గదుల్లేవ్.. గురువులూ లేరు
‘ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. సర్కారీ బడుల్లో చదివే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తే వీరు ప్రపంచంతో పోటీ పడతారు.
ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా విద్యార్థులను పీడిస్తున్న సమస్యలు
ఈనాడు-అమరావతి
‘ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. సర్కారీ బడుల్లో చదివే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తే వీరు ప్రపంచంతో పోటీ పడతారు. లేదంటే ఉద్యోగాలు దక్కించుకోవటంలో వెనకబడిపోతారు’ అని అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేల దాకా సభల్లో వల్లెవేస్తారు.
సత్తెనపల్లిలో ఓ పాఠశాలలో ఇదీ పరిస్థితి..
క్షేత్రస్థాయిలో పాఠశాలల్లో బోధనకు సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారా? లేరా? అనేది పట్టించుకోవటం లేదు. టీచర్లు, గదులు కొరతే కాదు నిన్న, మొన్నటి దాకా పుస్తకాల కొరత సమస్యలతోనూ విద్యార్థులు, ఉపాధ్యాయులు సతమతమయ్యారు. నాడు-నేడులో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. అందుకు తగ్గట్లు ఉపాధ్యాయులను నియమించలేదు. టీచర్ల కొరతతో ఒకే టీచర్ తాను బోధించే సబ్జెక్టుతో పాటు అదనంగా మరో సబ్జెక్టును బోధిస్తున్న పరిస్థితి ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా ఉంది. ఇలా ఉపాధ్యాయులపై పనిభారం పెరగటంతో మొక్కుబడి బోధన చేస్తున్నారు.. సబ్జెక్టు టీచర్ల ఖాళీల్లో కనీసం వాలంటీర్లను నియమించినా తమకు కొంత వెసులుబాటు కలుగుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఆదివారం పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగుల జడ్పీ హెచ్ఎస్ విద్యార్థులు బోధనకు సరిపడా టీచర్లు లేరని రోడ్డెక్కారు. గణితం, సైన్సు, సోషల్ బోధించే ఉపాధ్యాయులు లేరు. గతేడాది ఎక్కువమంది హిందీ, సోషల్, గణితంలో తప్పారు. ప్రధానంగా టెన్త్ విద్యార్థులకు టీచర్లు లేకపోతే నష్టపోతారు. వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. మరికొద్ది రోజుల్లో సిలబస్ పూర్తి చేసి తిరిగి పునశ్చరణ ప్రారంభించాలి. ఆ సమయానికి అయినా డిప్యూటేషన్పై సర్దుబాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
పల్నాడు నుంచి డిప్యూటేషన్లు..
పల్నాడు ప్రాంతం నుంచి కొందరు టీచర్లు డిప్యూటేషన్, సర్దుబాటు పేరుతో ప్రభుత్వ స్థాయిలోనే పైరవీలు చేసుకుని గుంటూరు చుట్టుపక్కలకు వచ్చేశారు. దీంతో పల్నాడు పాఠశాలల్లో బాగా కొరత ఉంది. గుంటూరు జిల్లాలో మంగళగిరి, గుంటూరు నగరపాలక ఉన్నత పాఠశాలల్లో టీచర్ల కొరత వేధిస్తోంది. హైస్కూళ్లు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎస్ఏలు, ఎస్జీటీ, పీఈటీ, పీడీలు ఇలా అన్ని క్యాడర్లలో కొరత ఉంది. కొందరు ఉద్యోగ విరమణ చేయగా మరికొందరు దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లటం, విలీనం, గత మూడేళ్లుగా డీఎస్సీ నియామకాలు చేపట్టకపోవటం వంటివి టీచర్ల కొరతకు కారణాలుగా ఉపాధ్యాయ సంఘాలు నాయకులు తెలిపారు.
మచ్చుకు కొన్ని పాఠశాలల్లో కొరత ఇలా..
* గుంటూరు కొల్లిశారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో ఆంగ్లం బోధించేవారు లేరు. స్వర్ణాంద్రనగర్ అప్గ్రేడెడ్ స్కూల్, అశోక్నగర్ యూపీ పాఠశాలలోనూ టీచర్ల సమస్య నెలకొంది.
* మంగళగిరి మున్సిపల్ వీవర్స్ కాలనీ పాఠశాలలో పెద్ద సంఖ్యలో పిల్లలు ఉన్నారు. కానీ వారికి తగ్గ నిష్పత్తిలో ఉపాధ్యాయులు లేరు. అదనంగా టీచర్లను సమకూర్చాలని లేఖలు పెట్టారు. స్థానికంగానే ఉన్న బ్రహ్మానందరెడ్డి తదితర స్కూళ్లల్లోనూ ఈ సమస్య ఉంది.
* వట్టిచెరుకూరు మండలం ముట్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో టీచర్ల సమస్య నెలకొంది.
* కొల్లిపర మండలం తూములూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 2020 నుంచి ఒకే ఒక్క టీచర్ బయాలజీ బోధిస్తున్నారు. ఇద్దరికి ఒక్కరే ఉన్నారు.
* అమరావతి మండలం మల్లాది జడ్పీహెచ్ఎస్లో పిల్లలను ఆడించటానికి పీడీ లేరు
* సత్తెనపల్లి మండలం అబ్బూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్రం, బయాలజీ చెప్పేవారు లేరు.
వెన్నాదేవి అప్గ్రేడెడ్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్, బయాలజీ టీచర్లు లేరు.
* మాచవరం మండలం వేమవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్, సోషల్ చెప్పేవారు లేరు
* నూజెండ్ల మండలం పీఎన్పల్లి ఉన్నత పాఠశాలలో హిందీ, ఫిజిక్స్, బయాలజీ మూడు సబ్జెక్టులు బోధించేవారు లేరు
* దుర్గి మండలం ఓబులేశునిపల్లె ఎస్కేఎస్ జడ్పీహెచ్ఎస్లో 2017 నుంచి హిందీ ఉపాధ్యాయుడి పోస్టు ఖాళీగా ఉంటోంది.
* మాచర్ల మండలం కొప్పునూరు జడ్పీహెచ్ఎస్లో సాంఘికశాస్త్రం బోధించేవారు లేరు.
* గురజాల మండలం తేలుకుట్ల జడ్పీహెచ్ఎస్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోడ్ ఉన్నా.. అంబటికి లేనట్లే!
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. -
ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం : కలెక్టర్
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. -
‘వైకాపాకు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే’
[ 28-03-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు. -
‘వైకాపా నుంచి విముక్తికి ఎదురుచూస్తున్న ప్రజలు’
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
[ 28-03-2024]
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు -
పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే
[ 28-03-2024]
దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది -
నిధులు దోచేయ్
[ 28-03-2024]
అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆగని వాలంటీర్ల ప్రచారం
[ 28-03-2024]
పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. -
మరో 52 మంది వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఈనెల 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు -
ఆర్టీసీ నగరబాట హామీ.. నగుబాటేనోయి!
[ 28-03-2024]
గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది -
నేతలకు లబ్డబ్బు
[ 28-03-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. -
లక్ష్మీకటాక్షం ఉంటేనే దస్త్రం కదిలేది
[ 28-03-2024]
జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్