లక్ష్యాన్ని మించి వసూళ్లు
లక్ష్మీపురానికి చెందిన అశోక్ జాతీయ రహదారిపై పరిమితికి మించి వేగంగా కారు నడిపారు.
తనిఖీలతో రవాణా శాఖకు రాబడి
పట్టాభిపురం(గుంటూరు), న్యూస్టుడే
తనిఖీ చేస్తున్న రవాణా శాఖ అధికారులు
లక్ష్మీపురానికి చెందిన అశోక్ జాతీయ రహదారిపై పరిమితికి మించి వేగంగా కారు నడిపారు. అతి వేగంగా ప్రయాణించినందుకు రూ.1000 అపరధారుసుం చెల్లించాలని నేరుగా ఇంటికి పోస్టులో రవాణా శాఖ నుంచి ఉత్తరం వచ్చింది. దీనిని చూసి ఆయన నివ్వెరపోయారు. అంత వేగంగా ఎప్పుడు కారు నడిపానా.. అని ఎంత ఆలోచించినా గుర్తుకు రాలేదు. సరేలెమ్మని అపరాధరుసుం చెల్లించారు.
శ్యామలనగర్కు చెందిన దుర్గారావు సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాన్ని నడిపారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్ డ్రైవింగ్ చేసినందుకు రూ.1500 జరిమానా విధించారు. అపరాధరుసుం చెల్లించేందుకు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లారు. జరిమానా చెల్లించాక అసలు విషయం ఆయనకు బోధపడింది. రెండోసారి కూడా ఈ విధంగా చేస్తే రూ.10,000 అపరాధరుసుం చెల్లించాల్సి ఉంటుందని రవాణా శాఖ సిబ్బంది తెలియజేయడంతో అవాక్కయ్యారు. ఎందుకు వచ్చింది లెమ్మని అప్పటి నుంచి సెల్ఫోన్ డ్రైవింగ్ చేయడం స్వస్తి పలికారు.
రాజేంద్రనగర్కు చెందిన ప్రవీణ్ కారు కొనుగోలు చేసి ప్యాన్సీ నెంబర్ కోసం ఎదురు చూసే క్రమంలో పనుల హడావుడిలో పడి రిజిస్ట్రేషన్ చేయించడం మరచిపోయారు. రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేయడంతో వాహనానికి రిజిస్ట్రేషన్ చేయించని విషయం గుర్తుకు వచ్చింది. ఫలితంగా రూ.2000 అపరాధరుసుం చెల్లించాల్సి వచ్చింది.
సీతమ్మ కాలనీకి చెందిన కోటయ్య ట్రాక్టర్లో పరిమితికి మించి ఇసుక తరలిస్తూ రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డారు. పరిమితికి మించి సరకు ఓవర్లోడింగ్ చేసినందుకు టన్నుకు రూ.2000 అదనంగా చెల్లించారు. ఇలా.. రహదారి భద్రత నియమ, నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వాహనాలు నడపడం వల్ల అపరాధరుసుం చెల్లిస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు.
నిబంధనలు పాటించడం ఉత్తమం...
రవాణా శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తుండటంతో ఆ శాఖ లక్ష్యానికి మించి వసూళ్లు రాబడుతుంది. వరుసగా రెండు నెలలు 100 శాతం పైగానే రవాణా శాఖ లక్ష్యం సాధించింది. ముచ్చట పడి కొనుగోలు చేసిన వాహనాన్ని వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తనిఖీల్లో పట్టుబడితే చేతి చమురు వదిలించుకోవాల్సిందే. లైసెన్స్ లేకుండా, సీటుబెల్టు, శిరస్త్రాణం ధరించకుండా వాహనాలు నడిపినా జేబులు గుల్లే. సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలను నడపడం అధిక శాతం మంది చేస్తుంటారు. అలా చేయడం వల్ల ప్రమాదాలు జరిగితే రెప్పపాటు కాలంలో ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం. మద్యం తాగి వాహనాలు నడిపే కుర్రకారు ఇటీవల కాలంలో ఎక్కువైపోతున్నారు. ర్యాష్ డ్రైవింగ్కు ఇక కొదవే లేదు. పవర్బైక్లను వంకర్లు తిప్పుతూ స్నేక్ డ్రైవింగ్ అంటూ ఎదుటి వారిని బెంబేలెత్తిస్తున్నారు. ముఖ్యంగా మనం నడిపే వాహనానికి బీమా చేయాలి. వాహనం పాతబడే కొలదీ చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇవన్నీ పక్కాగా పాటిస్తే రవాణా, పోలీస్ శాఖ అధికారులు నమోదు చేసే కేసుల నుంచి తప్పించుకోవచ్చు. అంతేగాదు వందలు, వేల రూపాయల్లో జరిమానాలు చెల్లించే అవసరం కూడా ఉండదు. కరోనా తర్వాత రోడ్లపై రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఎవరికి వారు సొంతంగా వాహనాలను సమకూర్చుకుంటున్నారు. నిబంధనలు మాత్రం అధిక శాతం మంది పాటించడం లేదు. పక్కాగా నిబంధనలు పాటించే వారు 40 శాతం కూడా ఉండరని రవాణా శాఖ అంచనా.
రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన
రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇందులో భాగంగా వాహనదారులకు తరచూ అవగాహన కల్పిస్తున్నాం. రోడ్డు భద్రత నియమ, నిబంధనలపై కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు, అన్ని వాహనాల డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. లైసెన్స్ల మేళాలు నిర్వహించి లైసెన్స్లు జారీ చేస్తున్నాం. నిబంధనలు పాటించకపోతే మాత్రం తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి అపరాధరుసుం వసూలు చేస్తున్నాం.
షేక్ కరీం, గుంటూరు డీటీసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుంటూరు జిల్లాలో ప్రబలిన డయేరియా.. 100 మందికి పైగా అస్వస్థత
[ 19-04-2024]
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో గ్రామంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. -
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!