పత్తి ప్రయోగాత్మక సాగుతో ఫలితం
పత్తి పరిశ్రమకు చెందిన జిన్నింగ్, ప్రెస్సింగ్, స్పిన్నింగ్, గార్మెంట్ మిల్లుల వ్యాపారులు పొలంబాట పట్టారు. పత్తి పంటను లాభదాయకంగా పండించడంపై గుంటూరు, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 120 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగుచేయించారు.
ఈనాడు-అమరావతి: పత్తి పరిశ్రమకు చెందిన జిన్నింగ్, ప్రెస్సింగ్, స్పిన్నింగ్, గార్మెంట్ మిల్లుల వ్యాపారులు పొలంబాట పట్టారు. పత్తి పంటను లాభదాయకంగా పండించడంపై గుంటూరు, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 120 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగుచేయించారు. రైతులకు విత్తనం నుంచి తీత వరకు అవసరమయ్యే ఉత్పాదకాలను ఉచితంగా అందించారు. నెలలో రెండుసార్లు ప్రయోగ క్షేత్రాలను పరిశీలించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, నిపుణులైన రైతులతో కలిసి సాగులో సమస్యలపై చర్చించి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకున్నారు. పంటకు సోకే చీడపీడలు నివారణకు మేలైన పద్ధతులు పాటించేలా చైతన్యం కల్పించారు. ప్రయోగ క్షేత్రాల్లో సాగుచేసిన పంటలో మంచి ఫలితాలు వచ్చాయి. ఎకరాకు 8-9క్వింటాళ్ల వరకు దిగుబడులు తీయగా మరో 4 నుంచి 5 క్వింటాళ్ల దాకా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈవిధంగా రైతులు, పరిశ్రమ నిర్వాహకులు కలిసి పనిచేస్తే ఉభయతారకంగా ఉంటుందని నిరూపించారు.
ఫలించిన ప్రయోగం.. ఆంధ్రప్రదేశ్ కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు జిల్లాల్లో ప్రయోగ క్షేత్రాలను సాగుచేస్తున్నారు. ఇందుకు ఆసోసియేషన్ కొంత మొత్తాన్ని వెచ్చిస్తోంది. రైతులు కోరిన విత్తనాలను ఎకరాకు 3-4 సంచులు సమకూర్చారు. విత్తనశుద్ధి చేసి నాటడంతో మొలకశాతం, మొక్క ఎదుగుదల ఆరోగ్యంగా ఉంది. 45రోజుల వరకు రసం పీల్చే పురుగుల నివారణకు మందులను పిచికారీ చేయాల్సిన అవసరం రాలేదు. కలుపును రసాయనాలతో సకాలంలో నిర్మూలించారు. భూమిలో సూక్ష్మపోషకాల లోపాలను గుర్తించి అవసరమైన మేరకు వాటిని వాడుతూ పురుగులు, తెగుళ్లు నివారణకు రసాయనాలు చల్లారు. విత్తనశుద్ధి, అధికసాంద్రతలో మొక్కలు నాటడం, పెరుగుదల నిరోధక మందుల వినియోగం, లింగాకర్షకబుట్టలు, ఎర అట్టలు పెట్టడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని రైతులు చెబుతున్నారు. గులాబీరంగు పురుగు నివారణకు జెల్ను వాడటం వల్ల ఉద్ధృతి తగ్గిందని రైతులు వివరించారు. పురుగులు, తెగుళ్ల నిర్మూలనకు సమర్థమైన రసాయనాలను పిచికారీ చేయడం కర్షకులకు కలిసొచ్చింది.
సంప్రదాయ సాగుతో నష్టం .. ఉమ్మడి జిల్లాలో ఎకరాకు సగటున 5-6 క్వింటాళ్లు మాత్రమే రాగా గరిష్ఠంగా 7-8క్వింటాళ్లు వచ్చింది. ఎకరాకు రూ.70వేల పెట్టుబడి పెట్టారు. 8క్వింటాళ్లు సాధించిన రైతులకు పెట్టుబడులు దక్కగా మిగిలినవారికి నష్టాలు వచ్చాయి. సింహభాగం రైతులు పత్తి సాగుతో నష్టాలు చవిచూడగా కాటన్ అసోసియేషన్ ప్రయోగ క్షేత్రాల్లో సాగుచేసినవారు మాత్రం లాభపడ్డారు.
మేలైన పద్ధతులతో లాభదాయకం
-రామాంజనేయులు, ఉపసంచాలకులు, వ్యవసాయశాఖ
కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో నాలుగుచోట్ల రైతులతో ప్రయోగాత్మకంగా పత్తి సాగుచేయించాం. ఎకరాకు రూ.20వేల వంతున కాటన్ ఆసోసియేషన్ సహకారం అందించింది. శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు కలిసి పంటను పరిశీలిస్తూ తగు మెళకువలు పాటించేలా చూశాం. దీంతో ఎకరాకు సగటున 15క్వింటాళ్ల దిగుబడులు వస్తున్నాయి. పెట్టుబడి పోగా రైతుకు ఎకరాకు రూ.50వేల వరకు మిగులు ఉంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుంటూరు జిల్లాలో ప్రబలిన డయేరియా.. 100 మందికి పైగా అస్వస్థత
[ 19-04-2024]
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో గ్రామంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. -
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు