బోధనేతర విధుల్లో గురువులు
ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించొద్దని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు ఉన్నా, వాటిని బేఖాతర్ చేస్తూ పల్నాడు జిల్లాలో ఏకంగా 10 మంది ఉపాధ్యాయులను
ఓ ఎమ్మెల్యే సిఫార్సు లేఖతో డిప్యూటేషన్లు
జిల్లా కేంద్రంలో తిష్ఠ వేసిన పది మంది
ఈనాడు-అమరావతి: ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించొద్దని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు ఉన్నా, వాటిని బేఖాతర్ చేస్తూ పల్నాడు జిల్లాలో ఏకంగా 10 మంది ఉపాధ్యాయులను పాఠశాలల్లో జరిగే నాడు-నేడు పనుల పర్యవేక్షణకు డిప్యూటేషన్పై నియామకం చేయడం విమర్శలకు దారితీసింది. ఒకవైపు జిల్లాలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. అనేక పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు మొదలుకుని లాంగ్వేజీలు బోధించే వారి వరకు కొరత ఉందని పర్యవసానంగా ఒక టీచర్ వేరే సబ్జెక్టు కూడా బోధిస్తూ పని భారంతో సతమతమవుతుంటే, అందుకు విరుద్ధంగా పిల్లలకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులను బోధనేతర విధులకు తీసుకోవడం ఏంటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇటీవల గురజాల మండలంలో పదో తరగతి విద్యార్థులు ఏకంగా తమకు పాఠాలు చెప్పే టీచర్లు లేరని రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఒకవైపు టీచర్ల కొరత ఇంత తీవ్రంగా ఉంటే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేసే సెకండరీ గ్రేడ్ టీచర్లను డిప్యూటేషన్పై అవసరమైతే హైస్కూళ్లకు పంపి బోధనకు ఆటంకం లేకుండా చూడాల్సింది పోయి నాడు-నేడు పనుల పర్యవేక్షణకు ఉపాధ్యాయులను తీసుకోవడం హేయమని సహచర ఉపాధ్యాయులు ధ్వజమెత్తుతున్నారు. అసలు ఒక ఎమ్మెల్యే లేఖతో అంతమంది ఉపాధ్యాయులను పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటకు తీసుకురావడం ఎలా సాధ్యం? నిజంగా ఆ ఎమ్మెల్యే వారినే సిఫార్సు చేశారా? ఒకరిద్దరిని సిఫార్సు చేస్తే అధికారులు మరికొంతమందిని ఏమైనా డిప్యూటేషన్పై వేసుకున్నారా అనేది కూడా విచారణ చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. ప్రతి మండలంలో స్కూళ్లల్లో జరిగే నాడు-నేడు పనుల పర్యవేక్షణకు సీఆర్పీలు, మండల విద్యాశాఖ అధికారులు ఉన్నారు. వారి నుంచి పురోగతి నివేదికలు తీసుకొని పనుల వేగవంతానికి చర్యలు చేపట్టాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు అందుకు విరుద్ధంగా పాఠాలు బోధించే టీచర్లను వేస్తామంటే అందుకు జిల్లా ఉన్నతాధికారులు సైతం అమోదం తెలపడాన్ని సంఘాల నాయకులు తప్పుబడుతున్నారు. ఈ డిప్యూటేషన్లకు ఉన్నతాధికారుల ఆమోదం ఉందని చెప్పి వెంటనే వారిని వారు పని చేసే స్కూళ్ల నుంచి రిలీవ్ చేయించి ఆగమేఘాల మీద నరసరావుపేటకు రప్పించారు. వీరు పని చేసే స్కూళ్ల నుంచి డిప్యూటేషన్పై వచ్చేయడంతో వారు బోధించే సబ్జెక్టులు ఎవరు చెబుతారు? అక్కడ పిల్లల పరిస్థితి ఏంటో ఉన్నతాధికారులే ప్రశ్నించుకోవాలి. వీరిలో కొందరు నాడు-నేడు పనులు జరిగే స్కూళ్ల నుంచి ఫొటోలు తెప్పించడం, వెబెక్స్ మీటింగ్ మినిట్స్ రాయడం, వాటి నివేదికలను ఉన్నతాధికారులకు నివేదించడం వంటి పనులు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. వెంటనే ఆ ఉపాధ్యాయులను వెనక్కు పంపాలని సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
బోధనేతర విధులకు తీసుకున్న ఉపాధ్యాయుల వివరాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అ‘తీగ’తిలేని మార్గం
[ 20-04-2024]
ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా తెదేపా ప్రభుత్వం ప్రారంభించినది అయితే పూర్తి చేయం. అవసరమైతే పనికిరాకుండా చేస్తాం ఇది జగన్ సర్కారు ఐదేళ్లుగా అవలంభిస్తున్న తీరు. -
కూలేదాకా.. కళ్లప్పగిస్తారా!
