ఇళ్లు కట్టుకోలేమన్నా..
వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో జగనన్న కాలనీలు చిట్టడవులను తలపిస్తున్నాయి. గురజాల డివిజన్ పరిధిలోని గురజాల, దాచేపల్లి నగర పంచాయతీలు, మాచర్ల, పిడుగురాళ్ల పురపాలక సంఘాలు మినహా ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టలేదు.
గురజాల డివిజన్లో గ్రామాల్లో మొదలు కాని నిర్మాణం
గురజాల మండలం దైద లే ఔట్లో మొలిచిన కంపచెట్లు
గురజాల, న్యూస్టుడే: వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో జగనన్న కాలనీలు చిట్టడవులను తలపిస్తున్నాయి. గురజాల డివిజన్ పరిధిలోని గురజాల, దాచేపల్లి నగర పంచాయతీలు, మాచర్ల, పిడుగురాళ్ల పురపాలక సంఘాలు మినహా ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టలేదు. లేఔట్ వేసి 29 నెలలు గడిచిపోయాయి. జగనన్న లేఔట్లు కంపలు, పిచ్చిచెట్లు, పొదలతో నిండిపోయాయి. ఆనాడు వేసిన రహదారులు దుస్థితికి చేరాయి. రెండు సంవత్సరాలుగా కురుస్తున్న అధిక వర్షాలకు గ్రావెల్ రోడ్లు పాడైపోయాయి. రోడ్డుకు ఇరువైపులా పెరుగుతున్న కంపచెట్లు ఆ రోడ్లను కప్పివేస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాల మంజూరు కార్యక్రమం వైకాపా ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టింది. పట్టణాల్లో సెంటు భూమి, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర చొప్పున భూమిని అందించే విధంగా పథకానికి రూపకల్పన చేశారు. దీనికితోడు రోడ్లు, నీటి, విద్యుత్తు వసతి కల్పిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామ పంచాయతీలో జగనన్న కాలనీల పేరిట లేఔట్లు వేసి మరీ పట్టాల పంపిణీని 2020 సంవత్సరం జులై నెల మొదటి వారంలో భారీఎత్తున ఈ పంపిణీలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పాల్గొని సందడి చేశారు. ఒక్కో లేఔట్ నిర్మాణానికి సరాసరి రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఖర్చు చేశారు. గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 134 వరకు లేఔట్లు వేశారు. మొత్తం 38,432 మందికి పట్టాలను మంజూరు చేసి అందజేశారు. గురజాల, మాచర్ల నియోజకవర్గాలలో మొత్తం రూ.67 కోట్ల వరకు నిధులను వెచ్చించారు.
గడ్డితో మూసుకుపోతున్న రహదారి
ఇచ్చి ఏం లాభం?
ఇళ్లు కట్టించి ఇస్తామన్నా ప్రభుత్వ మాటలు నెరవేరడం లేదు.. ఇచ్చి ఏం లాభం.. అంటూ పట్టాలు పొందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నిర్మాణాలు చేసి ఇస్తే ఎంతో ఉపయోగంగా ఉండేదని చెబుతున్నారు. ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణం చేస్తే తప్ప సొంతంగా కట్టుకునే స్థితి లేదని చెబుతున్నారు. ప్రస్తుతం మున్సిపాల్టీలు, నగర పంచాయతీల పరిధిలో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. లబ్ధిదారులకు చేతకాకపోతే తామే కట్టిస్తామని ఆర్భాటంగా మొదట ప్రకటించారు. ప్రతిఒక్కరూ కట్టించి ఇవ్వమని కోరినా ప్రభుత్వం స్పందించకుండా వెనకడుగు వేసింది. దశల వారీగా డబ్బులు ఇస్తా.. లబ్ధిదారులే కట్టుకోండని.. ప్రభుత్వం ప్రకటించి చేతులు దులుపుకుంది. ప్రారంభించిన పట్టణ ప్రాంత లేఔట్ల్లోనూ నిర్మాణాలు నత్తనడక నడవడం, సగం వరకు మాత్రమే ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తే తప్ప కట్టుకోవడం కష్టమని లబ్ధిదారులు చెబుతున్నారు. దీనికితోడు ప్రస్తుతం ఉన్న జగనన్న లేఔట్లు బాగు చేయడానికి మరోసారి నిధులను కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులు విన్నవించుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోడ్ ఉన్నా.. అంబటికి లేనట్లే!
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. -
ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం : కలెక్టర్
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. -
‘వైకాపాకు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే’
[ 28-03-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు. -
‘వైకాపా నుంచి విముక్తికి ఎదురుచూస్తున్న ప్రజలు’
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
[ 28-03-2024]
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు -
పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే
[ 28-03-2024]
దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది -
నిధులు దోచేయ్
[ 28-03-2024]
అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆగని వాలంటీర్ల ప్రచారం
[ 28-03-2024]
పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. -
మరో 52 మంది వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఈనెల 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు -
ఆర్టీసీ నగరబాట హామీ.. నగుబాటేనోయి!
[ 28-03-2024]
గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది -
నేతలకు లబ్డబ్బు
[ 28-03-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. -
లక్ష్మీకటాక్షం ఉంటేనే దస్త్రం కదిలేది
[ 28-03-2024]
జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!