గడువు తీరిన చిరుతిండి విక్రయాలు
కాలం చెల్లిన చిరుతిండి ప్యాకెట్లు తిన్న నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక కాకతీయ కల్యాణ మండపం సమీపంలోని ఓ కిరాణా దుకాణంలో నలుగురు చిన్నారులు కుర్కురే ప్యాకెట్లు కొనుగోలు చేసి తిన్నారు.
అస్వస్థతకు గురైన నలుగురు చిన్నారులు
కిరాణ దుకాణం వద్ద తల్లిదండ్రుల ఆందోళన
సత్తెనపల్లి, న్యూస్టుడే : కాలం చెల్లిన చిరుతిండి ప్యాకెట్లు తిన్న నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక కాకతీయ కల్యాణ మండపం సమీపంలోని ఓ కిరాణా దుకాణంలో నలుగురు చిన్నారులు కుర్కురే ప్యాకెట్లు కొనుగోలు చేసి తిన్నారు. కాసేపటికి వారు కడుపు నొప్పితో విలవిల్లాడుతూ వాంతులు చేసుకున్నారు. వేర్వేరుగా తల్లిదండ్రులు ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా కుర్కురేలు తిని వాంతులు చేసుకున్నట్లు పిల్లలు ఆయనకు చెప్పారు. 11 ఏళ్ల వైభవ్ అనే చిన్నారిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైభవ్తోపాటు ఆ ప్యాకెట్లు తిన్న చిన్నారుల తల్లిదండ్రులు దుకాణం వద్ద శనివారం రాత్రి ఆందోళన చేశారు. పిల్లలు తిన్న ప్యాకెట్లు పరిశీలించగా వాటి కాలపరిమితి ఈ ఏడాది జనవరితోనే ముగిసినట్లు ఉంది. కాలం చెల్లిన ప్యాకెట్లు ఎలా అమ్ముతున్నారంటూ వ్యాపారిని ప్రశ్నించారు. ఈ రోజు మధ్యాహ్నమే పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలోని హోల్సేల్ వర్తకుడు వాటిని ఇచ్చారని, తాను చూసుకోలేదని వ్యాపారి చెప్పారు. పిల్లల తల్లిదండ్రుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సై కిషోర్ సిబ్బందితో అక్కడికి చేరుకుని విచారించారు. దుకాణాన్ని మూసేయించి వ్యాపారిని స్టేషన్కు తరలించారు. ఆహార కలుషితంపై విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
2022 జనవరితో కాల పరిమితి ముగిసినట్లు ఉన్న వివరాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీలా మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)