ప్రాణహాని అయినా.. కాసులే పరమావధి
కాలం చెల్లిన ప్యాకెట్లలోని కుర్కురేలు తిని శనివారం సత్తెనపల్లి పట్టణంలో నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.
కాలం చెల్లిన తినుబండారాల విక్రయాలు
అసలును పోలిన నకిలీలూ బాహాటంగా అమ్మకం
నిఘా కొరవడటంతో దెబ్బతింటున్న పిల్లల ఆరోగ్యం
సత్తెనపల్లి, న్యూస్టుడే
తినుబండారాల ప్యాకెట్లు పరిశీలిస్తున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ సుందరరామిరెడ్డి
* కాలం చెల్లిన ప్యాకెట్లలోని కుర్కురేలు తిని శనివారం సత్తెనపల్లి పట్టణంలో నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఆదివారం పిల్లలకు కాలం చెల్లిన ప్యాకెట్లు అమ్మిన దుకాణంలో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించగా, మరో పది ప్యాకెట్లు కాలం చెల్లినవి లభించాయి. పిల్లల అనారోగ్య సమస్యను తల్లిదండ్రులు గుర్తించి చైతన్యంతో వ్యవహరించడంతో ఇక్కడ ఆహార కలుషితం బయటపడింది. వెలుగుచూడని ఈ తరహా సంఘటనలు జిల్లాలో ఎన్నో ఉంటున్నాయి.
* ప్రముఖ కంపెనీకి చెందిన తినుబండారాల ప్యాకెటు రూ.5కు విక్రయిస్తుండగా, ఆ కంపెనీ కేవలం 90 పైసలు మార్జిన్ ఇస్తోంది. అదే కంపెనీ పేరును అటూఇటూ కొద్దిగా మార్చి తయారు చేసిన ప్యాకెట్కు రూ.2 నుంచి రూ.2.50 వరకు మార్జిన్ ఇస్తున్నారు. అసలును పోలిన ప్యాకెట్లను చిల్లర దుకాణాల్లో విక్రయించేందుకు వ్యాపారులు ఎక్కువగా ఇష్టత చూపిస్తున్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, చిలకలూరిపేట వంటి పట్టణాల్లో ఏమాత్రం నాణ్యత లేని నకిలీలు భారీఎత్తున తయారవుతున్నాయి.
ప్రజల్లో నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని కొందరు కాసులుగా మలుచుకుంటున్నారు. కాలం చెల్లిన వాటిని బయటపడేయాల్సి ఉండగా, కొందరు బాహాటంగా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాలం చెల్లినవే గాకుండా నకిలీలు తయారు చేసి ఇబ్బడిముబ్బడిగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు వస్తున్నాయి. నీకింత, నాకింత అన్నట్లు ఈ తినుబండారాలను పిల్లలకు అంటగడుతున్నారు. కలుషితమైన వీటిని తిన్న పిల్లలు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం.. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్నారు.
చూడగానే ఆకట్టుకునేలా రంగురంగుల బొమ్మలతో ఉండే తినుబండారాల ప్యాకెట్లను పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు. హైదరాబాద్ నుంచే సింహభాగం ప్యాకెట్లు జిల్లాకు వస్తున్నాయి. కాకుంటే వాటిలోనే కొన్ని నకిలీ, కల్తీ ప్యాకెట్లు కలుస్తున్నాయి. ఉదాహరణకు చట్పట్, రింగ్స్, తేడామేడో కుర్కురే ప్యాకెట్లపై ఉండే ఆంగ్ల అక్షరాల్లో ఒకటి, రెండు అక్షరాలు అటూఇటూమార్చి నకిలీవి అమ్ముతున్నారు. నిశితంగా పరిశీలిస్తే కానీ అవి కనిపించట్లేదు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కాలం చెల్లిన ప్యాకెట్లు జోరుగా విక్రయిస్తున్నారు. జిల్లాలోని హోల్సేల్ వ్యాపారులు వందల్లో ఉంటే.. రిటైల్గా వాటిని విక్రయించేవారు వేలల్లో ఉన్నారు. ఐదు వేల జనాభా ఉన్న ముప్పాళ్ల మండలంలోని ఓ గ్రామంలో ఈ ప్యాకెట్లు అమ్మే వ్యాపారులు 30 మంది ఉండటం పరిశీలనాంశం. పిల్లలను ఆసరాగా చేసుకొని పాఠశాల పరిసరాల్లోనూ, ప్రధాన కూడళ్లలో ఈ వ్యాపారం రూ.కోట్లలో జరుగుతుంది. ఆంగ్ల అక్షరాల్లోని పేర్లను అటూఇటూ మార్చి డిమాండ్ ఉన్న వాటితో సమానంగానే కల్తీవి అమ్ముతున్నారు. మరోవైపు పాఠశాలలకు 200 మీటర్లలోపు ఈ తరహా ప్యాకెట్లు అమ్మేందుకు నిషేధం అమల్లో ఉన్నప్పటికీ జిల్లాలో ఎక్కడా అది అమలవ్వట్లేదు.
చోద్యం చూస్తున్న అధికారగణం
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సుమారు 2 వేలు ఉండగా వాటిలో 2.10 లక్షల మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. సగం మంది పిల్లలకు ఈ తరహా తినుబండరాలతో అనారోగ్య సమస్య ఎదురవుతుంది. అసలును పోలిన నకిలీ.. కాలం చెల్లిన ఆహారం అందుబాటులో ఉండటమే అసలు సమస్యగా ఉంది. ఒక్కో చిన్నారి కుర్కురే వంటి చిరుతిండిపై రోజుకు రూ.10 నుంచి రూ.20 వరకు వెచ్చిస్తున్నారు. వీటి విక్రయాలు నిరోధించకున్నా, కాలం చెల్లినవి, నకిలీలు రాకుండా అధికారులు అడ్డుకట్ట వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలో అసలును పోలిన నకిలీ, కల్తీ తయారీ, విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఉమ్మడి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గౌస్ ‘న్యూస్టుడే’తో చెప్పారు. సత్తెనపల్లి ఘటన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించే దుకాణాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు.
రోగ నిరోధక శక్తిపై ప్రభావం
దైనా ఆహారం తీసుకుంటే బలాన్ని ఇవ్వాలి. కానీ ఇవి తినడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఆహార నిల్వకు ఉపకరించే రసాయనాలతో ఈ జంక్ఫుడ్ను తయారు చేస్తారు. అవి పిల్లలు తినేందుకు రుచికరంగా అనిపించిన క్రమంగా వారి ఆరోగ్యాన్ని ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తాయి. పిల్లల్లో ఆకలి మందగించడం.. సక్రమంగా ఆహారం తినకపోవడం.. కడుపు ఉబ్బరమని పిల్లలు తరచూ చెప్పడం వంటివి వీటి లక్షణాలుగా తల్లిదండ్రులు గుర్తించాలి.
డాక్టర్ బీవీ రంగారావు, ఏపీవీపీ డీసీ, పల్నాడు జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్