ఆక్రమణల తొలగింపు మాటున రూ.కోట్లు కొల్లగొట్టడానికి కుట్ర
ఆక్రమణల తొలగింపు పేరుతో కోట్లాది రూపాయలు దండుకోవడానికి వైకాపా నాయకులు కుట్ర చేస్తున్నారని తుళ్లూరు మండలం వడ్డమాను చెరువుకట్ట వాసులు ఆరోపించారు.
వడ్డమాను వాసుల ఆరోపణ
వడ్డమానులో చెరువు కట్టపై అధికారులు తొలగించిన రేకుల షెడ్డు
గుంటూరు, న్యూస్టుడే: ఆక్రమణల తొలగింపు పేరుతో కోట్లాది రూపాయలు దండుకోవడానికి వైకాపా నాయకులు కుట్ర చేస్తున్నారని తుళ్లూరు మండలం వడ్డమాను చెరువుకట్ట వాసులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం చెరువుకట్టపై గృహాలు నిర్మించుకున్న ఆక్రమణదారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికి రాజకీయనాయకుల ఒత్తిడితో బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఇళ్లను పంచాయతీ సిబ్బంది తొలగించడం దారుణమన్నారు. స్థానిక ఎమ్మెల్యేతో కుమ్మక్కై గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయుకులు ఈ కుట్రకు తెరలేపారని మండిపడ్డారు. గ్రామంలోని 123 సర్వే నెంబరులో చెరువుకట్టపై 50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నామని వారు తెలిపారు. 17 ఎకరాల విస్తీర్ణం ఉన్న చెరువు భూముల్లో నివాసముంటున్న వారి మధ్య విభేదాలు సృష్టించడానికి కావాలనే కొంతమందికి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. రాజకీయంగా కొందరిని దెబ్బతీయడానికి అధికారుల అండతో ఇళ్లు ఖాళీ చేయించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ గ్రావెల్ అమ్ముకోవడానికి కొందరు భూములు కొన్నారని, తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో వదిలేసి వెళ్లిపోయారని వెల్లడించారు. మళ్లీ ఇప్పుడు గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు తెచ్చుకొని, రూ.కోట్లు కొల్లగొట్టడానికి వైకాపా నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని చెరువుకట్ట వాసులు విమర్శించారు.
ఇది మా వాళ్ల పనే: వైకాపా నాయకులు
ఈ విషయంలో సొంత పార్టీ నేతల నుంచీ విమర్శలు వస్తున్నాయి. పంచాయతీ అధికారులు చెరువు కట్టపై రెండు రోజుల తొలగించిన ఇంటిని వైకాపా జిల్లా ప్రచారకమిటీ అధ్యక్షుడు ఆళ్ళ పూర్ణచంద్రరావు గురువారం పరిశీలించి మాట్లాడుతూ ఇది గ్రావెల్ అమ్ముకోవడానికి తమ పార్టీ నేతలు చేస్తున్న కుట్రేనని చెప్పారు. పేదలకు అండగా ఉండాల్సిన నాయకులు వారికి గూడు లేకుండా చేయడం దారుణమన్నారు. చెరువు కట్టపై దగ్గరుండి ఇళ్లు వేయించిన గ్రామంలోని కొంతమంది పార్టీ నాయకులే.. ఇప్పుడు అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చి పడగొట్టిస్తున్నారని విమర్శించారు. పార్టీకి చెడ్డపేరు తీసుకు వస్తున్న నాయకులను వైకాపా నుంచి బహిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!