logo

యువజనోత్సవాల వేదికపై వైకాపా ఎమ్మెల్యే కుమార్తె

ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ ఉల్లంఘన జరుగుతోందంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్నోసార్లు మొత్తుకున్నా పట్టించుకోని ప్రభుత్వ అధికారులు అధికార వైకాపా ఎమ్మెల్యే కుమార్తెను మాత్రం ప్రత్యేకంగా చూస్తున్నారు.

Published : 27 Nov 2022 05:56 IST

మాట్లాడుతున్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కుమార్తె నూరి ఫాతిమా, చిత్రంలో జేసీ రాజకుమారి, ఎమ్మెల్యే ముస్తఫా, కలెక్టరు వేణుగోపాల్‌రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే గిరిధర్‌, ఎమ్మెల్సీ లక్ష్మణరావు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ ఉల్లంఘన జరుగుతోందంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్నోసార్లు మొత్తుకున్నా పట్టించుకోని ప్రభుత్వ అధికారులు అధికార వైకాపా ఎమ్మెల్యే కుమార్తెను మాత్రం ప్రత్యేకంగా చూస్తున్నారు. గుంటూరులో శనివారం నిర్వహించిన జిల్లా యువజనోత్సవాల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్‌ ముస్తఫాతో పాటు ఆయన కుమార్తె నూరి ఫాతిమాను వేదిక పైకి ఆహ్వానించారు. ఆమె ముందు వరుస సీట్లలో కూర్చున్నారు. ప్రజాప్రతినిధులు, నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న వారు మాట్లాడిన తర్వాత ఫాతిమాను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధరరావు తన సోదరిగా సంబోధించి మాట్లాడాలని ఆహ్వానించడం గమనార్హం. ఆమె మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకెళ్లాలని సూచించారు. సంక్షిప్తంగా మాట్లాడి ప్రసంగాన్ని ముగించారు. జిల్లా కలెక్టరు ఎం.వేణుగోపాల్‌రెడ్డి, సంయుక్త కలెక్టరు జి.రాజకుమారి సభా వేదికపై ఉన్నప్పటికీ ఎమ్మెల్యే కుమార్తెను ప్రత్యేకంగా చూడటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని