logo

తెదేపా హయాంలోనే మాదిగల అభ్యున్నతి: వర్ల

 తెలుగుదేశం ప్రభుత్వంతోనే మాదిగల అభ్యున్నతి సాధ్యమని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. తాడేపల్లి పరిధిలోని వడ్డేశ్వరంలో మాదిగల ఆత్మీయ సమావేశం శనివారం నిర్వహించారు.

Published : 27 Nov 2022 05:56 IST

మాట్లాడుతున్న వర్ల రామయ్య, పక్కన మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, శోభారాణి, మాణిక్యరావు, శిరీష

మంగళగిరి, న్యూస్‌టుడే:  తెలుగుదేశం ప్రభుత్వంతోనే మాదిగల అభ్యున్నతి సాధ్యమని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. తాడేపల్లి పరిధిలోని వడ్డేశ్వరంలో మాదిగల ఆత్మీయ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ల మాట్లాడుతూ  వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే యువత చదువుపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో 82 శాతం దళితులపై కేసులు నమోదైతే అందులో 73 శాతం మాదిగలు ఉన్నారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లకట్ల స్వామిదాసు, న్యాయవాది శోభారాణి, మాణిక్యరావు, కంభంపాటి శిరీష, సాంబశివరావు, ఈపూరి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని