కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరించరే!
ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా అధికారులు స్పందన అర్జీలు పరిష్కరించాలి. ఒకే సమస్యపై అర్జీదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు.
తీరని అర్జీదారుల అవస్థలు
బాపట్ల, న్యూస్టుడే
ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా అధికారులు స్పందన అర్జీలు పరిష్కరించాలి. ఒకే సమస్యపై అర్జీదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు.
విజయకృష్ణన్, కలెక్టర్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెబుతున్న ‘స్పందన’లో ఎన్నిమార్లు అర్జీలు ఇచ్చినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు వాపోతున్నారు. అన్ని అర్హతలూ ఉండి పింఛను కోసం దివ్యాంగుడు ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, పేదలు, వృద్ధులు భూ సంబంధ సమస్యలపై రెవెన్యూ అధికారులను పలుమార్లు కలిసి అర్జీలు అందిస్తున్నా అధికారుల్లో కనికరం కరవైంది. ‘స్పందన’పై పలుమార్లు ముఖ్యమంత్రి సహా ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించి ఒకే సమస్యపై ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దని ఆదేశాలిస్తున్నా అవి అమలు కావడం లేదు. తమ అర్జీల పరిష్కారం కోసం ఏళ్ల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న వారి కన్నీటి గాథ వారి మాటల్లోనే..
ఆన్లైన్లో నమోదుకు అష్టకష్టాలు
అంధుడైన కుమారుడు శ్రీనివాసరావు, మనవరాళ్లతో సూరగాని లక్ష్మయ్య
కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలేనికి చెందిన సూరగాని లక్ష్మయ్య 30 ఏళ్ల క్రితం గ్రామంలో ముగ్గురు రైతుల నుంచి రెండెకరాల సాగు భూమి కొనుగోలు చేశారు. అప్పట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. మూడు దశాబ్దాలుగా ఈ భూమిలో అతడే పంటలు సాగు చేస్తున్నారు. కుమారుడు శ్రీనివాసరావు అంధుడు. ముగ్గురు కుమార్తెలు పుట్టిన తర్వాత శ్రీనివాసరావును భార్య వదిలి వెళ్లిపోయింది. అంధుడైన శ్రీనివాసరావు ముగ్గురు కుమార్తెలను పెంచుతున్నారు. దీంతో కుమారుడి పేరు మీద రెండెకరాల వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేయటానికి స్థానిక రెవెన్యూ అధికారులకు లక్ష్మయ్య దరఖాస్తు చేశారు. దాన్ని అధికారులు దరఖాస్తు తిరస్కరించారు. ఆన్లైన్లో భూమి వివరాల నమోదు కోసం తహసీల్దారు కార్యాలయం చుట్టూ ఏడాదిగా తిరుగుతున్నారు. స్పందనలో పలుమార్లు అర్జీలు పెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. అంధుడైన కుమారుడిని తీసుకుని సమస్య పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు.
96ఏళ్ల వయసులోనూ..
మస్తానమ్మ, శేషమ్మ
పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలం సుబ్బారెడ్డిపాలేనికి చెందిన 96ఏళ్ల శేషమ్మ తన 2.26 ఎకరాల భూమికి పట్టాదారు పాసుపుస్తకం కోసం కుమార్తె మస్తానమ్మతో కలిసి 8 నెలలుగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆమె భూమిని మనవడు అక్రమంగా అతడి పేరిట ఆన్లైన్లో నమోదు చేయించుకోగా న్యాయపోరాటం చేసి గత ఏడాది డిసెంబరులో పర్చూరు కోర్టులో విజయం సాధించారు. కోర్టు ఆదేశాలు చూపి ఆమె పేరు మీద భూమిని ఆన్లైన్లో నమోదు చేసి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని ఇంకొల్లు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేశారు. వారు స్పందించకపోవటంతో 45 రోజుల క్రితం కలెక్టరేట్లో జేసీ శ్రీనివాసులును కలిసి సమస్య వివరించారు. అయినా నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో న్యాయం చేయమంటూ రెండు వారాల క్రితం మరోసారి కలెక్టరేట్కు వచ్చారు. వృద్ధాప్యం కారణంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా తన భూమికి పాసుపుస్తకం ఇవ్వాలని కోరుతున్నారు.
పింఛను పునరుద్ధరించాలని..
మేకల మోషే, దివ్యాంగుడు
బాపట్ల పట్టణం చెంగల్రాయ తోటలో నివసించే దివ్యాంగుడు మోషే మూడు చక్రాల సైకిల్కే పరిమితం. భార్య కూలీ పనులకు వెళ్లి సంపాదించే సొమ్ముతో కుటుంబాన్ని పోషిస్తోంది. చేతివేళ్ల రేఖలు అరిగిపోవడంతో 13 ఏళ్లుగా ఈయనకు పింఛను నిలిచిపోయింది. పింఛను పునరుద్ధరించాలంటూ ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగి ఇక గత్యంతరం లేక రెండు వారాల క్రితం కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో అధికారులను కలిసి సమస్య వివరించి వినతిపత్రం అందించారు. పింఛను పునరుద్ధరణ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు
రోజ్మేరి, మాజీ సర్పంచి, మూల్పూరు
అమృతలూరు మండలం మూల్పూరు గ్రామ సర్పంచిగా 2013-18 మధ్య రోజ్మేరీ పనిచేశారు. ఐదేళ్ల తన పాలనా కాలంలో రూ.మూడు కోట్లతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల తాలూకూ రూ.25లక్షలు, 14 వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి రూ.4.50 లక్షల బిల్లు ఈమెకు ఇంకా అందాల్సి ఉంది. బిల్లుల చెల్లింపునకు పంచాయతీరాజ్ ఈఈ ఆదేశాలు జారీ చేసినా గ్రామంలో అధికార పార్టీ నేతలు స్థానికంగా ఇబ్బంది పెడుతూ బిల్లుల తాలూకూ బకాయి సొమ్ము చెల్లించడం లేదని వాపోయారు. గతంలో ఓ సారి కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో కలెక్టర్, జేసీకి ఈమె ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. బిల్లులు చెల్లించకుండా ఎస్సీ వర్గానికి చెందిన తనను వేధించటం తగదని మాజీ సర్పంచి వాపోయారు. రెండువారాల క్రితం ‘స్పందన’లో కలెక్టర్, జేసీకి వినతిపత్రం ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.