[ 20-04-2024]
బీటలు వారిన స్తంభాలు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారథులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి -
ఉడకని జీడిపప్పు
[ 20-04-2024]
వేటపాలెం అంటేనే జీడిపప్పు పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో వ్యాపారులు ఒకప్పుడు స్థానికంగా దొరికే జీడిపిక్కలను కొనుగోలు చేసి వాటిని కాల్చి పప్పుగా తయారు చేసి విక్రయించేవారు. -
నేరచరిత్ర లేని సచ్ఛీలుడు తెన్నేటి
[ 20-04-2024]
బాపట్ల లోక్సభ స్థానం తెదేపా ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ తనకు రూ.15.93 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో ప్రకటించారు -
మందులో ముంచేసి.. పీల్చి పిప్పి చేసి..
[ 20-04-2024]
రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం విధిస్తాం. మూడు విడతల్లో మద్యం దుకాణాలు తగ్గించుకుంటూ వెళ్లి పూర్తిగా ఎత్తేస్తాం. మందు ముట్టుకోవాలంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచుతాం. మద్యపాన నిషేధం చేశాకే 2024లో ఓట్లు అడగడానికి వస్తాను. -
ఎంపీ 1, ఎమ్మెల్యేకు 19 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజున గుంటూరు పార్లమెంట్ స్థానానికి కిలారి వెంకటరోశయ్య వైకాపా తరఫున నామినేషన్ను దాఖలు చేశారు -
కొనసాగుతున్న ఒత్తిళ్లతో వాలంటీర్ల రాజీనామా
[ 20-04-2024]
ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో 20 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్రరావు తెలిపారు. -
అట్టహాసంగా శ్రావణ్కుమార్ నామినేషన్
[ 20-04-2024]
తాడికొండ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం తాడికొండ ఆర్వో గంగరాజుకు నామినేషన్ పత్రాలు అందజేశారు -
ఎన్నికల వేళా.. ఆగని దోపిడీ
[ 20-04-2024]
అధికారం అండగా ఉందని ఏం చేసినా అడ్డుకునేవారు లేరని వైకాపా నేతలు బరితెగించారు. కృష్ణానదిలో రాత్రివేళ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తూ తరలించి జేబులు నింపుకొంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వారికి అడ్డంకి లేకుండా పోయింది. -
ఏళ్లుగా ఉద్యోగులకు శిక్షే
[ 20-04-2024]
అనేక సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం జగన్ మాటలు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని.. పలు హామీలు ఇచ్చి వాటిని గాలికొదిలేశారు. -
తాగునీరివ్వకపోతే బతికేదెలా..?
[ 20-04-2024]
తమకు తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేయడం లేదని ప్రత్తిపాడులోని మహబూబ్ నగర్ కాలనీ వాసులు శుక్రవారం గుంటూరు- పర్చూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో జేఎల్ఎం మృతి
[ 20-04-2024]
విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్) మృతి చెందిన ఘటన ఇది. విద్యుత్తు శాఖ ఉద్యోగులు, బాధితుల కథనం ప్రకారం... పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అడుసుమల్లి సుబ్రహ్మణ్యం, చిలకమ్మ దంపతుల పెద్దకుమారుడు రాజేశ్ (27) ఇదే గ్రామంలో జేఎల్ఎంగా పనిచేస్తున్నారు. -
కలగా మినీ రైతుబజార్లు
[ 20-04-2024]
నాడు అలా...గత ప్రభుత్వంలో వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు 2018లో పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గంలో రైతుబజార్ను అందుబాటులోకి తెచ్చారు. ఆ రైతుబజార్లో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు. -
ఓటు హక్కు వినియోగానికి కార్మికులకు సెలవు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరగనున్న పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మికులకు సెలవు ప్రకటించినట్లు మూడో జోన్ కార్మిక శాఖ ఇన్ఛార్జి సంయుక్త కమిషనర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు -
మద్యం మత్తు.. కుటుంబాలు చిత్తు
[ 20-04-2024]
గత నెల 18వ తేదీన తెనాలి మున్సిపల్ కార్యాలయం చెంతనే నిర్మాణంలో ఉన్న మార్కెట్ భవంతిలో రవికిరణ్ (37) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారణం మద్యం మత్తు. మద్యం తాగి చెంతనే దోమల కాయిల్ వెలిగించుకుని నిద్రపోయిన అభాగ్యుడు కాయిల్ దుప్పటికి తగిలి మంటలు చెలరేగినా మత్తు వల్ల లేవలేక కాలిపోయాడు
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే