అండగా ఉంటా.. అదుకుంటా..
తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పొన్నూరులో ఆటోనగర్ ఏర్పాటుకు తగు చర్యలు చేపడతామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
ఘనంగా ముస్లింమైనార్టీ ఆత్మీయ సమావేశం
మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు. వేదికపై షరీఫ్, నరేంద్ర, కొమ్మాలపాటి,
శ్రావణ్ కుమార్, నసీర్ అహ్మద్, మైనార్టీ నాయకులు
పొన్నూరు, న్యూస్టుడే: తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పొన్నూరులో ఆటోనగర్ ఏర్పాటుకు తగు చర్యలు చేపడతామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శుక్రవారం పొన్నూరు పట్టణం జీబీసీ రోడ్డులోని పరందయ్య కల్యాణమండపంలో ‘ముస్లిం మైనార్టీల ఆత్మీయ’ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల ఉపాధిని దెబ్బతీసిన ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. శాసన మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ అహ్మద్ మాట్లాడుతూ తెదేపా అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారికి అండగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి ముస్లింలను చేసింది ఏమి లేదన్నారు. ఈ వర్గాన్ని ప్రభుత్వం పూర్తిగా మోసగించిందన్నారు. విదేశీ విద్య వల్ల అనేక మంది పేద వర్గాలకు చెందిన యువత ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థానంలో నిలబడ్డారని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ విద్య పథకానికి పైసా కేటాయించలేదని విమర్శించారు. అనంతరం ముస్లిం సోదరులతో చంద్రబాబు మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
అజ్మీర్ చాదర్ను చంద్రబాబు నుంచి తీసుకుంటూ..
* తెదేపాలో పలువురి చేరిక.. పెదకాకాని మండలం వైసీపీ మైనార్టీసెల్ అధ్యక్షుడు షేక్ ఆలావుద్దీన్, పొన్నూరు మండలం జూపుడి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సజ్జా కృష్ణబాబు తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరారు.
* పొన్నూరు మసీదులు వక్ఫ్బోర్డు పరిధిలో ఉన్నాయి. ఆ మసీదు చుట్టుపక్కల ఉన్న మూడున్నర ఎకరాల వరకు ఆ బోర్డు పరిధిలోకి తీసుకువెళ్లారు. సొంత స్థల యజమానులు పలు ఇబ్బందులు పడుతున్నారు.
చంద్రబాబు : తాము అధికారంలోకి రాగానే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూస్తాం.
* పొన్నూరు పరిసర ప్రాంతాల్లో మసీదులకు సరైన డాక్యుమెంట్లు లేక అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తారా?
షేక్ నిజాముద్దీన్
చంద్రబాబు : మా ప్రభుత్వం రాగానే మసీదులకు కావాల్సిన డాక్యుమెంట్లు కల్పించేలా తగు చర్యలు తీసుకుంటాం.
* ఇతర రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి స్వర్ణవృత్తికారులు రావడంతో స్థానికంగా ఉన్న తమకు ఉపాధి లేకుండా పోయిందని తమను ఆదుకోవాలి
షేక్ అబ్దుల్ ఖాదర్
చంద్రబాబు : తెదేపా అధికారంలోకి రాగానే స్వర్ణవృత్తికారులకు ఉపాధి కల్పించేలా తగు చర్యలు చేపడతాం.
* వక్ఫ్బోర్డు ఆస్తులను కబ్జా చేస్తున్నారు.ఆస్తులను పరిరక్షించడం లేదు. దీంతో ఆస్తులను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది
షేక్ హుస్సేన్
చంద్రబాబు : వక్ఫ్బోర్డు ఆస్తులను కాపాడేందుకు అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి వాటిని రక్షించేలా తగు చర్యలు తీసుకుంటాం.
* మూడేళ్లుగా దుల్హన్ పథకం అమలు చేయడం లేదు. ఇటీవల ఆ పథకాన్ని అమలు చేయడానికి ఉన్న నిబంధనల కారణంగా అనేక మంది అర్హత కోల్పోతున్నారు. కళ్యాణ మిత్రలకు 18 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు.
షేక్ మస్తాన్బీ.
చంద్రబాబు : మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనలు సడలించి అర్హులైన ప్రతి ముస్లిం కుటుంబానికి దుల్హన్ పథకం అందేలా చూస్తాం.
* ‘వస్తున్నా-మీ కోసం’ చంద్రబాబు పాదయాత్ర, ‘ఇదేమి ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా పర్యటనలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, వైసీపీ గుండాల ప్రయత్నాలను తిప్పికొడుతూ ఈ యాత్రను విజయవంతం చేయడంలో చంద్రదండు ప్రకాష్నాయుడు ఆధ్వర్యంలో కీలక పాత్ర పోషించింది.
పొన్నూరులో చంద్రదండు దళ సభ్యులకు సూచనలు చేస్తున్న ప్రకాష్నాయుడు
ముగిసిన చంద్రబాబు పర్యటన..
‘ఇదేమి ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తేదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పర్యటన నియోజకవర్గ పరిధిలోని చింతలపూడి, మాచవరం అడ్డరోడ్డు, ములుకుదురు గ్రామాల్లో జరిగిన రోడ్షో అనంతరం శుక్రవారం ముగిసింది. చింతలపూడిలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.వారు పూల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని ఇంటికి పంపేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుంటూరు జిల్లాలో ప్రబలిన డయేరియా.. 100 మందికి పైగా అస్వస్థత
[ 19-04-2024]
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో గ్రామంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. -
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్