హార్బరు పనుల్లో కదలిక
నిజాంపట్నం హార్బరు దశాబ్దాల క్రితం నిర్మించింది కావడంతో ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు.
విస్తరణ ఏప్రిల్ నాటికి పూర్తవుతుందంటున్న అధికారులు
నిజాంపట్నం, న్యూస్టుడే
ముమ్మరంగా జరుగుతున్న మొగ పనులు
నిజాంపట్నం హార్బరు దశాబ్దాల క్రితం నిర్మించింది కావడంతో ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. బోట్లు సంఖ్య పెరిగినా నిలుపుకొనేందుకు తగిన వసతి లేక మత్స్యకారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏటా రూ.వందల కోట్ల మత్స్య సంపద ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. అయితే సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఎగుమతులు పెరగని పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో హార్బరును విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే నిధులు మంజూరైనా గాని పనులు చేయడంలో జాప్యం నెలకొంది. ఎట్టకేలకు రెండోదశ అభివృద్ధి పనుల్లో కదలిక వచ్చింది. ప్రధానంగా మొగ సామర్థ్యం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే సముద్రపు పోటు, పాటుతో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా మత్స్యకారుల బోట్లు సులువుగా సముద్రంలోకి వెళ్లి, వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీని నిర్మాణానికి ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. మిగిలిన పనులకు రూ.251 కోట్లు మంజూరు చేసింది. ఇది పూర్తయితే సుమారు వెయ్యి బోట్లు నిలుపుదల చేసేందుకు అనువుగా ఉంటుంది.
సిద్ధం చేసిన సిమెంటు రాళ్లు
వంద ఎకరాలకు ప్రతిపాదన: గతంలో నిజాంపట్నం హార్బర్ రెండో దశ అభివృద్ధికి గతంలో హార్బర్కు అనుకొని ఉన్న ఐదు ఎకరాలను ప్రతిపాదించారు. దీనికి అనుమతులు వచ్చాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రస్తుతం మరో సుమారు వంద ఎకరాల వరకు ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన దస్త్రాలు పరిశీలనలో ఉన్నాయి. వాటి అనుమతులు వచ్చేలోపు జెట్టి నిర్మాణాలు పూర్తిచేయాలనే సంకల్పంతో అధికారులున్నారు. నిజాంపట్నం హార్బర్ రెండో దశ అభివృద్ధికి ప్రభుత్వం రూ.451 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ పనులను 2020 నవంబరు 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వర్చూవల్ పద్ధతిలో పనులను ప్రారంభించారు. 2021, అక్టోబరు 5న హార్బర్ అభివృద్ధి పనుల్లో భాగంగా డ్రెడ్జింగ్ పనులకు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు భూమిపూజ చేశారు. అప్పటి నుంచి సముద్ర ముఖ ద్వారం నుంచి మురుగు కాల్వ పూడికతీత పనులు చేపట్టారు. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి.
చేయాల్సిన పనులివే..
* అభివృద్ధి పనుల్లో భాగంగా సముద్ర ముఖద్వారం నుంచి కిలోమీటరుపైన కొండరాళ్లు అడ్డుపెట్టాలి.
* ప్రస్తుతం 500 మీటర్ల మేర జెట్టి ఉంది. దీన్ని నిజాంపట్నంవైపు 500 మీటర్లు, లైట్హౌస్ పక్కన మరో 500 మీటర్లు జెట్టి నిర్మాణం చేపట్టాలి.
* పరిపాలనా భవనం నిర్మాణం చేపట్టాలి. శీతల గిడ్డంగులు నిర్మించాలి. వలలు అల్లుకునేందుకు మత్స్యకారులు విశ్రాంతి తీసుకునేందుకు నిర్మాణాలు చేయాలి.
* మౌలిక వసతుల కల్పనలో భాగంగా అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పరచాలి. తాగునీటి వసతి సమకూర్చాలి. అవసరాలకనుగుణంగా విద్యుత్తు సౌకర్యాన్ని సమకూర్చాలి. మత్స్యకారులు సముద్రంలో వేటాడి తెచ్చిన మత్స్యసంపదలకు వేలం పాట నిర్వహించేందుకు తగిన వసతులు కల్పించాలి.
వచ్చే మే నెలలో ప్రారంభిస్తాం
హార్బర్ అభివృద్ధిలో ప్రధాన పనులైన మొగ సామర్థ్యం పనులు వేగంగా జరుగుతున్నాయి. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు ఇప్పటికే ఆక్రమణలు తొలగించాం. ఏప్రిల్ నెలాఖరు నాటికి మిగిలిన పనులు పూర్తిచేయాలని సంబంధిత గుత్తేదారులకు సూచించాం. అందుకనుగుణంగా వారు పనులు చేస్తున్నారు. మే నెలలో ప్రారంభించాలనే యోచనలో ఉన్నాం.
సురేష్, మత్స్యశాఖ జేడీ, బాపట్ల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు