శుభకార్యానికి వెళ్లి వస్తుండగా కబళించిన మృత్యువు
కుమార్తె ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై మోపెడ్ వాహనంపై స్వగ్రామానికి వస్తుండగా వేగంగా వచ్చిన కోళ్ల లోడు లారీ ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
కోళ్ల లారీ ఢీకొని ఇద్దరు దుర్మరణం
ప్రమాదానికి కారణమైన కోళ్ల లారీ
గుంటూరు రూరల్, న్యూస్టుడే: కుమార్తె ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై మోపెడ్ వాహనంపై స్వగ్రామానికి వస్తుండగా వేగంగా వచ్చిన కోళ్ల లోడు లారీ ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. నల్లపాడు పోలీసుల కథనం ప్రకారం... ఫిరంగిపురం మండలం అమీనాబాద్కు చెందిన మేడా ఏసు (50), అదే గ్రామానికి చెందిన ఆయన మరదలు వెంకాయమ్మ(45) బుడంపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మేడా ఏసు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఏసు నిమ్మకాయల వ్యాపారం చేస్తుంటాడు. శనివారం ఏసు, ఆయన మరదలు వెంకాయమ్మలు టీవీఎస్ వాహనంపై బాపట్ల సమీపంలోని చల్లపాడు వెళ్లారు. అక్కడ జరిగిన శుభకార్యానికి హాజరై ఆదివారం ఉదయం అమీనాబాద్కు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న టీవీఎస్ బుడంపాడు సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాల వద్దకు వచ్చిన సమయంలో కోళ్ల లోడుతో తెనాలి వైపు వెళుతున్న మినీ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఏసు, వెంకాయమ్మలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. టీవీఎస్ మోపెడ్ మంటల్లో కాలిపోయింది. ప్రమాదానికి కారణమైన కోళ్ల లోడు లారీ డ్రైవర్ వాహనం అక్కడ వదిలేసి పరారయ్యాడు. నల్లపాడు పోలీసులకు సమాచారం అందటంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను జీజీహెచ్కి తరలించారు. మృతుల బంధువులకు సమాచారం అందించటంతో వారు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను చూసి బోరున విలపించారు. ఏసు కుమార్తె తోకల కోటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై ఏడు కొండలు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్ చేశామన్నారు.
కాలిపోయిన మోపెడ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీరివ్వలేని నీరో!
[ 18-04-2024]
సీఎం జగన్... పేదల పక్షపాతినంటారు.. ఎన్నికల్లో వారే తన స్టార్ క్యాంపెయినర్లంటారు.. వారి జీవితాలను బాగు చేసేది తనొక్కడేనంటూ గొప్పలకు పోతుంటారు.. కానీ.. తన నివాసానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్లోని నిరుపేద రోగుల గొంతు తడపలేకపోతున్నారు. -
నారీ గళంతో జగన్ వెన్నులో వణుకు
[ 18-04-2024]
నారీ గళంతో జగన్ వెన్నులో వణుకు పుట్టాలని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవి, తెలుగు మహిళ నాయకురాలు మాగంటి రూప, తెలంగాణ తెదేపా నాయకులు నన్నూరి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. -
కీలక ఘట్టానికి వేళాయె
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నేటి నుంచి ఆరంభం కాబోతోంది. గురువారం నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. గత తెదేపా ప్రభుత్వంలో రాత్రీ పగలు తేడా లేకుండా వేల మంది కార్మికులతో కళకళలాడిన అమరావతి వైకాపా పాలనలో విధ్వంసానికి చిరునామాగా మారింది. -
జీతాలకూ ఎదురుచూపులే..
[ 18-04-2024]
జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫిబ్రవరి, మార్చి జీతాలు రాలేదు. ఏప్రిల్ నెల జీతంతో కలిపి రెండు నెలల బకాయిలు విడులవుతాయన్న నమ్మకం లేదు. -
గుంటూరువాసికి క్రికెట్ సైట్ స్క్రీన్పై పేటెంట్
[ 18-04-2024]
జోసెల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, జేకేసీ కళాశాల కార్యదర్శి, గుంటూరు జిల్లా మెన్, ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు, ఏసీఏ ఉమెన్స్ అకాడమీ పూర్వ ఛైర్మన్ జాగర్లమూడి మురళీమోహన్ నూతన ఆవిష్కరణకు పేటెంట్ లభించింది. -
శిరోముండనం కేసులో శిక్ష విధించడం హర్షణీయం
[ 18-04-2024]
శిరోముండనం కేసుల్లో నిందితులకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించడం హర్షణీయమని భీమ్ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు పాగళ్ల ప్రకాష్ అన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. -
సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహిద్దాం
[ 18-04-2024]
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు హింస, రీపోలింగ్ లేకుండా విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివశంకర్ కోరారు. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదయ్యా!
[ 18-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్కు గతంలో ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. బీపీ, మధుమేహం సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులకు సరిపడా ఒకేసారి ఔషధాలు తెచ్చుకునేవారు. -
అయిదేళ్లుగా చోద్యం చూశారు!
[ 18-04-2024]
ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన ఇది. శిథిలావస్థకు చేరి అడుగు భాగం దిమ్మెలు పగుళ్లిచ్చాయి. ఇనుప రాడ్ల ఆధారంగా నిలబడింది. భారీ వాహనాలు ప్రయాణిస్తే దిమ్మెలు కదులుతున్నాయి. -
పోలీసు.. వైకాపాకు వత్తాసు
[ 18-04-2024]
సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే తనిఖీ కేంద్రాలు(చెక్పోస్టులు) వద్ద ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయిస్తారు. కానీ జిల్లాలో పోలీసుస్టేషన్లలో ఉండాల్సిన సీఐ, ఎస్సైలకు చెక్పోస్టు డ్యూటీలకు పంపడం చర్చనీయాంశమవుతుంది.