Nadikudi Junction: దయచేసి వినండి.. నడికూడిలో రైళ్లు ఆగవండి
రాష్ట్రానికి సరిహద్దులోనున్న నడికూడి కీలకమైన రైల్వే జంక్షన్. విద్య, ఉపాధి, వ్యాపార అవసరాల నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్లేవారు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.
గురజాల, న్యూస్టుడే
రాష్ట్రానికి సరిహద్దులోనున్న నడికూడి కీలకమైన రైల్వే జంక్షన్. విద్య, ఉపాధి, వ్యాపార అవసరాల నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్లేవారు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రైల్వే కూడలిగానున్న నడికూడిలో ప్రధానమైన ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మాదిరి రైళ్లు నిలుపుదల చేయాలని ఏడాది కాలంగా ప్రజలు వినతులు చేసినా ప్రజాప్రతినిధులు చొరవచూపడం లేదు. రైల్వే ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
విశాఖ, చెన్నై, నారాయణాద్రి, నరసాపూర్, డెల్టా వంటి ఎక్స్ప్రెస్ సర్వీసులు నడికూడి మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లి, గురజాల, రెంటచింతల, మాచర్ల, దుర్గి, కారంపూడి, మాచవరం, పిడుగురాళ్ల మండలాలకు చెందిన ప్రయాణికులతో సరిహద్దులోనున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రయాణిస్తుంటారు. గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెండు నియోజకవర్గాల ప్రజలు 4 లక్షల మంది ఇక్కడ నుంచే రాకపోకలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రైళ్లన్ని నడికూడి నుంచి వెళ్లే సమయంలో మాత్రం ఆగుతున్నాయి. అయితే తిరిగి వచ్చే సమయంలో మాత్రం ఒక్కటీ ఆగడం లేదు. కరోనాకు ముందు రైళ్లు నడికూడిలో నిలుపుదల చేశారు. కరోనా అనంతరం అన్ని రైళ్లను పునరుద్ధరించినా నడికూడి జంక్షన్ మీదుగా వెళ్లే ప్రధానమైన రైళ్లు ఆగకపోవడంతో ప్రయాణికులకు పాట్లు తప్పడం లేదు. గుంటూరు, మిర్యాలగూడ(150 కి.మి.) మధ్య ఒక్కస్టాప్ కూడా లేకపోవడంతో ప్రయాణికులకు ఈ రైళ్లు ఏమాత్రం ఉపయోగం పడటం లేదు. దూర ప్రాంతాల నుంచి నడికూడికి చేరుకొని అక్కడ నుంచి స్వస్ధలాలకు వెళ్లే సౌకర్యం పూర్తిగా ఆగిపోయింది. గుంటూరులో దిగి 100 నుంచి 150 కి.మి.దూరం బస్సుల్లో, కార్లలో ప్రయాణం చేసి గమ్యస్థానాలను చేరుకోవాల్సి వస్తుంది.
అదనపు ఖర్చులు.. సమయం వృథా
గతంలో నడికూడిలో దిగి 20 నుంచి 30 కి.మి.పరిధిలో ఇళ్లకు చేరుకోవడం ప్రయాణికులకు సులభంగా ఉండేది. ప్రయాణ ఖర్చు తక్కువగా ఉండేది. రైళ్లన్నీ తిరిగి వచ్చే సమయం అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల నుంచి 4 గంటల నడుమ ఉంటుంది. గుంటూరులో దిగి 100 నుంచి 150 కి.మి. దూరం ప్రయాణించాల్సి వస్తుంది. రైలు వెళ్లే మార్గానికి సమాంతరంగా వాహనాలలో చేరాల్సి వస్తుంది. రాత్రి వేళల్లో ప్రయాణం ప్రమాదరకంగా మారుతున్న వేళ తెల్లవారే వరకు గుంటూరు రైల్వేస్టేషన్లో పడిగాపులు కాయాల్సి వస్తుంది. అద్దె కార్లు వినియోగించే వారు రూ.వేలు చెల్లించాల్సి వస్తుంది. నడికూడిలో దిగే ప్రతి ప్రయాణికుడు గుంటూరులో ఆగిపోవడం వల్ల కార్లను ఆశ్రయించాల్సి వస్తే రూ.3వేల వరకు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎంతో సమయం కూడా వృథా అవుతోంది. బస్సుల్లో చేరుకునేవారు తెల్లవారే వరకు గుంటూరు బస్టాండ్లో వేచి ఉండి రూ.150 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. తిరుపతిలో స్వామివారిని దర్శించుకొని నారాయణాద్రిలో వచ్చే వారు గుంటూరులో దిగి రావడం కష్టంగా మారుతోంది. తడలో శ్రీ సిటీలో పనిచేసే మహిళలకు నారాయణాద్రి, చెన్నై రైళ్లు ఎంతో ఉపయోగంగా ఉండేవి. గుంటూరులో దిగి పల్నాడుకు రావాలంటే ఎంతో ఖర్చు, సమయం వృథా అవుతోంది.
