సస్పెండైన మేనేజర్ను స్టేషన్లో అప్పగించిన ఉద్యోగులు
జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో నకిలీ పత్రాలతో కోట్లలో రుణాలు పొందిన విషయం అందరికీ తెలిసిందే.
కలెక్టరేట్కు వచ్చిన సస్పెండైన సొసైటీ కార్యదర్శులు
కలెక్టరేట్(గుంటూరు), న్యూస్టుడే: జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో నకిలీ పత్రాలతో కోట్లలో రుణాలు పొందిన విషయం అందరికీ తెలిసిందే. నకిలీ పత్రాలను తీసుకుని రుణాలు ఇచ్చిన ప్రత్తిపాడు బ్రాంచి మేనేజర్ రవిని అప్పట్లోనే బ్యాంకు పాలకవర్గం సస్పెండ్ చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆయన తిరిగి ఉద్యోగం ఇప్పించాలంటూ బ్యాంకుకు రావడం చర్చకు దారి తీసింది. విషయం తెలియడంతో ఆయన హయాంలో బ్రాంచి పరిధిలో పని చేసి సస్పెన్షన్కు గురైన సొసైటీ కార్యదర్శులు ఆగమేఘాలపై బ్యాంకు వద్దకు వచ్చారు. అక్రమ రుణాల విషయంపై ఆయన్ని గట్టిగా నిలదీశారు. అనంతరం అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లి కలెక్టర్ వద్ద జరిగిన తంతును వివరించారు. దీనిపై కలెక్టర్ ఆయనపై కేసు నమోదైనందున స్టేషన్లో అప్పజెప్పాలని సూచించినట్లుగా తెలిసింది. కోట్ల రూపాయల అక్రమ రుణాలు మంజూరు చేసి సస్పెండైన మేనేజర్ తిరిగి తనకు ఉద్యోగం ఇవ్వాలని పాలకవర్గాన్ని కోరడం ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులందరిలోనూ చర్చనీయాంశమైంది.
* జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని బ్రాంచుల్లో నకిలీ ధ్రువపత్రాలతో అక్రమంగా రుణాలు పొందిన విషయం అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ప్రత్తిపాడు బ్రాంచిలో సుమారుగా రూ.5 కోట్ల వరకు రుణాలు ఇచ్చినట్లు బయటకు వచ్చింది. ఆ తర్వాత మరికొన్ని బ్రాంచులు, సొసైటీలు ఇదే కోవలో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించి, పలువురు సొసైటీ కార్యదర్శులు, బ్రాంచి మేనేజర్లను సస్పెండ్ చేశారు. అక్రమ రుణాలు వాస్తవమేనని తెలియడంతో ఆయనపై ప్రత్తిపాడులో కేసు నమోదు చేశారు. తర్వాత ఆయన ఆచూకీ లభ్యం కాలేదని పోలీసులు వదిలేశారు. విచారణలో ఆయనతోపాటు, ఆయా బ్రాంచి పరిధిలోని సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శుల ఆస్తులను సహకార శాఖ అటాచ్ చేసింది. ప్రస్తుతం రవి బ్యాంకుకు వచ్చి ఉద్యోగం ఇప్పించాలని కోరడంతో వారంతా కూడా ఆయన్ని పోలీస్టేషన్లో అప్పజెప్పేందుకు సిద్ధమయ్యారు. తొలుత పాలకవర్గాన్ని ఆశ్రయించిన సస్పెండైన ఉద్యోగులు, సొసైటీల అధ్యక్షులు ఆ తర్వాత సహకార శాఖ అధికారిని, జిల్లా కలెక్టర్ను కలిసి విషయం వివరించారు. ప్రత్తిపాడు స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదు కావడంతో మేనేజర్ రవిని స్టేషన్లో అప్పజెప్పినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ డీజీపీని బదిలీచేయండి: ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు
[ 25-04-2024]
డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో భాజపా నేతలు మరోమారు ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా