ఇళ్లు నిర్మించుకుని... వెర్రివాళ్లమయ్యాం
జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకుని వెర్రివాళ్లమయ్యామని, సౌకర్యాలు ఎప్పుడు కల్పిస్తారని జిల్లా పంచాయతీ అధికారి కేశవరెడ్డిని ఓ మహిళ ప్రశ్నించింది.
డీపీవోను ప్రశ్నించిన ఓ మహిళ
డీపీవో కేశవరెడ్డిని ప్రశ్నిస్తున్న ఓ మహిళా లబ్ధిదారు
తుమ్మలపాలెం(ప్రత్తిపాడు), న్యూస్టుడే: జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకుని వెర్రివాళ్లమయ్యామని, సౌకర్యాలు ఎప్పుడు కల్పిస్తారని జిల్లా పంచాయతీ అధికారి కేశవరెడ్డిని ఓ మహిళ ప్రశ్నించింది. గృహ నిర్మాణ లబ్ధిదారులతో శనివారం డీపీవో సమావేశం నిర్వహించారు. జగనన్న కాలనీలో 18 మంది ఉంటున్నామని, వీధి దీపాలు లేవని, పైపులైను దెబ్బతిని తాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటూ వాపోయింది. సదుపాయాలు లేకుండా నిర్మించుకుని వెర్రివాళ్లమయ్యామని ఆవేదన వ్యక్తం చేసింది. వీధి లైటు వేయాలని అడిగితే రూ.100లతో బల్బు ఏర్పాటు చేసుకోలేవా..అంటూ పంచాయతీ రాజ్ ఏఈ హేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.