రైల్వేశాఖ తీరుతో ప్రయాణికులకు అర్ధరాత్రి అగచాట్లు
నడికూడిలో రైళ్లు ఆగితే ప్రతి రోజు దిగే ప్రయాణికులు : 500 మంది వరకు
సమయం వృథా : 5 నుంచి 8 గంటల వరకు
బాడుగ కారు అయితే అదనపు ఖర్చు : గుంటూరు నుంచి రూ. 3వేలు
సొంత కారు అయితే : డీజిల్ కోసం: రూ.1500
బస్సు ఛార్జీ : రూ.150
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది.. గీత దాటితే వేటే: ఈసీ
[ 16-04-2024]
ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది. -
వైకాపా మరిన్ని కుట్రలకు తెరలేపే అవకాశం.. అభ్యర్థుల్ని అప్రమత్తం చేసిన ఎన్డీయే
[ 16-04-2024]
ఎన్డీయే తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి ఏ పార్టీ నేత అయినా కూటమి అభ్యర్థిగానే భావించాలని అధిష్ఠానం నేతలకు దిశా నిర్దేశం చేసింది. -
డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు వద్దు: ఈసీ
[ 16-04-2024]
ఏపీలో ఉన్న డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్ట వద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. -
ఎన్నికల వేళ.. ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు
[ 16-04-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో మరో ఉన్నతాధికారిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
వట్టిచెరుకూరులో తెదేపా ఎన్నికల ప్రచారం
[ 16-04-2024]
వట్టిచెరుకూరు మండలంలోని కోయిలమూడి గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తెలుగుదేశంలో నయా జోష్.. అధికార పార్టీ నుంచి కొనసాగుతున్న వలసలు
[ 16-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. వైకాపా నుంచి పలువురు కీలక నేతలు తెదేపాలో చేరి కూటమి అభ్యర్థుల విజయం కోసం పనిచేస్తున్నారు. -
నీవుండే జిల్లాకూ.. నీరివ్వలేదే జగన్
[ 16-04-2024]
ప్రజా పరిపాలన అంటే బటన్ నొక్కితే చాలనుకునే రోజులివి. నాయకుడికి ముందుచూపు లేకపోతే గుక్కెడు నీటికి కూడా అల్లాడిపోవాల్సి వస్తుందనడానికి జిల్లాలో నెలకొన్న పరిస్థితులే నిదర్శనం. -
దారి మారలేదు.. ఆళ్ల వల్ల కాలేదు..
[ 16-04-2024]
కృష్ణా పశ్చిమ డెల్టాలోని వివిధ ప్రాంతాల నుంచి తెనాలికి వచ్చి అక్కడి నుంచి దుగ్గిరాల మీదుగా విజయవాడకు రాకపోకలు సాగించేవారు ఎక్కువ. -
సీఎం ఇలాకాలో పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలు
[ 16-04-2024]
సాక్షాత్తూ ముఖ్యమంత్రి నివసించే ప్రాంతంలోని పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు అందక ఆకలితో అలమటిస్తున్నారు. -
నీటి రాతలే.. నీళ్ల్లివ్వరు!
[ 16-04-2024]
వలసలతో పట్టణ జనాభా నానాటికీ పెరుగుతోంది.. పెరుగుతున్న అవసరాలకు సరిపడా నీరందడం లేదు. వేసవిలో గుక్కెడు నీటి కోసం పుర ప్రజలు అల్లాడుతున్నారు. -
ప్రయాణికులకు అవే తిప్పలు
[ 16-04-2024]
ఆర్టీసీ ప్రయాణికుల ఇక్కట్లు ఇప్పట్లో తీరేలా లేవు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ గుడివాడలో నిర్వహించిన సభకు బాపట్ల డిపో నుంచి 26 బస్సులు కేటాయించారు. -
తెదేపాతో జత.. వైకాపాలో కలవరింత
[ 16-04-2024]
జిల్లాలో తెదేపాలో చేరికలు వెల్లువెత్తడంతో ఆ పార్టీ నాయకుల్లో జోష్ నింపుతోంది. -
రాళ్లపై నడిచెళ్లి ఓట్లేసేదెలా?
[ 16-04-2024]
నిజాంపట్నం మండలంలో గుర్నాథనగర్ నుంచి హారిస్పేట వెళ్లే రహదారి పూర్తిగా రూపురేఖలు మారి అధ్వానంగా ఉంది. -
పోలీసు తీరు మారలేదు.. అరాచకాలు ఆగలేదు..
[ 16-04-2024]
పల్నాడులో రౌడీరాజ్యం నడుస్తోంది.. దౌర్జన్యాలు, దాడులు, దోపిడీలకు అంతేలేకుండా పోతోంది. ఎన్నికల కోడ్ వచ్చినా అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. -
జడ్పీ సర్వసభ్య సమావేశంపై గందరగోళం
[ 16-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం నిర్వహణపై గందరగోళం ఏర్పడింది. -
‘పిన్నెల్లి బాధితులకు న్యాయం చేస్తాం’
[ 16-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతల దాడులు, దౌర్జన్యాలు భరించలేక పిన్నెల్లికి చెందిన తెదేపా కుటుంబాలు ఊరి వదిలి వెళ్లాయి.. ఇటీవల వారందరూ స్వగ్రామానికి వచ్చారు. -
స్వేచ్ఛను కాలరాశారు
[ 16-04-2024]
గత ప్రభుత్వం ఉద్యోగులపై అరాచకాలు చేసింది.. మన ప్రభుత్వం రాగానే స్నేహపూర్వక వాతావరణంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించుకోవచ్చని గత ఎన్నికల సందర్భంలో చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి -
తక్కువ ధరకు స్థలం ఇప్పిస్తామని మోసం
[ 16-04-2024]
స్థలం తక్కువ ధరకు ఇప్పిస్తామంటూ తమ వద్ద రూ.33.40 లక్షలు తీసుకొని మోసగించారని కృష్ణనగర్కు చెందిన రాజేశ్వరి సోమవారం పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్కు ఫిర్యాదు చేశారు. -
బస్సుల్లేక ఉసూరుమని..
[ 16-04-2024]
మరోసారి ప్రయాణికులకు అవస్థలు తప్ప లేదు. సోమవారం గుడివాడలో జరిగిన సిద్ధం సభకు జిల్లాలోని అయిదు డిపోల నుంచి మొత్తం 210 బస్సులను తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్కు ఈసీ నోటీసులు
-
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
-
ఛత్తీస్గఢ్ చరిత్రలోనే అతిపెద్ద ఎన్కౌంటర్.. అమిత్ షా ఏమన్నారంటే!
-
సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది.. గీత దాటితే వేటే: ఈసీ
-
వైకాపా మరిన్ని కుట్రలకు తెరలేపే అవకాశం.. అభ్యర్థుల్ని అప్రమత్తం చేసిన ఎన్డీయే
-
ఇంటర్వ్యూ వేళ తల్లి మృతి.. బాధను దిగమింగి.. ‘సివిల్స్’లో రెండో ర్యాంకు