సూక్ష్మ సేద్యానికి ఏదీ మోక్షం?
సమపాళ్లలో నీరు, పోషకాలు అందించి తద్వారా నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చేపట్టి సుస్థిర వ్యవసాయానికి సూక్ష్మసేద్య పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
నత్తనడకన బిందు, తుంపర పరికరాల అమరిక
ఈనాడు, నరసరావుపేట, బాపట్ల: సమపాళ్లలో నీరు, పోషకాలు అందించి తద్వారా నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చేపట్టి సుస్థిర వ్యవసాయానికి సూక్ష్మసేద్య పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. 15 నుంచి 40 శాతం ఎరువులు, 20 నుంచి 30 శాతం రసాయనాలు, 10 నుంచి 15 శాతం శ్రమ, 20 నుంచి 25 శాతం యాంత్రిక శక్తి ఖర్చులు తగ్గుతాయి. ఇంతటి కీలకమైన సూక్ష్మసేద్య పరికరాలు సాగుదారులకు అందడంలో జాప్యం జరుగుతోంది. రెండేళ్లుగా రాయితీపై సరఫరా చేయని ప్రభుత్వం ప్రస్తుత ఏడాది ఆగస్టు నుంచి రాయితీని అమలు చేస్తోంది. అయితే కంపెనీలు ఆసక్తి చూపకపోవడం, క్షేత్రస్థాయిలో సిబ్బంది తగినంత మంది లేకపోవడం పథకం అమలుకు అడ్డంకిగా మారింది. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సూక్ష్మ సేద్యపరికరాలు అమరిక జరగడం లేదు.
ఆసక్తి చూపని కంపెనీలు
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో సుమారు 13 కంపెనీలు సూక్ష్మసేద్య పరికరాలు అమర్చడానికి ఒప్పందం చేసుకున్నాయి. అయితే గతంలో భారీస్థాయిలో పరికరాలు సరఫరా చేసిన పెద్ద కంపెనీలు కొన్ని ఈసారి ప్రభుత్వంతో ఒప్పందానికి ముందుకు రాలేదు. ఒప్పందం చేసుకున్న కంపెనీలు కూడా పరికరాలు అమర్చడంలో ఆసక్తి చూపడం లేదు. రైతుల వాటాగా 10 శాతం సొమ్ము చెల్లిస్తే ప్రభుత్వం 90శాతం సొమ్ము చెల్లించాల్సి ఉంది. తుంపర సేద్య పరికరాలకు రైతువాటా 45 శాతం సొమ్ము చెల్లించాల్సి ఉంది. బిల్లులు త్వరగా రాకపోవడంతో వారు ఆచితూచి పరికరాలు సరఫరా చేస్తున్నారు. దీనికితోడు కంపెనీలకు చెల్లించే మొత్తం జీఎస్టీ 2 శాతం, ఆదాయపు పన్ను 2 శాతం కలిపి మొత్తం 4 శాతం సొమ్మును మినహాయించుకుని చెల్లింపులు చేస్తున్నారు. ముందస్తుగా పన్నులు మినహాయించుకోవడం ఈ ఏడాది నుంచి మొదలైంది. కంపెనీలు మండలాల వారీగా సిబ్బందిని ఏర్పాటుచేసుకుని రైతు దరఖాస్తు చేసిన వెంటనే సర్వే చేసి నివేదిక ఇచ్చి రోజుల వ్యవధిలోనే పరికరాలు అమర్చేవారు. ఇప్పుడు కంపెనీలు చొరవగా రైతులకు పరికరాలు సరఫరాకు ముందుకురావడం లేదు. ఆయా కంపెనీలు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు కలిపి ఒకే సమన్వయకర్తను నియమించుకుని నడిపిస్తున్నాయి. దీంతో వారు సకాలంలో సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. రెండు నుంచి నాలుగు కంపెనీలు మాత్రమే ఆసక్తిగా సరఫరా చేస్తున్నాయి. ఇది పథకం అమలుకు అడ్డంకిగా మారింది. దీనికితోడు ఎక్కువ మంది కౌలుదారులు సాగు చేస్తుండటంతో సూక్ష్మసేద్య పరికరాలు అమర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.
లక్ష్యం సాధ్యమేనా?
ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఈ ఏడాది ఇచ్చిన లక్ష్యాల్లో 50 శాతం సాధించడం కూడా గగనమేనని సంబంధిత అధికారులు చెబుతున్నారు. రైతులు అంతగా ఆసక్తి చూపకపోవడం, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉండటంతో అనుకున్నంత వేగంగా పనులు జరగడం లేదు. ఆగస్టు నెలాఖరులో పథకం మార్గదర్శకాలు రావడంతో అమలులో కొంత జాప్యం జరిగిందని, గతంలో పథకం అమలుతీరును ఆధారంగా చేసుకుని లక్ష్యాలు నిర్దేశించడంతో చేరుకోవడం కష్టమేనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మార్చి నెలాఖరు వరకు సమయం ఉన్నందున కంపెనీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మూడు జిల్లాల ఏపీఎంఐపీ పథక సంచాలకుడు తెలిపారు. సూక్ష్మసేద్య పరికరాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నందున రైతులు కూడా ముందుకురావాలని వారు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు