కర్షకుల్లో కలవరం!
తుపాను హెచ్చరికలు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వరి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
వర్షాల సమాచారంతో జోరుగా కోతలు
ప్రైవేటు వ్యాపారులకు అమ్మకాలు
ఈనాడు, నరసరావుపేట, బాపట్ల
తుపాను హెచ్చరికలు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వరి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంట కోతలను హడావుడిగా చేపట్టి ధాన్యాన్ని విక్రయించేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా ఊపందుకోకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు అమ్మేసుకుంటున్నారు. ఆలస్యం చేస్తే పంట పొలంలోనే పాడైపోతుందనే భావనతో ముందస్తు కోతలు చేపడుతున్నారు. యంత్రాలతో కోత కోసిన ధాన్యంలో తేమ ఎక్కువగా ఉండటంతో ఆరబెట్టి తీసుకురావాలని రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే) సిబ్బంది రైతులకు సూచిస్తున్నారు. ధాన్యం ఆరబెట్టడానికి స్థలం, సమయం లేకపోవడంతో రైతులు పొలాల్లోనే ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. బీపీటీకి మద్దతు ధరకు కొంత తక్కువ సొమ్ము లభిస్తున్నా సాధారణ రకాలకు బస్తాకు రూ.250 వరకు రైతులు నష్టపోతున్నారు.
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో 1.96 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. ప్రస్తుతం కోతల సీజన్ మొదలైంది. రైతులు పండించే పంటను మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గుంటూరు జిల్లాలో వారం రోజుల కిందట ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మొదలైంది. బాపట్లలో మంగళవారం ప్రారంభం కాగా, పల్నాడులో ఇంకా ప్రారంభించలేదు. ప్రభుత్వం నిర్దేశించిన శాతం కంటే ధాన్యంలో ఎక్కువ తేమశాతం ఉండటంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు ఇందుకు ఓ కారణమైతే గతేడాది ఎదురైన అనుభవాలు మరో కారణంగా రైతులు చెబుతున్నారు. డెల్టా ప్రాంతంలో రెండో పంట మొక్కజొన్న సాగు వెంటనే చేపట్టాల్సి ఉన్నందున పెట్టుబడుల కోసం ఎక్కువ మంది రైతులు ప్రైవేటుకు విక్రయించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈనెల 9, 10 తేదీల్లో తీరప్రాంతంలో వర్షాలు పడే అవకాశముందన్న సమాచారంతో కర్షకులు కలవరపడుతున్నారు. ఇప్పుడు తుపాను బారినపడితే రైతులు తీవ్రంగా నష్టపోయి పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి వస్తుంది. కోతల సమయానికి మరికొద్ది రోజులు గడువు ఉన్నా హడావుడిగా చేపడుతున్నారు.
రైతుకు దక్కని మద్దతు : 75 కిలోల బస్తా ధాన్యానికి ప్రభుత్వం గ్రేడు-ఏ రకానికి రూ.1545, సాధారణ రకానికి రూ.1530 మద్దతు ధర ప్రకటించింది. బహిరంగ మార్కెట్లో బీపీటీ 75 కిలోల బస్తా రూ.1330 నుంచి రూ.1380 వరకు కొనుగోలు చేస్తున్నారు. 22 నుంచి 26 శాతం వరకు తేమ ఉన్నప్పటికీ వ్యాపారులు కొంటున్నారు. తరుగు రూపంలో 6 కిలోలు తగ్గినా ఆమేరకు కిలోకు రూ.20 చొప్పున ఆరు కిలోలకు రూ.120 వచ్చినట్టేనని భావిస్తున్న రైతులు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఈలెక్కన సగటున బస్తా రూ.1350లకు విక్రయిస్తే తేమరూపంలో కలిసొచ్చే రూ.120 కలిపితే బస్తాకు రూ.1470 వరకు ధర వచ్చినట్లు లెక్కకడుతున్నారు. మద్దతు ధరతో పోల్చితే బస్తాకు రూ.75 తగ్గినా రైతులు ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. అదే సాధారణ రకాలు 75 కిలోల బస్తా రూ.1160 ధరకు కొనుగోలు చేస్తున్నారు. తేమ రూపంలో మరో రూ.120 కలిసినా బస్తాకు రూ.250 వరకు నష్టపోతున్నారు. సాధారణ రకాల రైతులకు మద్దతు ధరతో పోల్చితే భారీనష్టం వాటిల్లుతోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు.
వానొస్తే తీరని నష్టం
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం వల్ల గురువారం నుంచి మూడు రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్రలో చాలాచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటనతో రైతులు వణికిపోతున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో వరి కోతలు మొదలయ్యాయి. గుంటూరు జిల్లాల్లో ముమ్మరంగా కోతలు సాగుతుండగా బాపట్లలో ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభిస్తున్నారు. ఈనేపథ్యంలో వర్షం వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వాయుగుండం తీవ్రతతో గాలులు వీస్తే వరి పంట నేలకొరిగా నష్టం వాటిల్లుతుంది. గాలికి నేలవాలిన వరిపై ఒక మోస్తరు వర్షం పడినా ధాన్యం నాణ్యత దెబ్బతిని మొలకెత్తే ప్రమాదం ఉందని కర్షకులు వాపోతున్నారు. గతేడాది కూడా కోతల సమయంలో వచ్చిన నివర్ తుపాను తీవ్రనష్టం కలగజేసింది. ఈఏడాది వరి దిగుబడులు కొంత ఆశాజనకంగా ఉండటంతో రైతులు పెట్టుబడులతోపాటు కొంత మిగులు ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షం వస్తే కోలుకోలేని దెబ్బపడుతుందని ఆందోళన చెందుతున్నారు. వర్షం వల్ల ఆరబెట్టిన ధాన్యంతోపాటు కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటకు నష్టం జరుగుతుంది. వరి పంట నేలవాలితే కోతకు యంత్రాలకు వెచ్చించే ఖర్చు పెరుగుతుంది.
ఆరబెట్టుకునే వెసులుబాటు లేక..
రైతులు యంత్రాలతో కోత కోసిన తర్వాత నాలుగు నుంచి ఐదు రోజులు ఆరబెట్టుకుని తీసుకు వస్తేనే తేమశాతం 17 ఉంటోంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో వారం రోజుల తర్వాత కోత కోయాల్సిన పంటను పొలంలో తడి ఉన్న వెంటనే కోత కోస్తున్నారు. దీంతో 28 నుంచి 30 శాతం తేమ ఉంటోంది. వాతావరణం చల్లగా ఉండటంతో ఆరబెట్టడానికి ఐదు రోజుల సమయం పడుతోంది. దీంతో ప్రైవేటు వ్యాపారులు తేమశాతంతో సంబంధం లేకుండా పొలాల వద్దే తూకం వేసి తీసుకెళ్తున్నారు. వారం రోజుల్లో నగదు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం పెట్టిన షరతులు మేరకు ధాన్యం తీసుకెళ్లాలంటే ఆరబెట్టడానికి సొమ్ము వెచ్చించడంతోపాటు స్థలం లేనందున అమ్ముకుంటున్నామని రైతులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు