గదుల్లేవ్.. గురువులూ లేరు
‘ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. సర్కారీ బడుల్లో చదివే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తే వీరు ప్రపంచంతో పోటీ పడతారు.
ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా విద్యార్థులను పీడిస్తున్న సమస్యలు
ఈనాడు-అమరావతి
‘ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. సర్కారీ బడుల్లో చదివే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తే వీరు ప్రపంచంతో పోటీ పడతారు. లేదంటే ఉద్యోగాలు దక్కించుకోవటంలో వెనకబడిపోతారు’ అని అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేల దాకా సభల్లో వల్లెవేస్తారు.
సత్తెనపల్లిలో ఓ పాఠశాలలో ఇదీ పరిస్థితి..
క్షేత్రస్థాయిలో పాఠశాలల్లో బోధనకు సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారా? లేరా? అనేది పట్టించుకోవటం లేదు. టీచర్లు, గదులు కొరతే కాదు నిన్న, మొన్నటి దాకా పుస్తకాల కొరత సమస్యలతోనూ విద్యార్థులు, ఉపాధ్యాయులు సతమతమయ్యారు. నాడు-నేడులో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. అందుకు తగ్గట్లు ఉపాధ్యాయులను నియమించలేదు. టీచర్ల కొరతతో ఒకే టీచర్ తాను బోధించే సబ్జెక్టుతో పాటు అదనంగా మరో సబ్జెక్టును బోధిస్తున్న పరిస్థితి ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా ఉంది. ఇలా ఉపాధ్యాయులపై పనిభారం పెరగటంతో మొక్కుబడి బోధన చేస్తున్నారు.. సబ్జెక్టు టీచర్ల ఖాళీల్లో కనీసం వాలంటీర్లను నియమించినా తమకు కొంత వెసులుబాటు కలుగుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఆదివారం పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగుల జడ్పీ హెచ్ఎస్ విద్యార్థులు బోధనకు సరిపడా టీచర్లు లేరని రోడ్డెక్కారు. గణితం, సైన్సు, సోషల్ బోధించే ఉపాధ్యాయులు లేరు. గతేడాది ఎక్కువమంది హిందీ, సోషల్, గణితంలో తప్పారు. ప్రధానంగా టెన్త్ విద్యార్థులకు టీచర్లు లేకపోతే నష్టపోతారు. వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. మరికొద్ది రోజుల్లో సిలబస్ పూర్తి చేసి తిరిగి పునశ్చరణ ప్రారంభించాలి. ఆ సమయానికి అయినా డిప్యూటేషన్పై సర్దుబాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
పల్నాడు నుంచి డిప్యూటేషన్లు..
పల్నాడు ప్రాంతం నుంచి కొందరు టీచర్లు డిప్యూటేషన్, సర్దుబాటు పేరుతో ప్రభుత్వ స్థాయిలోనే పైరవీలు చేసుకుని గుంటూరు చుట్టుపక్కలకు వచ్చేశారు. దీంతో పల్నాడు పాఠశాలల్లో బాగా కొరత ఉంది. గుంటూరు జిల్లాలో మంగళగిరి, గుంటూరు నగరపాలక ఉన్నత పాఠశాలల్లో టీచర్ల కొరత వేధిస్తోంది. హైస్కూళ్లు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎస్ఏలు, ఎస్జీటీ, పీఈటీ, పీడీలు ఇలా అన్ని క్యాడర్లలో కొరత ఉంది. కొందరు ఉద్యోగ విరమణ చేయగా మరికొందరు దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లటం, విలీనం, గత మూడేళ్లుగా డీఎస్సీ నియామకాలు చేపట్టకపోవటం వంటివి టీచర్ల కొరతకు కారణాలుగా ఉపాధ్యాయ సంఘాలు నాయకులు తెలిపారు.
మచ్చుకు కొన్ని పాఠశాలల్లో కొరత ఇలా..
* గుంటూరు కొల్లిశారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో ఆంగ్లం బోధించేవారు లేరు. స్వర్ణాంద్రనగర్ అప్గ్రేడెడ్ స్కూల్, అశోక్నగర్ యూపీ పాఠశాలలోనూ టీచర్ల సమస్య నెలకొంది.
* మంగళగిరి మున్సిపల్ వీవర్స్ కాలనీ పాఠశాలలో పెద్ద సంఖ్యలో పిల్లలు ఉన్నారు. కానీ వారికి తగ్గ నిష్పత్తిలో ఉపాధ్యాయులు లేరు. అదనంగా టీచర్లను సమకూర్చాలని లేఖలు పెట్టారు. స్థానికంగానే ఉన్న బ్రహ్మానందరెడ్డి తదితర స్కూళ్లల్లోనూ ఈ సమస్య ఉంది.
* వట్టిచెరుకూరు మండలం ముట్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో టీచర్ల సమస్య నెలకొంది.
* కొల్లిపర మండలం తూములూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 2020 నుంచి ఒకే ఒక్క టీచర్ బయాలజీ బోధిస్తున్నారు. ఇద్దరికి ఒక్కరే ఉన్నారు.
* అమరావతి మండలం మల్లాది జడ్పీహెచ్ఎస్లో పిల్లలను ఆడించటానికి పీడీ లేరు
* సత్తెనపల్లి మండలం అబ్బూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్రం, బయాలజీ చెప్పేవారు లేరు.
వెన్నాదేవి అప్గ్రేడెడ్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్, బయాలజీ టీచర్లు లేరు.
* మాచవరం మండలం వేమవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్, సోషల్ చెప్పేవారు లేరు
* నూజెండ్ల మండలం పీఎన్పల్లి ఉన్నత పాఠశాలలో హిందీ, ఫిజిక్స్, బయాలజీ మూడు సబ్జెక్టులు బోధించేవారు లేరు
* దుర్గి మండలం ఓబులేశునిపల్లె ఎస్కేఎస్ జడ్పీహెచ్ఎస్లో 2017 నుంచి హిందీ ఉపాధ్యాయుడి పోస్టు ఖాళీగా ఉంటోంది.
* మాచర్ల మండలం కొప్పునూరు జడ్పీహెచ్ఎస్లో సాంఘికశాస్త్రం బోధించేవారు లేరు.
* గురజాల మండలం తేలుకుట్ల జడ్పీహెచ్ఎస్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వంతెనలు కూలుతున్నా.. ప్రాణాలు పోతున్నా.. కళ్లకు గంతలేనా..
[ 20-04-2024]
బీటలు వారిన పిల్లర్లు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారధులు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కీలకమైన వంతెనల జీవితకాలం ముగిసినా నిధుల కొరతతో కొత్తవి నిర్మించడం లేదు. -
అ‘తీగ’తిలేని ‘మార్గం’
[ 20-04-2024]
ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా తెదేపా ప్రభుత్వం ప్రారంభించినది అయితే పూర్తి చేయం. అవసరమైతే పనికిరాకుండా చేస్తాం ఇది జగన్ సర్కారు ఐదేళ్లుగా అవలంభిస్తున్న తీరు. -
కూలేదాకా.. కళ్లప్పగిస్తారా!
[ 20-04-2024]
బీటలు వారిన స్తంభాలు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారథులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి -
ఉడకని జీడిపప్పు
[ 20-04-2024]
వేటపాలెం అంటేనే జీడిపప్పు పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో వ్యాపారులు ఒకప్పుడు స్థానికంగా దొరికే జీడిపిక్కలను కొనుగోలు చేసి వాటిని కాల్చి పప్పుగా తయారు చేసి విక్రయించేవారు. -
నేరచరిత్ర లేని సచ్ఛీలుడు తెన్నేటి
[ 20-04-2024]
బాపట్ల లోక్సభ స్థానం తెదేపా ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ తనకు రూ.15.93 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో ప్రకటించారు -
మందులో ముంచేసి.. పీల్చి పిప్పి చేసి..
[ 20-04-2024]
రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం విధిస్తాం. మూడు విడతల్లో మద్యం దుకాణాలు తగ్గించుకుంటూ వెళ్లి పూర్తిగా ఎత్తేస్తాం. మందు ముట్టుకోవాలంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచుతాం. మద్యపాన నిషేధం చేశాకే 2024లో ఓట్లు అడగడానికి వస్తాను. -
ఎంపీ 1, ఎమ్మెల్యేకు 19 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజున గుంటూరు పార్లమెంట్ స్థానానికి కిలారి వెంకటరోశయ్య వైకాపా తరఫున నామినేషన్ను దాఖలు చేశారు -
కొనసాగుతున్న ఒత్తిళ్లతో వాలంటీర్ల రాజీనామా
[ 20-04-2024]
ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో 20 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్రరావు తెలిపారు. -
అట్టహాసంగా శ్రావణ్కుమార్ నామినేషన్
[ 20-04-2024]
తాడికొండ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం తాడికొండ ఆర్వో గంగరాజుకు నామినేషన్ పత్రాలు అందజేశారు -
ఎన్నికల వేళా.. ఆగని దోపిడీ
[ 20-04-2024]
అధికారం అండగా ఉందని ఏం చేసినా అడ్డుకునేవారు లేరని వైకాపా నేతలు బరితెగించారు. కృష్ణానదిలో రాత్రివేళ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తూ తరలించి జేబులు నింపుకొంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వారికి అడ్డంకి లేకుండా పోయింది. -
ఏళ్లుగా ఉద్యోగులకు శిక్షే
[ 20-04-2024]
అనేక సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం జగన్ మాటలు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని.. పలు హామీలు ఇచ్చి వాటిని గాలికొదిలేశారు. -
తాగునీరివ్వకపోతే బతికేదెలా..?
[ 20-04-2024]
తమకు తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేయడం లేదని ప్రత్తిపాడులోని మహబూబ్ నగర్ కాలనీ వాసులు శుక్రవారం గుంటూరు- పర్చూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో జేఎల్ఎం మృతి
[ 20-04-2024]
విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్) మృతి చెందిన ఘటన ఇది. విద్యుత్తు శాఖ ఉద్యోగులు, బాధితుల కథనం ప్రకారం... పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అడుసుమల్లి సుబ్రహ్మణ్యం, చిలకమ్మ దంపతుల పెద్దకుమారుడు రాజేశ్ (27) ఇదే గ్రామంలో జేఎల్ఎంగా పనిచేస్తున్నారు. -
కలగా మినీ రైతుబజార్లు
[ 20-04-2024]
నాడు అలా...గత ప్రభుత్వంలో వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు 2018లో పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గంలో రైతుబజార్ను అందుబాటులోకి తెచ్చారు. ఆ రైతుబజార్లో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు. -
ఓటు హక్కు వినియోగానికి కార్మికులకు సెలవు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరగనున్న పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మికులకు సెలవు ప్రకటించినట్లు మూడో జోన్ కార్మిక శాఖ ఇన్ఛార్జి సంయుక్త కమిషనర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు -
మద్యం మత్తు.. కుటుంబాలు చిత్తు
[ 20-04-2024]
గత నెల 18వ తేదీన తెనాలి మున్సిపల్ కార్యాలయం చెంతనే నిర్మాణంలో ఉన్న మార్కెట్ భవంతిలో రవికిరణ్ (37) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారణం మద్యం మత్తు. మద్యం తాగి చెంతనే దోమల కాయిల్ వెలిగించుకుని నిద్రపోయిన అభాగ్యుడు కాయిల్ దుప్పటికి తగిలి మంటలు చెలరేగినా మత్తు వల్ల లేవలేక కాలిపోయాడు
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్