గంటసేపు ఆపారు!
కడప జిల్లాలో కార్యక్రమాలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్తారని ట్రాఫిక్ను కుంచనపల్లి సమీపంలో ఆపారు.
ట్రాఫిక్ కారణంగా వాహనం దిగి కార్యాలయానికి నడిచి వస్తున్న అచ్చెన్నాయుడు
ఈనాడు, అమరావతి: కడప జిల్లాలో కార్యక్రమాలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్తారని ట్రాఫిక్ను కుంచనపల్లి సమీపంలో ఆపారు. కానీ జాతీయ రహదారిని ఖాళీగా ఉంచి లారీలు, బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనచోదకులను సైతం మంగళగిరి నుంచి ఆత్మకూరు వరకూ తెదేపా జాతీయ కార్యాలయం వైపు సర్వీసు రోడ్డులో గంటకు పైగా నిలిపేశారు. జగన్మోహన్రెడ్డి పాలనలో బీసీలపై జరిగిన దాడులు, దౌర్జన్యాలపై ఫొటో ఎగ్జిబిషన్, విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారని, అందుకే ఈ దారిలో వారి వాహనాలు రానివ్వకుండా ఇలా నిలిపేశారని తెదేపా జాతీయ పార్టీ కార్యాలయంలో బీసీ నేతలు ఆరోపించారు.తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వాహనం ట్రాఫిక్లో చిక్కుకుపోగా కిలోమీటరు దూరం ఆయన నడిచి వచ్చారు. ఎందుకు ఆపారో, ఎంతసేపు పడుతుందో తెలియక వాహనచోదకులు తీవ్ర అవస్థలు పడ్డారు. వాతావరణం అనుకూలించక సీఎం కడపకు వెళ్లే కార్యక్రమం చివరకు రద్దు కావడం కొసమెరుపు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం