మారని తీరు
ప్రభుత్వ నిబంధనలు అక్కడ అమలుకావు.. అధికారులు చెప్పినా గుత్తేదారు లెక్కచేయరు.. నదిలో డంపింగ్యార్డు ఏర్పాటు చేయకూడదన్న నిబంధనలకు నీళ్లొదిలారు..
టన్ను ఇసుకకు రూ.625 వసూలు
గుత్తేదారు సంస్థపై చర్యలు శూన్యం
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే-కొల్లిపర: ప్రభుత్వ నిబంధనలు అక్కడ అమలుకావు.. అధికారులు చెప్పినా గుత్తేదారు లెక్కచేయరు.. నదిలో డంపింగ్యార్డు ఏర్పాటు చేయకూడదన్న నిబంధనలకు నీళ్లొదిలారు.. నిర్ణీత ధరకు మించి అదనంగా వసూలు చేస్తారు.. క్షేత్రస్థాయిలో ఇసుక కొనుగోలుదారులు, సంస్థ ప్రతినిధులను విచారణ చేసి అదనపు వసూళ్లు నిజమేనని డివిజన్ స్థాయి అధికారి నిర్ధారించి పంపిన నివేదికపై కనిపించని చర్యలు.. ఇదీ కొల్లిపర మండలం బొమ్మువానిపాలెం ఇసుక రీచ్లో దుస్థితి.
నివేదిక ఏమైంది...?
ఈనెల 22న ‘ఇసుక అమ్మకాల్లో ఇష్టారాజ్యం’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించి 22వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో తెనాలి సబ్కలెక్టర్, గనులు, భూగర్భవనరులశాఖ సహాయ సంచాలకులు, కొల్లిపర తహశీల్దారు ఆధ్వర్యంలో అధికారుల బృందం బొమ్మువానిపాలెం ఇసుక రీచ్ను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. గుత్తేదారు సంస్థకు చెందిన మేనేజరు, క్యాషియర్ను అధికారుల బృందం విచారించగా టన్ను ఇసుక రీచ్లో రూ.475కు బదులు రూ.625కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. గుత్తేదారు సంస్థ నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలు మేరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు చెప్పారు. నగదు పుస్తకం, వారు జారీ చేస్తున్న వేబిల్లులను పరిశీలించగా ఎక్కడా ఇసుక ధర నమోదు చేయలేదు. కేవలం ఇసుక పరిమాణాన్ని మాత్రమే నమోదు చేస్తున్నట్లు బృందం గుర్తించింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరకు వసూలుచేస్తున్నట్లు గుర్తించి ‘ఈనాడు’ పత్రికలో వచ్చిన కథనం వాస్తవమేనని నిర్ధారించారు. ఈ మేరకు ఇసుక రీచ్ను సీజ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఈనెల 22న నివేదిక పంపితే ఇప్పటివరకు చర్యలు లేవు. అప్పటి నుంచి అదనపు వసూళ్లు కొనసాగుతున్నాయి. 29వ తేదీ కూడా గుత్తేదారు సంస్థ టన్నుకు రూ.625 వసూలు చేస్తోంది. వే బిల్లుల్లో ధర వివరాలు నమోదు చేయడం లేదు. అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు.
నదిలోనే డంపింగ్ యార్డు
కొల్లిపర మండలం బొమ్మవానిపాలెంలో ఇసుక రీచ్ నిర్వాహకులు నదిలోనే డంపింగ్యార్డు ఏర్పాటు చేశారు. నదికి వరద వస్తే డంపింగ్యార్డు నిర్వహిస్తున్న ప్రాంతంలోనూ నీటి ప్రవాహం ఉంటుంది. నది నుంచి ఇసుకను తవ్వి నది వెలుపల ప్రభుత్వం అనుమతించిన ప్రాంతంలో నిల్వ చేసుకుని విక్రయించాలి. నది నుంచి డంపింగ్యార్డుకు తరలించినందుకు రవాణా ఛార్జీలను కొనుగోలుదారుల నుంచి వసూలు చేసుకునే వెసులుబాటును సైతం గుత్తేదారు సంస్థకు ప్రభుత్వం కల్పించింది. అయితే ఇందుకు విరుద్ధంగా నదిలోనే తవ్వకాలు చేస్తున్న ప్రాంతానికి 500 మీటర్లలోపే నది మధ్యలో డంపింగ్యార్డు ఏర్పాటు చేసి ఇసుక నిల్వ చేసి విక్రయిస్తున్నారు. ఇక్కడ టన్నుకు రూ.625 వసూలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇసుక తవ్వి తెనాలి నియోజకవర్గంలో ఏర్పాటు చేసే డంపింగ్యార్డులో రూ.535కు విక్రయించాలని ప్రభుత్వం ప్రతి వారం ప్రకటన ఇస్తోంది. ఇది ఆచరణలో అమలుకావడం లేదు. ఇసుక కొనుగోలుదారులు ఇదే విషయాన్ని రీచ్లో గుత్తేదారు సంస్థ ప్రతినిధులను ప్రశ్నిస్తే ఇసుక ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడి వచ్చి ఇసుక కొనుగోలు చేయమని తాము బతిమాలుతున్నామా? అని ఎదురుదాడికి దిగుతున్నారు.
అక్రమాలు వెలుగులోకి వస్తాయనే..
బొమ్మువానిపాలెం రీచ్లో కొనుగోలుదారులకు ఇస్తున్న వేబిల్లులో ఇసుక పరిమాణం, ఇతర వివరాలు నమోదు చేస్తున్నారు. టన్ను ఇసుక ధర, మొత్తం చెల్లించిన సొమ్ము నమోదుచేయకుండా బిల్లులు ఇస్తున్నారు. ఈ విషయం ‘ఈనాడు’ పరిశీలనలో వెల్లడైంది. బిల్లులో టన్నుకు రూ.625 వసూలు చేస్తున్నట్లు బిల్లులు ఇస్తే ఇబ్బందులు వస్తాయని వివరాలు నమోదుచేయకుండా ఇస్తున్నారు. లారీడ్రైవర్లు, కొనుగోలుదారులు ఎవరైనా ప్రశ్నిస్తే తాము ఇలాగే చేస్తామని సమాధానం చెబుతున్నారు. ఇసుక తవ్వకాల వెనుక జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధితోపాటు పొరుగు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి ఉండటంతో యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తోందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. క్షేత్రస్థాయి యంత్రాంగం నివేదిక పంపి మిన్నకుండిపోగా ఉన్నతాధికారులకు నివేదిక వచ్చి వారం రోజులైనా చర్యలు మాత్రం తీసుకోకపోవడం గమనార్హం. గుత్తేదారు అదనపు వసూళ్లు మాత్రం బహిరంగంగా కొనసాగుతూనే ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ఎంపీ నందిగం సురేశ్పై వాలంటీర్ ఆనంద్బాబు పోటీ
[ 24-04-2024]
వైకాపా ఎంపీ నందిగం సురేశ్పై ఓ వాలంటీరు పోటీకి దిగుతున్నారు. -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
[ 24-04-2024]
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
[ 24-04-2024]
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
[ 24-04-2024]
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
వైఎస్ఆర్ను తిట్టిన బొత్స.. జగన్కు తండ్రి సమానులా?: షర్మిల
[ 24-04-2024]
మంత్రి బొత్స సత్యనారాయణ తండ్రి సమానులంటూ సీఎం జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. -
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్