానంటూ చెప్పింది. నగదు తీసుకొని మాయమైంది. అప్పటి నుంచి ఆమెకు ఫోన్ చేస్తే స్పందించడం లేదు.
బంగారపు వస్తువులు బ్యాంకులో తనఖా పెట్టిన రశీదు
వీడియోకాల్ చేయమంటూ పంపిన సమాచారం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో