పొలాల్లో ఆగని చోరీలు
అన్నదాతలకు సాగునీటిని అందించే వ్యవసాయ మోటర్లు, సోలార్ పరికరాల చోరీలు అంతకంతకూ పెరగడం ఆందోళన కలిగిస్తుంది.
అంతకంతకూ పెరుగుతున్న ఘటనలపై రైతుల ఆందోళన
మార్టూరు, యద్దనపూడి, న్యూస్టుడే
అన్నదాతలకు సాగునీటిని అందించే వ్యవసాయ మోటర్లు, సోలార్ పరికరాల చోరీలు అంతకంతకూ పెరగడం ఆందోళన కలిగిస్తుంది. రబీ వ్యవసాయ పనులు జోరందుకుంటున్న తరుణంలో సాగుకు వినియోగించే పరికరాలు దొంగలపాలవడంతో పైర్లు దెబ్బతిని పంటలు నాశనమవుతాయని రైతులు దిగాలు చెందుతున్నారు. మార్టూరు, అద్దంకి, బల్లికురవ మండలంలోని వివిధ గ్రామాల్లో విద్యుత్తు మోటర్లు, సోలార్ పలకలు రాత్రికి రాత్రి కొల్లగొడుతున్నారు. రూ.లక్షలతో ఏర్పాటు చేసుకున్న విలువైన వ్యవసాయ పరికరాలు, సామగ్రిని దొంగలు ధ్వంసం చేసి తీసుకెళ్లడంతో కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
ఒక్కరోజే 30 యూనిట్లు..
ఇసుకదర్శి వద్ద నాలుగు నెలలక్రితం ఒక్కరోజే అర్ధరాత్రి ప్రాంతంలో సుమారు 30 సోలార్ యూనిట్లలో చోరీ జరిగింది. శ్రీరంగ క్షేత్రం నుంచి నాగరాజుపల్లి వెళ్లే మార్గం వెంట ఉన్న పొలాల్లోని సోలార్ పలకల కింద ఉన్న ఖరీదైన తీగలను దొంగలు తీసుకెళ్లారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగరాజుపల్లిలో సోలార్ పలకలను ధ్వంసం చేసిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. మార్టూరులోని రైతులకు చెందిన వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసుకున్న సోలార్ పరికరాల తీగలను దొంగిలించి పొలాల్లోనే కాఫర్ తీగ వలుచుకుని తీసుకెళ్లారు. మార్టూరు ప్రాంతంలో రైతుల పొలాల్లో చోరీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్సై రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. రాత్రివేళ పోలీసులు, రైతుల సమన్వయంతో పహరా ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు.
ఏడాదిలో రెండోసారి..
మార్టురు మండలంలోని జొన్నతాళిలో ఆదివారం సోలార్ పలకల నుంచి విద్యుత్తు సరఫరా జరిగే విలువైన తీగ, బోరు మోటరుకు చెందిన సర్వీసు తీగను దొంగలు కత్తిరించుకెళ్లారు. గ్రామానికి చెందిన మురకొండ అప్పారావు అనే రైతుకు చెందిన జనుము పంట మధ్యలో ఉన్న ఈ పథకం వద్ద ఏడాదిలో రెండోమారు వ్యవసాయ పరికరాలకు చెందిన కరెంటు తీగను చోరీ చేయడం గమనార్హం. రాజుగారిపాలెంలో వాగు వెంట ఉన్న పాలాల్లో రైతులు సొంత నిధులతో విద్యుత్తు మోటర్లను ఏర్పాటు చేసుకుని పంటల సాగుకు ఉపక్రమిస్తున్నారు. నాలుగు నెలల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు రూ.వేలు విలువ చేసే మోటర్లను దోచుకెళ్లారు. సమీపంలోని విద్యుత్తు పరివర్తకాన్ని పగులగొట్టి అందులో ఉన్న కాఫర్ తీగను దోచుకెళ్లారు.
రెండు కంచెలు ఉన్నా వదల్లేదు
కోలలపూడిలోని నా మామిడి తోట చుట్టూరా ఫెన్సింగ్ ఉంది. లోపలి భాగంలో ఉన్న సాలార్ చుట్టూరా మరో కంచె ఏర్పాటు చేసుకున్నాను. అయినా దొంగలు నా సోలార్ పరికరాలను వదలలేదు. నాతోపాటు పక్కనున్న పొలాల్లోని సోలార్ పథకం వద్ద ఉన్న ప్యానల్ బోర్డులోని సామగ్రి దోచుకెళ్లారు. ఒక్కోటి రూ.30 వేల విలువైన పరికరాలను దొంగలు దోచుకెళ్లారు.
సాదినేని కోటేశ్వరరావు, మామిడి తోట యజమాని, కోలలపూడి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య